GNTR: మాజీ సీఎం వైఎస్ జగన్ అబద్ధాల్లో ఆస్కార్ అవార్డు తీసుకున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎద్దేవా చేశారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో శుక్రవారం మంత్రి గుమ్మడి సంధ్యరాణి మీడియాతో మాట్లాడారు. గత ఏడాది ఏప్రిల్, మే నెలలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.20వేల కోట్లను ఏం చేశారో చెప్పాలని అన్నారు.
AKP: భూ యజమానులకు, సర్వే సిబ్బంది, రెవిన్యూ సిబ్బందికి, రీ-సర్వేలో వచ్చిన సందేహాలు నివృత్తి చేయడానికి జిల్లా స్థాయిలో రీ-సర్వే నిపుణుల సెల్ ఏర్పాటు చేసినట్టు అనకాపల్లి జాయింట్ కలెక్టర్ ఎమ్.జాహ్నవి తెలిపారు. పైలెట్ ప్రోజెక్టుగా మండలానికి ఒక గ్రామం చొప్పున రీ-సర్వే నిర్వహించడం జరుగుందన్నారు.
PPM: సాలూరు ఎమ్మెల్యే, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శుక్రవారం మంగళగిరి టీడీపీ సెంట్రల్ ఆఫీసులో ప్రజల నుండి ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు తమ సమస్యలను మంత్రికి తెలియజేశారు. ఆమె ప్రతి ఫిర్యాదును ఓపిగ్గా వినిపించి, తగిన పరిష్కార చర్యలు తీసుకోవడానికి అధికారులకు సూచనలు ఇచ్చారు.
ASR: పాడేరు ఐటీడీఏ పీవోగా వీ.అభిషేక్ అందించిన సేవలు మరువలేనివని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కొనియాడారు. బదిలీపై వెళుతున్న పీవోకు శుక్రవారం పాడేరులో నిర్వహించిన అభినందన సభలో పాల్గొని మాట్లాడారు. ఐటీడీఏ పరిధిలోని 11 మండలాల్లో రహదారి నిర్మాణాలు, తాగునీటి సౌకర్యాల కల్పనకు పీవో వీ.అభిషేక్ కృషి చేశారని తెలిపారు. ఆయన మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు.
W.G: ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగుల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇరగవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ.శ్రీనివాస్ కోరారు. ఈ నెల 10న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పురస్కరించుకుని శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం నులిపురుగుల నివారణ మాత్రలను అందజేసి వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు.
పల్నాడు: ఏపీఎస్ ఆర్టీసీ హెవీ మోటర్ వెహికల్ డ్రైవింగ్ ట్రైనింగ్ స్కూల్లో శిక్షణ పూర్తిచేసుకున్న డ్రైవర్లకు డిపో మేనేజర్ జీవీఎస్వీవీ కుమార్ శుక్రవారం సర్టిఫికెట్లను అందజేశారు. 18వ బ్యాచ్ శిక్షణ పూర్తిచేసుకున్న వారికి సర్టిఫికెట్ల ప్రదానం చేసినట్లు చెప్పారు. 19వ బ్యాచ్ అడ్మిషన్లు జరుగుతున్నట్లు తెలిపారు.
SKLM: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపిన డోలా, పిన్నింటిపేట, నౌపడా రహదారి(33.2కిలోమీటర్లు)కి రూ. 55.7 కోట్లు నిధులు మంజూరు కావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారి మూలపేట పోర్టుకు మణిహారం లాంటిదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ రహదారి కోసం చొరవ చూపిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకి ప్రజలు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు.
VZM : విజయనగరం పట్టణం 3వ డివిజన్ బిట్ 1కు చెందిన వైసీపీ నాయకులు రాయితి లక్ష్మణతో పాటు 50 కుటుంబాలు శుక్రవారం అశోక్ బంగ్లాలో విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
NDL: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 14న నంద్యాలలో నిరుద్యోగులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి మస్తాన్ వలి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మట్లాడుతు KVSC ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే జాబ్ మేళాలో వివిధ సంస్థలకు చెందిన కంపెనీ ప్రతినిధులు హాజరు కానున్నారని విద్యార్హత పత్రాలతో హాజరు కావాలన్నారు.
SKLM: రణస్థలం మండల పరిధిలోని పైడిభీమవరం సచివాలయాన్ని శుక్రవారం ఈవోపీఆర్డీ వి. ప్రకాష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలోని రికార్డులు పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, రికార్డ్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఈ సందర్భంగా సూచించారు.
SKLM: కవిటి మండలం లోల్లపుట్టుక గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. అదే విధంగా ఈ నెల 9 వరకు ఈ వారోత్సవాల నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. సుప్రభాత సేవ, తిరువీధి కార్యక్రమం, హరికథ భజన, తదితర కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
NTR: చందర్లపాడు మండలం బొబ్బిలిపాడు గ్రామంలో అంకమ్మ తల్లి పోతురాజు గ్రామదేవతల దేవాలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన నందిగామ మాజీ శాసనసభ్యులు డాక్టర్ జగన్ మోహన్ రావు. అనంతరం భక్తులకు గ్రామస్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వేలాదిమంది భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.
AKP: నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామంలో ఈనెల 8, 9, 10వ తారీకుల్లో జరిగే గౌరీ పరమేశ్వరుల తీర్థ మహోత్సవం నేపథ్యంలో రూరల్ సీఐ రేవతమ్మ, ఎస్సై రాజారావు గ్రామ పెద్దలతో శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఐ రేవతమ్మ మాట్లాడుతూ.. పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు. స్టేజ్ ప్రోగ్రాములు ఉన్న రోజున పోలీసు అధికారులకు సహకరించాలని పేర్కొన్నారు.
ASR: డుంబ్రిగూడ మండలంలో మానవ హక్కుల నేర నిరోధక సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కృష్ణకుమారి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె నిరుపేద గిరిజనులను గుర్తించి నెలకు సరిపడే నిత్యవసర సరుకులను అందజేశారు. కష్టాల్లో ఉన్న గిరిజనులకు తమ వంతు ఎంతో కొంత సహాయం అందజేస్తున్నామని పేర్కొన్నారు.
SKLM: మన్నయ్యపేట గ్రామంలో పగటిపూట నిత్యం వీధి దీపాలు వెలుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. దీపాలు వెలగడంతో స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పగటిపూట వీధి దీపాలు వెలగడం వలన పంచాయతీకి అదనపు భారం పడుతుందని స్థానికులు అంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి పగటిపూట విద్యుత్ దీపాలు వెలగకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.