కృష్ణా: పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు ములుపూరి గోవింద ప్రభాకర్ రావు మరణించారు. ఆయన అంతిమయాత్ర మంగళవారం ఉదయం 9 గంటలకు కపిలేశ్వరపురం గ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభాకర్ రావుకు నివాళులర్పించి.. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన అంకితభావంతో సేవలందించారని నాయకులు కొనియాడారు.