ASR: నాణ్యమైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే వ్యవసాయ సాగులో అధిక దిగుబడులు సాధించవచ్చని రైతు సాధికార సంస్థ ఏపీసీఎన్ఎఫ్ యూనిట్ ఇంఛార్జ్ ఎస్.శ్రీనివాసరావు, ఐసీఆర్పీ ఎస్.వరలక్ష్మి తెలిపారు. కొయ్యూరు మండలం గింజర్తిలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యవసాయ సాగులో రసాయన ఎరువుల వాడకం తగ్గించాలన్నారు.
WG: అదనపు కట్నం వేధింపులు తాళలేక నాగలక్ష్మి (23) అనే మహిళ సోమవారం అత్తిలి మండలం స్కిన్నెరపురంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాళ్ల మండలం జక్కరంకు చెందిన నాగలక్ష్మికి 2018లో కళ్యాణి దుర్గారావుతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతోనే తన కుమార్తె ప్రాణాలు తీసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
పార్వతీపురం నెల్లి చెరువులో నిర్మాణాల లెక్కలు తేల్చాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. ఈమేరకు సోమవారం కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు వంగల దాలినాయుడు నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు DRO కె. హేమలతకు వినతి పత్రాలు అందజేశారు.
VSP: భారతదేశం అత్యుత్తమ మేధో సంపదకు నిలయమని ఐఐటి ఖరగ్పూర్ పూర్వ ఆచార్యుడు ఎం.ఆర్. మాధవ్ అన్నారు. ఏయూలో సోమవారం నిర్వహించిన వర్క్షాప్లో ఆయన మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను భారత్ సమర్థవంతంగా నిర్వహిస్తోందన్నారు. మానవ మేధస్సుతో అసాధ్యాలను కూడా సాధ్యంగా మార్చవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జియోసూత్రాస్ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
KRNL: పాండవగల్లు గ్రామంలోని సర్వే నంబర్ 135లో ఉన్న 20 ఎకరాల పెద్ద చెరువు కేసులో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీపీఎం నేతలు ఇవాళ తీవ్రంగా విమర్శించారు. సబ్ కోర్టు, జిల్లా కోర్టులు చెరువును ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించినప్పటికీ అధికారులు స్వాధీనం చేసుకోలేదని ఆరోపించారు. తక్షణమే చర్యలు తీసుకోకపోతే గ్రామస్తులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
NTR: తిరువూరు శ్రీవాహిని ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం ఏపీఎస్ఎస్ డీ.సీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హాజరై జ్యోతి ప్రజ్వలన వెలిగించారు. యువతకు ఉపాధి కల్పించేందుకు ఇలాంటి జాబ్ మేళాలు ఉపయోగకరమన్నారు. కావున విద్యార్థులు నైపుణ్యాలను పెంచుకొని ఉద్యోగాలు సాధించాలన్నారు. మేళాలో 736 మంది పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా చాట్రాయి గ్రామంలో అంబటి అనుదీప్ పది రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏలూరు నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ను సోమవారం కలిసి హత్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. అలాగే ప్రత్యేక అధికారులతో విచారణ చేయించాలని కోరారు.
గుంటూరు నగరంలోని గణేష్ నగర్ ప్రాంతంలో ఆక్రమణకు గురైన సుమారు 1500 గజాల వడ్డెర కమ్యూనిటీ స్థలాన్ని విడిపించాలని CPI గుంటూరు నగర సమితి కోరింది. ఈ మేరకు గుంటూరు నగరపాలక సంస్థ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ మయూర్ అశోక్ దృష్టికి సమస్యను తీసుకెళ్లింది.
VZM: వాట్సాప్ గవర్నెన్స్ సేవలను విస్తరించి, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్లో A+ గ్రేడ్ సాధించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ఈమేరకు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పబ్లిక్ పాజిటివ్ పెర్సప్షన్ క్రింద ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వం తీసుకుంటోందన్నారు.
VSP: ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ 95వ వర్ధంతిని పురస్కరించుకుని మధురవాడలో సీపీఐ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నేత పైడిరాజు మాట్లాడుతూ.. భగత్ సింగ్ స్ఫూర్తితో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాల యుద్ధ కాంక్షను ఖండించారు.
CTR: స్వయం సహాయక సంఘ సభ్యులతో అనుసంధానమైన మహిళా వ్యాపారాలు అభివృద్ధి కోసం రూపొందించిన ప్రత్యేకమైన కార్యక్రమం ‘సంపన్న కారి’ కార్యక్రమం అని చిత్తూరు డీఆర్డీఏ శ్రీదేవి తెలిపారు. సోమవారం సాయంత్రం చిత్తూరు డీఆర్డీఏ కార్యాలయంలో సంపన్న కారి కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీపీఎం రవి, ఏపీఎంలు సుబ్బారెడ్డి, మధు, రవి తదితరు పాల్గొన్నారు.
TPT: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పేడు మండల కేంద్రంలో ముస్లిం సోదరుల కోసం శాశ్వత స్మశాన వాటికకు 10 సెంట్ల స్థలం కేటాయించారు. సబ్ స్టేషన్ సమీపంలో స్థలాన్ని సిద్ధం చేసి స్థానిక నేతల ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు అప్పగించారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ASR: అన్నదాత సుఖీభవ పథకం రైతులకు ఆర్థిక భరోసా ఇస్తుందని టీడీపీ అరకు పార్లమెంట్ అధ్యక్షులు మోజూరు తేజోవతి అన్నారు. సోమవారం అరకులోయ మండలం పద్మాపురం పంచాయితీలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం, అభివృద్ధి కొరకు పనిచేస్తుందన్నారు.
అన్నమయ్య: మదనపల్లిలో దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి ఘనంగా నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ యం. వెంకటాద్రి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సామాజిక సమానత్వం, విద్యాభివృద్ధికి వెంకటరెడ్డి చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని స్థానిక 38/1 అక్కనవారి వీధి సచివాలయం పరిధిలోని టెక్కే మిట్ట వీధిలో చాలా కాలంగా ఇంటి పన్ను బకాయిలు చెల్లించలేదు. పెండింగ్లో ఉన్నందున పలుమార్లు నోటీసులు ఇచ్చారు. పన్నులు చెల్లించకపోవడంతో కమిషర్ వై.వో నందన్ ఆదేశాల మేరకు సోమవారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ యస్. అబ్దుల్ అజీజ్ 2 మంచినీటి కొళాయిలను తొలగించారు.