VSP: సింహాచలంలో దేవాలయం పైకప్పు వర్షపు నీటి లీకేజీ నివారణ ప్రాజెక్టు ఒప్పందం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసురావు పాల్గొన్నారు. పుణేకు చెందిన కంపెనీ పనులు చేయడానికి ముందుకు వచ్చింది. 9 నెలల్లో రూ.4కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయనున్నారు.
కృష్ణా: 2025 JEE మెయిన్ పేపర్-1లో 100% స్కోర్ చేసిన ఏకైక మహిళా అభ్యర్థిగా నిలిచిన గుత్తికొండ సాయి మనోజ్ఞకు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. ఉజ్వల భవిష్యత్ కోసం కలలు కనే ప్రతీ విద్యార్థికీ మన రాష్ట్రానికి చెందిన సాయి మనోజ్ఞ ఆదర్శంగా నిలిచిందని సుజనా ప్రశంసించారు.
సత్యసాయి: మంత్రి సవిత రేపు పెనుకొండ, సోమందేపల్లి మండలాల్లో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు పెనుకొండ మండలంలోని గొల్లపల్లి రిజర్వాయర్లో జలహారతి కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. అనంతరం సోమందేపల్లి మండలం మాగేచెరువు గ్రామంలో కొల్హాపూరి మహాలక్ష్మి అమ్మవారి రథోత్సవంలో పాల్గొంటారని సిబ్బంది తెలిపారు.
ATP: తాడిపత్రి చుట్టుపక్కల ప్రాంతాలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ప్రదేశాలను పోలీసులు మంగళవారం తనిఖీ చేశారు. తాడిపత్రి రూరల్ ఎస్ఐలు ధరణి బాబు, కాటమయ్య కలిసి తనిఖీలు నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలు జరిగితే పోలీసులకు సమాచారం అందించాలని స్థానికులకు సూచించారు.
NLR: వరికుంటపాడు మండలంలోని ఇరువురు గ్రామంలో మంగళవారం మండల వైద్యాధికారిని ఆయేషా 104 వాహన వైద్య సేవలను అందించారు. ఆమె 53 మందిని పరీక్షించి ఉచితంగా మందులు అందించారు. అలాగే ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. దీర్ఘకాలిక రోగులు మారిన వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చలికాలంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.
VZM: దత్తిరాజేరు మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. ఇందులో ప్రధానంగా వేసవిని దృష్టిలో పెట్టుకుని అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో రాజేంద్రప్రసాద్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సింహాద్రి అప్పలనాయుడు, జెడ్పీటీసీ రౌతు రాజేశ్వరి, వైస్ ఎంపీపీ మిత్తిరెడ్డి రమేశ్ నాయుడు పాల్గొన్నారు.
ATP: గుంతకల్లులోని ఓ ప్రైవేటు కళాశాలలో సైబర్ నేరాలపై మంగళవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టు టౌన్ సీఐ మస్తాన్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం సమాజంలో ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలతో చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు.
W.G: వేల్పూరులోని కృష్ణానందం పౌల్ట్రీ నమూనాలను పరీక్షించగా బర్డ్ ఫ్లూ పాజిటివ్ నిర్ధారణ అయిందని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. వాటిని అరికట్టేందుకు అన్ని రకాల అత్యవసర చర్యలను చేపట్టాని, 3నెలల పాటు ఇన్ఫెక్షన్ జోన్లోని కోళ్ల ఫారాలు, షాపులు మూసివేయాలని ఆదేశాలు ఇచ్చారు. పెద్దఅమిరం కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
ATP: గుంతకల్లులో కోదండ రామస్వామి ఆలయంలో నూతన నవగ్రహ సుబ్రహ్మణ్య ధ్వజ శిఖర ప్రతిష్ట పూజా కార్యక్రమానికి టీడీపీ గుంతకల్లు మండల ఇంచఛార్జ్ నారాయణస్వామి, టీడీపీ నాయకులతో కలిసి మంగళవారం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు రూ. 30,000 విరాళం అందజేశారు. అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు నారాయణస్వామిని శాలువాతో సన్మానించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
VZM: కూటమి ప్రభుత్వ ఎన్నికల హమీలో బాగంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు హామీ అమలు చేసే వరకు భారత కమ్యునిస్టు పార్టీ పోరుబాట కొనసాగుతుందని నియోజకవర్గ కార్యదర్శి బుగత అశోక్ తెలిపారు. మంగళవారం డి.ఎన్.ఆర్ అమర్ భవన్లో పేదల ఇంటి స్థలం కోసం సీపీఐ పోరుబాట కార్యక్రమానికి సంబంధించిన ప్రచార గోడ పత్రికలను విడుదల చేశారు.
SKLM: మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని, లేని పక్షంలో పోరాటాలు ఉధృతం చేస్తామని సీఐటీయూ టౌన్ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు అన్నారు. నగరంలోని మాస్టర్ల పాయింట్ల వద్ద మంగళవారం నిరసన తెలిపారు. మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులతో ఊడిగం చేయించుకుంటున్నాయని, వారికి ఉద్యోగ భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.
SKLM: శ్రీకాకుళం పట్టణంలోని పొట్టి శ్రీరాములు మార్కెట్లో వున్న సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. మంగళవారం పొట్టి శ్రీరాములు మార్కెట్ను పరిశీలించారు. అనంతరం వర్తకలతో ముఖాముఖిలో పాల్గొని మాట్లాడుతూ.. మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.
WG: తణుకు మండలం తేతలిలో లేహం ఫుడ్స్ పేరుతో నిర్వహిస్తున్న పశువధ కర్మాగారాన్ని నిలిపివేయాలని రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు గో సేవా సమితి సభ్యులు ఇటీవల కాలంగా పశువధ కర్మాగారాన్ని నిలిపివేయాలని కోరుతూ పలు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై కోర్టులో వేసిన పిటిషన్ ఆధారంగా హైకోర్టు స్టే విధించినట్లు గో సేవా సమితి సభ్యులు వెల్లడించారు.
PPM: పార్వతీపురం 14వ వార్డుకు రైల్వే స్థలం ఆనుకొని ఉన్న రహదారి దిగ్బంధనం పై ఎమ్మెల్యే విజయ్ చంద్ర స్పందించారు. ప్లాట్ ఫామ్ నెంబర్ 2, 3 మధ్యలో ఉన్న ప్రయాణికులు నడిచే మెట్లు బ్రిడ్జ్ వెడల్పు చిన్నదిగా ఉందని, దీంతో ప్రయాణికులు రద్దీగా ఉన్నప్పుడు ఇబ్బంది పడుతున్నారని, వాటిని వెడల్పు చేయాలని రైల్వే అధికారులను కోరారు.
TPT: తడ రైల్వే స్టేషన్ సమీపంలో డ్యూటీలో ఉన్న రైల్వే ఉద్యోగిని రైలు ఢీకొట్టిన ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మంగళవారం గ్యాంగ్ మ్యాన్గా పనిచేస్తున్న ఇద్దరిని చెన్నె వెళ్తున్న రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు క్షతగాత్రుడిని సూళ్లూరుపేట వైద్యశాలకు తరలించారు.