• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘ప్రతి ఒక్కరి ఓటు అభివృద్ధి వైపు ఉండాలి’

W.G: ప్రతి ఒక్కరి ఓటు అభివృద్ధి వైపు ఉండాలి తప్ప, విధ్వంసం వైపు కాదని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఇవాళ యలమంచిలి మండలంలో రూ.3.48 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న సంక్షేమాన్ని చూసి ఆశీర్వదించాలని కోరారు. రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడుతుంటే జగన్ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.

March 21, 2026 / 07:11 PM IST

మంత్రిని కలిసిన జిల్లా బీజేపీ నేతలు

SKLM: కోటబొమ్మాలి మండలం నిమ్మాడలో వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని జిల్లా BJP నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కూటమిలో పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సిరిపురం తెజేశ్వరరావు, జిల్లా యువత నాయకుడు బైపల్లి పరమేశ్వరరావు, సంతబొమ్మాళి మండల అధ్యక్షులు దేపల్లి కామయ్య, తదితరులు పాల్గొన్నారు.

March 21, 2026 / 07:07 PM IST

విజయవాడ జీజీహెచ్‌లో క‌లెక్ట‌ర్ త‌నిఖీలు

NTR: విజ‌య‌వాడలోని న్యూ జీజీహెచ్‌ను కలెక్టర్ ల‌క్ష్మీశ శ‌నివారం సంద‌ర్శించారు. అనంతరం ఆసుప‌త్రి ద్వారా రోగుల‌కు అందుతున్న సేవ‌ల‌ను ప‌రిశీలించారు. అదేవిధంగా ఆసుప‌త్రిలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యూత్ టైం బ్యాంక్ సేవలను ఈరోజు పరిశీలించారు. యూత్ టైం బ్యాంక్ మొబైల్ యాప్‌ను పరిశీలించి వాలంటీర్, రోగి వివరాలు టైం బ్యాంకులో నమోదయ్యే వ...

March 21, 2026 / 07:05 PM IST

యోగా ఛాంపియన్ శృతికి మంత్రి సహాయం

BPT: ప్రపంచ యోగాసన ఛాంపియన్‌షిప్ ట్రయల్స్‌కు ఎంపికైన చందలూరు విద్యార్థిని నాయపాము శృతికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆర్థిక సహాయం అందించారు. ఏప్రిల్ 13-15 తేదీల్లో హర్యానాలో జరిగే పోటీలకు ఎంపికైన శృతి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనడంతో మంత్రి వెంటనే స్పందించారు. గ్రామీణ విద్యార్థిని అంతర్జాతీయ స్థాయికి ఎదగడం గర్వకారణమని నేతలు తెలిపారు.

March 21, 2026 / 07:05 PM IST

‘వైసీపీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలి’

ప్రకాశం: వైసీపీ అభివృద్ధి కోసం నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని కనిగిరి నియోజకవర్గ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం కనిగిరి పార్టీ కార్యాలయంలో పీసీపల్లి మండల నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి, పెదచెర్లోపల్లి గ్రామ కమిటీ నియామక పత్రాలను అందజేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఆయన సూచించారు.

March 21, 2026 / 07:00 PM IST

సిలువ పాదయాత్రలో ఎమ్మెల్యే అరవింద బాబు

PLD: రావిపాడు గ్రామం నుంచి కనపర్తి బాలయేసు పుణ్యక్షేత్రం వరకు గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించిన పరిశుద్ధ సిలువ పాదయాత్రలో నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిలువను మోసే భాగ్యం కలగడం తనకు గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని తెలిపారు. భక్తుల విశ్వాసం, ఐక్యత సమాజానికి ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.

March 21, 2026 / 07:00 PM IST

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

NLR: విడవలూరులోని వావిల్ల రోడ్‌లో ధాన్యం సేకరణను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడారు.. రైతులకు లారీలు, ధాన్యం కొలతలకు సంబంధించి గోన సంచులు కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. రైతులకు అధికారులు, నాయకులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలన్నారు.

March 21, 2026 / 06:59 PM IST

టి.నర్సాపురంలో ఎక్సైజ్ తనిఖీలు

ELR: టి.నర్సాపురం మండలంలోని పలు గ్రామాల్లో ఇవాళ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు దాడులు నిర్వహించారు. తిరుమలదేవిపేటలో అనగాని రాంబాబు, బొల్లం రామకృష్ణల వద్ద విక్రయిస్తున్న కల్లును రసాయన పరీక్షల నిమిత్తం సేకరించారు. అనంతరం టి.నర్సాపురంలోని మద్యం దుకాణాల్లో నిల్వలను తనిఖీ చేశారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్సై జె.జగ్గారావు, సిబ్బంది పాల్గొన్నారు.

March 21, 2026 / 06:58 PM IST

ఎమ్మెల్యేను అభినందించిన.. సీఎం చంద్రబాబు

TPT: టీటీడీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ. 10 లక్షల విరాళం అందజేసినట్లు జేఎంసీ ట్రస్ట్ ఛైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. తిరుమల రంగనాయకుల మండపంలో సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే, విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు. ఈ సందర్భంగా సేవా దృక్పథంతో ముందుకు వచ్చిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను సీఎం ప్రత్యేకంగా అభినందించారు.

March 21, 2026 / 06:57 PM IST

వాడపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సినీ ప్రముఖులు

కోనసీమ: ఆత్రేయపురం(M) వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ నటులు తనికెళ్ళ భరణి, గౌతం రాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. 25 సంవత్సరాలు క్రితం ఇక్కడికి రావడం జరిగిందని, అప్పుడు సాధారణ జనం, ఇప్పుడు లక్షలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారన్నారు. మరో తిరుమలగా రోజూ రోజుకు అభివృద్ధి చెందుతుండడం సంతోషంగా ఉందన్నారు.

March 21, 2026 / 06:55 PM IST

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మంత్రికి వినతి

ELR: చాట్రాయి మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని కోరుతూ మంత్రి పార్థసారథికి వినతి పత్రం సమర్పించారు. ఇవాళ చాట్రాయిలో మంత్రిని టీడీపీ మండల అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు, తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాస్ కలిశారు. సుమారు 12 వేల ఎకరాల్లో పంట సాగులో ఉందని, త్వరగా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని కోరారు.

March 21, 2026 / 06:55 PM IST

అదుపుతప్పి చెట్టును ఢీకొన్న లారీ

అన్నమయ్య: రైల్వేకోడూరు మండలం మైసూరవారిపల్లి పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారిపై ఇవాళ ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి కడప వైపు వెళ్తున్న లారీ మార్కెట్ యార్డ్ సమీపంలో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. డ్రైవర్, క్లీనర్ స్వల్పంగా గాయపడ్డారు. లారీ చెట్టుని ఢీకొని రోడ్డుకు అడ్డుగా ఉండటంతో కొంతమేర ట్రాఫిక్ జామైంది. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.

March 21, 2026 / 06:55 PM IST

లిఖితపూడిలో పశువైద్య శిబిరం

WG: నరసాపురం మండలం లిఖితపూడిలో ఇవాళ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామంలోని మొత్తం 186 పశువులకు ఉచితంగా టీకాలు వేశారు. పశువైద్యాధికారి డాక్టర్ ఐ.సురేంద్ర కుమార్ మాట్లాడుతూ.. వర్షాకాలం, శీతాకాలం సమయాల్లో పశువులకు సోకే గాలికుంటు వ్యాధి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

March 21, 2026 / 06:50 PM IST

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ పంపిణీ చేసిన ఎంపీ

KRNL: పేద కుటుంబాలకు CMRF పథకం భరోసాగా నిలుస్తుందని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. ఇశాళ కౌతాళం గ్రామానికి చెందిన పరిమళ బాయికి రూ.1,48,847, కర్నూలు మండలం రేమట గ్రామానికి చెందిన బలరాముడుకు రూ.75,122 సీఏం సహాయ నిధి ద్వారా ఆర్ధిక సహాయాన్ని పంచలింగాలలోని తన స్వగృహంలో ఎంపీ అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం అన్నారు.

March 21, 2026 / 06:48 PM IST

డ్రోన్ నిఘాతో పేకాట రాయుళ్ల అరెస్ట్

సత్యసాయి: జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఆదేశాలతో పోలీసులు డ్రోన్ల ద్వారా అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టారు. లేపాక్షి మండల అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న స్థావరాన్ని ఎస్సై నరేంద్ర బృందం డ్రోన్ కెమెరాల సాయంతో గుర్తించింది. ఈ దాడిలో ఏడుగురు జూదరులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ. 5,800 నగదు స్వాధీనం చేసుకున్నారు.

March 21, 2026 / 06:46 PM IST