ASR: దేవుడి పేరును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తూ హిందూ భక్తుల మనోభావాలను వైసీపీ నాయకులు దెబ్బతీస్తున్నారని జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ మండిపడ్డారు. ఈమేరకు సోమవారం అనంతగిరి మండలం గుమ్మా పంచాయితీలో శ్రావణ్ కుమార్ విలేకర్లతో మాట్లాడారు. టీటీడీలో వైసీపీ హాయాంలో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు.