• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

శ్రీ ఈరన్నస్వామి హుండీ ఆదాయం ఏంతంటే?

KRNL: కౌతాళం మండలంలోని ఉరుకుందలో వెలసిన శ్రీ నరసింహ ఈరన్నస్వామి దేవస్థానంలో శనివారం హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. 05-03-2025 నుంచి 01-05-2025, 56 రోజుల స్వామివారి హుండీని లెక్కించారు. హుండీ ఆదాయం రూ.1,14,68,836, బంగారం 29.గ్రా 100 మి. గ్రా, వెండి 13 కేజీల 790గ్రా. వచ్చిందని  అదికారులు తెలిపారు.

May 3, 2025 / 10:48 AM IST

వైసీపీ యువ నాయకుడు మృతి

NDL: రుద్రవరంలోని హైస్కూల్ కాలనీకి చెందిన వైసీపీ యువ నాయకుడు అవుట శ్రీనివాసులు మృతి పార్టీకి తీరనిలోటని మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి అన్నారు. శనివారం అనారోగ్యంతో మృతి చెందిన శ్రీనివాసులు మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. మాజీ ఎమ్మెల్యే వెంట వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

May 3, 2025 / 10:29 AM IST

‘భగీరథ జయంతిని ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తాం’

KKD: ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపు భగీరథ జయంతిని ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగలి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం కలెక్టరేట్‌లో ఈ జయంతి కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతి నిధులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజలు హాజరు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

May 3, 2025 / 09:45 AM IST

ప్రత్యేక అలంకరణలో నీలమణి దుర్గమ్మ

SKLM: పాతపట్నంలో కొలువైన శ్రీ నీలమణి దుర్గమ్మ ఆలయం 50వ వార్షిక మహోత్సవాల్లో భాగంగా వైశాఖ మాసం శనివారం పురస్కరించుకుని అమ్మవారు భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు రాజేశ్ ఆధ్వర్యంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు అలకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు కోసం తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో వాసుదేవరావు తెలిపారు.

May 3, 2025 / 09:10 AM IST

మట్కా రాస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు

ATP: రాయదుర్గం మండలం టి. వీరాపురం గ్రామంలో మట్కా రాస్తున్న ఒకర్ని అదుపులో తీసుకొని కేసు నమోదు చేసినట్లు అర్బన్ సీఐ జయనాయక్ మీడియాతో తెలిపారు. బస్టాండ్ వద్ద మట్కా రాస్తున్న చిలకరి హనుమంతును అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అతని వద్ద నుండి 30 వేల రూపాయల నగదును మట్కా చీటీలను మరియు బాల్ పెన్నను స్వాధీనం చేసుకున్నామన్నారు.

May 3, 2025 / 08:42 AM IST

హైదరాబాదులో ప్రత్యక్షమైన తోపుదుర్తి

ATP: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి హైదరాబాదులో ప్రత్యక్షమయ్యారు. వైఎస్ జగన్ రామగిరి పర్యటన సందర్భంగా నమోదైన కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో అజ్ఞాతంలోకి వెళ్లారన్న వార్తలొచ్చాయి. ఈ క్రమంలో తాను పరారీలో లేనన్న సందేశం ఇచ్చేలా హైదరాబాదులోని ఓ మీడియా హౌస్ వద్ద ప్రత్యక్షమయ్యారు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

May 3, 2025 / 07:35 AM IST

మెడికల్ కాలేజీలో ఉద్యోగ ఎంపికల ఫైనల్ లిస్ట్ విడుదల

KRNL: జిల్లాలోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్‌లో ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించి మెడికల్ ఫిజిసిస్ట్, అనెస్తీషియా టెక్నీషియన్, అటెండెంట్ కేటగిరిల ఫైనల్ మెరిట్, సెలెక్షన్ లిస్ట్ శుక్రవారం విడుదలయ్యాయి. ఎంపికైన అభ్యర్థులు, ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ నెల 6 నుండి 8 మధ్య కర్నూలు మెడికల్ కాలేజీలో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని ప్రిన్సిపాల్ నరసమ్మ తెలిపారు.

May 3, 2025 / 07:10 AM IST

టీడీపీ నేత ఇంటి ముందు క్షుద్ర పూజలు

KRNL: పెద్దకడుబూరు మండలం జాలవాడి గ్రామంలో టీడీపీ నాయకుడు ముక్కన్న ఇంటి ముందు శుక్రవారం రాత్రి క్షుద్ర పూజలు జరిగిన విషయం కలకలం రేపింది. రెండు రోజులపాటు అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహిస్తున్న టీడీపీ నాయకుడు తెలిపారు సంఘటన జరిగిన చోటు వద్ద నిమ్మకాయలు, ఉల్లిగడ్డలు, మెంతాలు, కోడిగుడ్డలు, కుంకుమ, పసుపు, వస్తువులు వదిలివేశారన్నారు.

May 3, 2025 / 06:59 AM IST

గుడిపాల వద్ద రోడ్డు ప్రమాదం

CTR: గుడిపాల ఎంసీఆర్ క్రాస్ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ఓ జేసీబీ ఢీ కొట్టిన ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు SI రామ్మోహన్ తెలిపారు. నగరికి చెందిన రుశేంద్రబాబు (35)తన భార్య, కుమారుడు (5)తో కలిసి ఆటోలో వస్తుండగా అతివేగంగా వచ్చిన జేసీబీ ఢీ కొట్టింది. స్థానికులు క్షతగాత్రులను సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

May 3, 2025 / 06:51 AM IST

రోడ్డు మూసివేత.. వాహనాల దారి మళ్లింపు

EG: పెరవలి-నరసాపురం రోడ్డు పునరుద్ధరణ పనులను ఆర్ అండి బి అధికారులు ముమ్మరంగా చేపడుతున్నారు. నెగ్గిపూడి వద్ద కల్వర్టు నిర్మాణం, పెనుగొండ బ్రిడ్జి మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో పెరవలి నుంచి వెళ్ళే వాహనాలు దారి మళ్లించారు. కాపవరం, పెనుగొండ, వడలి, సిద్ధాంతం వయా ఆచంట, మార్టేరు మీదుగా నర్సాపురం వెళ్లాలని బోర్డులు అమర్చారు.

May 3, 2025 / 05:46 AM IST

ఒంటిమిట్ట కోదండ రామాలయం హుండీ లెక్కింపు

KDP: ఆంధ్ర భద్రాద్రిగా వెలసిన ఒంటిమిట్ట కోదండ రామాలయ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని టీటీడీ అధికారులు, సిబ్బంది శ్రీవారి సేవకులు, శుక్రవారం లెక్కించారు. గత నెల 21 నుంచి నిన్నటి వరకు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా రూ. 27, 69,135 ఆదాయం వచ్చిందని ఆలయ తనిఖీ అధికారి నవీన్ కుమార్ తెలిపారు. గత 9 ఏళ్ల తర్వాత అత్యధిక హుండీ ఆదాయం వచ్చిందన్నారు.

May 3, 2025 / 05:26 AM IST

తాగు నీటి సమస్యను పరిష్కరించిన రితీశ్ రెడ్డి

KDP: కలసపాడు మండలంలోని ముదిరెడ్డిపల్లిలో తాగునీటి సమస్య ఏర్పడింది. ఈ విషయాన్ని బద్వేల్ టీడీపీ ఇన్‌ఛార్జ్ రితీశ్ రెడ్డి దృష్టికి గ్రామస్తులు తీసుకువెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి నూతన బోరు వేసి నీటి సమస్యను పరిష్కరించారు. దీంతో గ్రామ ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఎండాకాలం సంభవిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గంలో నీటి సమస్య లేకుండా చూసుకోవాలన్నారు.

May 3, 2025 / 05:13 AM IST

రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్ ప్రారంభం

BPT: చీరాల ఎన్ఆర్&ఎంపీ స్కూల్‌లో రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్ శుక్రవారం ఫ్లడ్ లైట్ల వెలుగులో హోరాహోరీగా ప్రారంభమైంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి సుమారు 20 ఫుట్‌బాల్ జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. మూడు రోజుల పాటు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన క్రీడాకారులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పించారు.

May 2, 2025 / 08:12 PM IST

నరసరావుపేటలో రోడ్డు ప్రమాదం

PLD: నరసరావుపేటలోని ఎస్‌ఆర్కేటీ కాలనీ సమీపంలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పాత మాగులూరుకి చెందిన గోపి బుక్కాపురంలోని బంధువుల ఇంటికి వెళ్లి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఎస్‌ఆర్కేటీ కాలనీ వద్ద వేగంగా వచ్చిన ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గోపి కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటోను వదిలి డ్రైవర్ పరారయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

May 2, 2025 / 08:09 PM IST

ప్రజలతో తాడిపత్రి ఎమ్మెల్యే మాటామంతీ

ATP: తాడిపత్రి పట్టణంలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పర్యటించారు. పట్టణంలోని ఆసుపత్రి పాలెంలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వరమే పలు సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కాలనీలో ఏ సమస్యలున్నా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పట్టణ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

May 2, 2025 / 08:00 PM IST