అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పశువులకు నీటి సమస్య తలెత్తకుండా నీటితోట్ల నిర్మిస్తున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సందేపల్లి మండలం, కొండావాండ్లపల్లెలో పశువుల నీటి తొట్ల నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. మంత్రి మాట్లాడుతూ.. పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని తెలిపారు.
NTR: జగ్గయ్యపేట పట్టణం బలుసుపాడు రోడ్డు ఈద్గా దర్గా నందు రంజాన్ పండగ సందర్బంగా ముస్లిం సోదరులతో కలిసి నమాజ్లో పాల్గొని ముస్లిం సోదరులందరికీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉపవాస దీక్షలు ముగించుకొని, భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగ, ప్రతి ఒక్కరికి సన్మార్గాన్ని చూపించి, దేవుని యందు భక్తి విశ్వాసముండాలని తెలిపారు.
కృష్ణా: ఘంటసాల మండలం గోటకం కాలనీ ఆర్థిక సమతా మండలి కమ్యూనిటీ హాలులో సోమవారం నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ వైద్య శిబిరంలో అవనిగడ్డ బ్రాంచ్, రేపల్లె కంటి ఆసుపత్రి డాక్టర్ కిషోర్, డాక్టర్ దాస్ పర్యవేక్షణలో ఆప్తో మెట్రిస్ట్ మేరుగు ప్రవీణ్ 180మందికిపైగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు అందించారు.
KRNL: మార్చి 31తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఆస్తి, ఖాళీ స్థలం పన్ను వసూళ్లు కర్నూలులో అధికారులు, సిబ్బందితో వేగవంతం చేసినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్ర బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పక్కా ప్రణాళికతో పకడ్బందీగా పన్ను వసూళ్లను చేపట్టామని, గణనీయ పురోగతి సాధించడం జరిగిందన్నారు.
ATP: ముస్లిం సోదరులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని, వారికి అన్ని రకాలుగా అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ముస్లింలకు పవిత్ర రంజాన్ పురస్కరించుకొని ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం పట్టణంలోని ఈద్గా మైదానం వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ATP: గుత్తిలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత విచిత్రమైన దొంగతనం జరిగింది. తాడిపత్రి రోడ్డులోని మురళీకృష్ణ జనరల్ స్టోర్లో ఉప్పు ప్యాకెట్లు చోరీకి గురయ్యాయి. ఓ మహిళ ముఖానికి మాస్కు ధరించి అంగడి బయట ఉన్న 15 ఉప్పు ప్యాకెట్ల డబ్బాను ఎత్తుకెళ్లింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. షాపు యజమాని ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టామన్నారు.
ATP: అక్కమాంబ అమ్మవారి జాతర సందర్బంగా ఆలయంలో కొలువైన శ్రీ అక్కమహాదేవి, పరమేశ్వరుడికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు, వారి సోదరుడు అమిలినేని ఎర్రిస్వామి పట్టు వస్త్రాలు అందించారు. పట్టు వస్త్రాలతో వచ్చిన ఎమ్మెల్యేకి ఆలయ కమిటీ ఛైర్పర్సన్ పద్మావతి ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ATP: గుత్తి ఈద్గాలో సోమవారం రంజాన్ ప్రార్థనలకు మేనమామతో కలిసి వచ్చిన లాల్ ఖాసీం అనే ఐదేళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. సజ్జలదిన్నెకు చెందిన లాల్ ఖాసీం తన మేనమామ కమల్ భాషతో కలిసి ఆదివారం రంజాన్ పండుగకు వచ్చాడు. సోమవారం మేనమామతో కలిసి గుత్తి ఈద్గాలో ప్రార్థనలకు వచ్చాడు. ప్రార్థనలు అనంతరం లాల్ ఖాసీం కనిపించలేదు. బాలుడు ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పల్నాడు: క్రోసూరు ఎస్సై నాగేంద్రను వీఆర్కు పంపుతూ ఎస్పీ శ్రీనివాసరావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారని సీఐ సురేశ్ తెలిపారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఎస్సై నాగేంద్ర క్రోసూరు ఎస్సైగా విధులు నిర్వర్తించారు. వీఆర్కు గల కారణాలు తెలియాల్సి ఉంది. త్వరలో ఇన్ఛార్జ్ ఎస్సై రానున్నారని సీఐ తెలిపారు.
PPM: సాలూరులో ఆదివారం నుంచి ప్రారంభమైన శ్రీరామనవమి ఉత్సవాలలో మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర పాల్గొన్నారు. విశ్వావసు నామ సంవత్సరాన్ని (ఉగాది) పురస్కరించుకుని సాలూరు పట్టణంలో వెలమపేట, డబ్బివీధి ప్రజలు శ్రీరాములు స్వామి వారి విగ్రహాలను కోలాటాలతో, మేళతాళాలతో రథంలో ఊరేగిస్తూ వారి మండపాలకు తీసుకువచ్చారు. రాజన్నదొర భక్తులతో కలిసి రథాన్ని లాగారు.
VSP: సింధియా నుంచి గాజువాక వెళ్లే దారిలో జింక్ గేట్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో సమీపంలోని ఉన్న దుకాణదారులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనకు గల కాణాలు తెలియాల్సి ఉంది.
VSP: రంజాన్ పండుగ సందర్భముగా ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో విశాఖ సీపీ ఆఫీసులో ప్రతి సోమవారం జరిగే “ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ ఆదివారం తెలిపారు. విశాఖ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ప్రజలకు అత్యవసర పరిస్థితిలో దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లలో, కంట్రోల్ రూమ్ నంబర్కు సంప్రదించాలన్నారు.
కృష్ణా: విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదివారం ఉగాది సందర్భంగా కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే బృందానికి ఆశీర్వచనం అందజేసి తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ప్రజలంతా ఆరోగ్యంగా, సుభిక్షంగా ఉండాలని దుర్గమ్మను ప్రార్థించి మొక్కులు చెల్లించుకున్నట్లు సుజనా తెలిపారు.
BPT: బాపట్ల మండలం చెరువు జమ్ములపాలెం ఉన్నత పాఠశాలలో ఆదివారం రాష్ట్రస్థాయి పోటీలకు బాపట్ల జూనియర్ హాకీ బాలుర జట్టును ఎంపిక చేసినట్లు హాకీ బాపట్ల సంఘం కార్యదర్శి వీర చంద్ర తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఏప్రిల్ 6 నుంచి ధర్మవరంలో జరిగే రాష్ట్రస్థాయి హాకీ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటారని వివరించారు.
SKLM: అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్లు అని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. ఈ మేరకు పోలాకి మండలం CP రోడ్డు నుండి చీడివలస వరకు రూ.1.75 లక్షలతో 3200 మీటర్లు తారు రోడ్డు నిర్మాణానికి ఆదివారం భూమి పూజచేసి, శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల హామీలలో భాగంగా ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటి నెరవేరుస్తున్నామన్నారు.