KRNL: ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆదేశాల మేరకు నందవరం మండలం నందవరం 1, 2, 3 గ్రామాల కమిటీలను పూర్తి చేశారు. గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసి కమిటీలను రూపొందించి ఇంఛార్జ్కు సోమవారం అందజేశారు. గ్రామ స్థాయి నుంచే పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈ కమిటీలు పనిచేస్తాయని నాయకులు తెలిపారు.