TPT: తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలను టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ సోమవారం పరిశీలించారు. విద్యార్థినులకు ఉద్యోగావకాశాలు కల్పించే స్థాయిలో నాణ్యమైన శిక్షణ, సాంకేతిక నైపుణ్యాభివృద్ధి, కెరీర్ గైడెన్స్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధ్యాపకులకు సూచించారు. కళాశాలలోని ల్యాబ్లు, తరగతి గదులను పరిశీలించి విద్యార్థినులతో కూడా మాట్లాడారు.