BDK: పాల్వంచ ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న 8 మంది కానిస్టేబుళ్లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణతో పాటు మరో ఏడుగురికి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సమయంలో మరో 10 మంది కానిస్టేబుళ్లు పాల్వంచలో విధుల్లో చేరినట్లు అధికారులు తెలిపారు. శాఖలో బదిలీల ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం.