NDL: నంద్యాల జిల్లాలో టమాటా సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. జనవరిలో కిలో రూ. 60 పలికిన ధర ప్రస్తుతం రూ. 4కు చేరుకోవడంతో అన్నదాతలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 6 ఎకరాల్లో సాగు చేసిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పెట్టుబడి కూడా రాని పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.