• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సర్వేను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చెయ్యాలి

ELR: ఆధునిక సాంకేతిక అంశాలపై అవగాహన విద్యార్హత కలిగిన వారికి వర్క్ ఫ్రమ్ హోం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చేపట్టిన సర్వేను యుద్ధప్రాతిపధికన పూర్తిచెయ్యాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం వివిధ అంశాలపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో డీఎల్ డీవోలు, ఎంపీడీవోలు క్షేత్రస్ధాయిలో పర్యటించాలన్నారు.

April 1, 2025 / 04:37 PM IST

దారుణం.. 10వ తరగతి బాలికపై లైంగిక దాడి

కడప: పదో తరగతి బాలికపై జేసీబీ డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన వాల్మీకిపురంలో మంగళవారం ఉదయం వెలుగు చూసింది. పట్టణంలో ఉండే ఓ మైనర్ బాలిక స్థానికంగా ఉన్న ఓ స్కూల్లో పదవ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో పక్క వీధిలో కాపురం ఉంటున్న జేసీబీ డ్రైవర్ బాలికను లోబర్చుకుని లైంగిక దాడి చేశాడు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో బాలిక తల్లి దండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

April 1, 2025 / 03:30 PM IST

ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి మోసం చేశారు

GNTR: ప్రజలకు సుపరిపాలన అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ పాలనకు వ్యతిరేకంగా మంగళగిరి పట్టణంలోని కొత్తపేటలో దేశవ్యాప్త ప్రచార కార్యక్రమం మంగళవారం ప్రారంభించారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేశారని మండిపడ్డారు.

April 1, 2025 / 02:20 PM IST

విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా

చిత్తూరు: నగరి మండలం ఏకాంబర కుప్పం పంచాయతీ పరిధిలోని తరణి గ్రామంలో ఇసుక అక్రమ రవాణా దందా జోరుగా కొనసాగుతోంది. గ్రామానికి సమీపంలో ఉన్న కుశస్థలి నదిలో విచ్చలవిడిగా శ్మశానాలను సైతం తోడేస్తున్నారు. స్థానికులు సమాచారంతో ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

April 1, 2025 / 01:53 PM IST

ఏప్రిల్ 6న శ్రీవారికి ప్రత్యేక కార్యక్రమాలు

చిత్తూరు: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6న శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం రంగనాయకుల మండపంలో శ్రీసీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఏప్రిల్ 7న శ్రీరామ పట్టాభిషేకాన్ని జరిపించనున్నట్లు ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

April 1, 2025 / 01:52 PM IST

నీటి కుంటలను ఏర్పాటుకు శంకుస్థాపన

PLD: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులలో భాగంగా నరసరావుపేట మండలం గురువాయపాలెం గ్రామంలో మంగళవారం పశువుల కోసం నీటి నిల్వల నీటి కుంటలను ఏర్పాటుకు ఎమ్మెల్యే అరవిందబాబు శంకుస్థాపన చేశారు. వ్యవసాయ రంగానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. రైతులు వ్యవసాయం చేసుకోడానికి, పశువులకు వేసవికాలంలో దాహం తీర్చడానికి నీటికుంట ఏర్పాటు చేస్తున్నామన్నారు.

April 1, 2025 / 01:48 PM IST

ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు

TPT: మార్చి 17 నుంచి ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు జిల్లా వ్యాప్తంగా.. నేడు సాంఘిక శాస్త్రం పరీక్షతో ప్రశాంతంగా ముగిశాయి. నాగలాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో మాస్ కాపీయింగుకు పాల్పడకుండా సంతోషంగా పరీక్షలు రాశారని అధికారులు తెలిపారు. మంగళవారం చివరి రోజు పరీక్షలు రాసిన విద్యార్థులు కేరింతలతో పరీక్షా కేంద్రాల నుంచి బయటకొచ్చారు.

April 1, 2025 / 01:37 PM IST

శిల్పకళ శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

PLD: కలెక్టర్ పి.అరుణ్ బాబు దుర్గి మండలం ఓబులేసిన పాలెంలోని ఆచార్య నాగార్జున శిల్పకళా శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ శిక్షణ నిర్వహిస్తున్న తీరును సంబంధిత కళాశాల నిర్వాహకులు శ్రీనివాసాచారి, సీతారామయ్యలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం శిల్పాల చెక్కడం విధానాన్ని పరిశీలించారు.

April 1, 2025 / 01:33 PM IST

ప్రశాంతంగా ముగిసిన పరీక్షలు

GNTR: జిల్లాలో మంగళవారం 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మార్చి 17వ తేదీన ప్రారంభమైన పరీక్షలు 31న ముగియాల్సి ఉంది. అయితే నిన్న రంజాన్ పండుగ కావడంతో చివరి సబ్జెక్ట్ సోషల్ పరీక్ష నేటికి వాయిదా పడింది. దీంతో ఈరోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు ఈ పరీక్ష జరిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఉన్న పరీక్ష కేంద్రం నుండి ఇంటికి తరలి వెళ్లారు.

April 1, 2025 / 01:19 PM IST

పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టర్

PLD: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా నెలవారి పింఛన్ల పథకంలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు దుర్గి మండలంలో పర్యటించారు. స్వయంగా ఆయన లబ్దిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు అందించే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.

April 1, 2025 / 01:14 PM IST

బోయకొండలో పెరిగిన భక్తుల రద్దీ.

చిత్తూరు: పుణ్య క్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో అమ్మవారికి పూజలు చేసి మొక్కుబడులు చేసుకునేందుకు తరలివచ్చారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాదిమంది భక్తులు దర్శనం కోసం వచ్చారు. దర్శనం అనంతరం తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. 

April 1, 2025 / 12:40 PM IST

బెడ్‌పై బుసలు కొట్టిన నాగుపాము

TPT: పుత్తూరు మండలం బత్తల వారి కండిగ గ్రామంలో ఓ ఇంట్లో బెడ్‌పై నాగుపాము కనిపించి భయభ్రాంతులకు గురి చేసింది. ఇంటి యజమాని స్నేక్ క్యాచర్ శ్రీకాంత్‌కు సమాచారం అందజేశారు. అతను ఆ పామును చాకచక్యంగా పట్టుకొని సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

April 1, 2025 / 12:39 PM IST

VIDEO: పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

PLD: అమరావతి మండలం ఉంగుటూరులో లబ్ధిదారులకు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మంగళవారం పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేసి, వారి జీవనోత్సాహాన్ని మరింత పెంచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. లబ్ధిధారులందరూ ఆర్థిక భద్రతతో, ఆరోగ్యంగా ఉండాలని ఎమ్మెల్యే అన్నారు.

April 1, 2025 / 12:31 PM IST

మాజీ ఉప సర్పంచ్ మృతి పార్టీకి తీరని లోటు

BPT: మాజీ ఉపసర్పంచ్ పీటా మంగమ్మ మృతి పార్టీకి తీరని లోటు అని టీడీపీ నాయకుడు అనగాని శివప్రసాద్ అన్నారు. ఈ మేరకు మంగళవారం చెరుకుపల్లి మండలం అరుంబాక పంచాయతీ మాజీ ఉపసర్పంచ్ పీటా మంగమ్మ పార్ధివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంగమ్మ పార్టీకి అనేక సేవలు చేశారని, ఆమె సేవలు మరువలేమని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు పూషాడపు కుమారస్వామి ఉన్నారు.

April 1, 2025 / 11:00 AM IST

గుంటూరు జిల్లాలో తగ్గనున్న 30 శాతంసచివాలయాలు

గుంటూరు జిల్లాలోని పట్టణాలు, మండల కేంద్రాల్లో సచివాలయాల సంఖ్యను దాదాపు 30 శాతం వరకు తగ్గించనున్నారు. ప్రధానంగా గుంటూరుతో పాటు అన్ని మున్సిసిపాలిటీల్లో దాదాపు 40 నుంచి 50 శాతం వరకు తగ్గనున్నాయి. రెవెన్యూ గ్రామానికి ఒకటి యథాతథంగా కొనసాగుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1334 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి.

April 1, 2025 / 10:44 AM IST