AKP: ఉగాది సందర్భంగా అచ్యుతాపురం మండలం కొండకర్లలో నిర్వహించిన మండల స్థాయి చదరంగం పోటీలు శనివారం ముగిసాయి. ఈ పోటీల్లో తిమ్మరాజుపేటకు చెందిన పీ శ్రీనివాసరావు ప్రథమ స్థానం దక్కించుకున్నారు. ద్వితీయ స్థానంలో అనకాపల్లికి చెందిన కె తేజ, మూడవ స్థానంలో తిమ్మరాజుపేటకు చెందిన పీ నాగు, జూనియర్ విభాగంలో కౌశిక్, చైతన్య ప్రథమ ద్వితీయ స్థానం సాధించారు.
VSP: ఒడిశాకు చెందిన వ్యక్తి విశాఖలోని లాడ్జిలో దిగారు. ఐదుగురు వ్యక్తులు ఆయనను పరిచయం చేసుకొని మద్యం కొనుగోలు చేయించి దాడి చేశారు. అనంతరం సెల్ ఫోన్, నగదు దోచుకున్నారు. బాధితుడు ఎంవీపీ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సుంకరి గౌతమ్, కన్నన్ చందు, వంగర సాయిదినేశ్, నిశాంత్ రెడ్డి, జగదీశ్ను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు CI చక్రధర్ రావు తెలిపారు.
కోనసీమ: సఖినేటిపల్లి మండలం పల్లెపాలెం మత్స్యకారుల వలకు శనివారం రెండు అరుదైన ఆడ కచ్చిడి చేపలు చిక్కాయి. ఔషధాల తయారీలో వీటిని వినియోగిస్తారని మత్స్యకారులు తెలిపారు. అయితే ఇవి ఆడ చేపలు కావడంతో ఆశించిన స్థాయిలో ధర రాదని, అదే మగ చేపలు అయితే భారీ ధర పలికేవని మత్స్యకారులు పేర్కొన్నారు. సముద్రంలో వేటకి వెళ్లిన సమయంలో ఈ చేపలు లభించాయని తెలిపారు.
NDL: 30 రోజులలో శ్రీశైల మల్లన్నకు భక్తులు సమర్పించిన కానుకలను శనివారం లెక్కించారు. రూ.7,19,58,064 నగదు రాబడిగా లభించిందని ఆలయ అధికారులు తెలిపారు. 122 గ్రాముల బంగారు, 6 కేజీల వెండి, విదేశీ కరెన్సీ లభించిందని, పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్ల మధ్య, సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఈవో ఎం.శ్రీనివాసరావు, తదితరులు ఉన్నారు.
ELR: విద్యార్థులందరూ చదువులోనే కాకుండా క్రీడల్లో, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడంలో ముందుండాలని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. శనివారం రాత్రి జంగారెడ్డి గూడెం మండలం వేగవరంలో ప్రైవేట్ స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. విద్యార్థులు విద్యతో పాటు సాంస్కృతిక రంగాలలోనూ ముందుండాలని సూచించారు.
W.G: భీమవరంలో శనివారం రాష్ట్ర స్థాయి అండర్-23 పురుషుల, మహిళల ఓపెన్ బాక్సింగ్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘సాగి రామకృష్ణంరాజు ట్రోఫీ-2026’ పేరిట ఈ ఛాంపియన్ షిప్ను నిర్వహిస్తున్నారు. యువ క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని ప్రోత్సహించడమే ఈ పోటీల ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
E.G: కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. కోలమూరు పంచాయతీ రాయుడుపాకలో ఉపాధి హామీ కూలీల సమస్యలను శనివారం స్వయంగా తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడి సమస్యలు వెంటనే పరిష్కరించాలని, ఐరిస్ పడని వారికి బయోమెట్రిక్ సౌకర్యం కల్పించాలని సూచించారు.
GNTR: దుగ్గిరాల మండలం పెదపాలెం శ్రీకోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 25వ తేదీ నుంచి 28 వరకు జరుగుతాయని ధర్మకర్తలు వాసిరెడ్డి దుర్గాప్రసాద్, పుతుంబాక సత్యసాయికృష్ణ, వాసిరెడ్డి శ్రీకృష్ణ, నాగార్జున తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి, ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు.
అన్నమయ్య: గాలివీడు మండలం గండిమడుగులో శనివారం ఒక మహిళ మృతదేహం లభ్యమైంది. నంది మండలానికి చెందిన అనితమ్మ (69) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం లక్కిరెడ్డిపల్లి ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
WG: తణుకు పట్టణానికి చెందిన ప్రముఖ సినీ గేయ రచయిత రసరాజు రాసిన చేతనాకేతనం పద్య కవిత సంపుటి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శనివారం రాత్రి ఆవిష్కరించారు. సజ్జాపురం రామకృష్ణ మఠం ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సాహితీ వినీలాకాశంలో తణుకును తళుక్కుమనేలా చేసిన అద్భుత సాహితీ ప్రతిభాశాలి అని కొనియాడారు.
SKLM: మాదక ద్రవ్యాలు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని పొన్నూరు ఎస్సై సత్యనారాయణ హెచ్చరించారు. గంజాయి, మత్తు పదార్థాలు, ప్రభుత్వం నిషేధించిన వాటిని ఎవరైనా రవాణా చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. మాదకద్రవ్యాలు రవాణా చేస్తున్న ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు.
NDL: ప్యాపిలి మండలం బురుగులలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయ పునరుద్ధరణ పనుల కోసం డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి రూ.లక్ష విరాళం ప్రకటించారు. ఆ విరాళాన్ని డోన్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆలయ నిర్వాహకులకు శనివారం అందజేశారు. ఆలయ పునరుద్ధరణకు సహకరించినందుకు ఎమ్మెల్యేకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.
VSP: ఆంధ్రప్రదేశ్లో నిలిచిపోయిన నంది అవార్డులను త్వరలోనే అందజేస్తామని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. కళాకారులకు తగిన గుర్తింపు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విశాఖపట్నాన్ని ప్రధాన సినీ నిర్మాణ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.
TPT: తిరుపతిలో శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో శనివారం గరుడ సేవ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సుమధుర భక్తి గీతాలు, నృత్య ప్రదర్శనలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆలయ పరిసరాలు రామనామంతో మారుమోగాయి.
KRNL: ఆలూరు మండలం కమ్మరచేడులో ఈనెల 27న జరగనున్న శ్రీరామనవమి వేడుకల సందర్భంగా గ్రామస్థులు వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. గ్రామ పెద్దలు, యువకులు ఆయనను కలుసి కార్యక్రమానికి విచ్చేసి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.