సత్యసాయి: పరిగి మండలం PHCలను డీఎంహెచ్ఓ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జై భీమ్ పార్టీ నాయకులు డీఎంహెచ్ఓకు వినతి పత్రం అందజేశారు. జై భీమ్ పార్టీ జిల్లా అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ.. జిల్లాలో కొత్తగా ఏర్పడిన PHCలకు నిధులు మంజూరు చేయాలని కోరారు. కొత్తగా ఏర్పడిన PHCలకు స్థలం కేటాయించినప్పటికీ భవననిర్మాణాలు మొదలు కాలేదన్నారు.