VZM: ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వలస వెళ్లే గిరిజన యువత ప్రాణాలకు రక్షణ కల్పించాలని పార్వతీపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. శనివారం జిల్లా OBC చైర్మన్ వంగల దాలి నాయుడు విలేకరులతో మాట్లాడుతూ.. ఉపాధి కోసం వలస వెళ్లి రొయ్యల చెరువులో విద్యుత్ షాక్కు గురై ప్రశాంత్, కిరణ్ మృతి చెందడం బాధాకరం అన్నారు. వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
VZM: రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ వారి ఆధ్వర్యంలో శనివారం వీక్లీ మీటింగ్ నిర్వహించారు. దీనిలో భాగంగా ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో స్థానిక బీసెంట్ స్కూల్ గ్రౌండ్లో సభ్యులు అందరు ఫీజికల్ ఫిటినెస్తో ఉండాలని జాగింగ్, రన్నింగ్ లాంటివి పీటీ మాస్టారు ఆధ్వర్యంలో నిర్వహించినట్లు ప్రెసిడెంట్ నాగేశ్వరావు, సెక్రటరీ శంకర్ రెడ్డి తెలిపారు.
ప్రకాశం: మర్రిపూడిలో శనివారం నిర్వహించిన రెవెన్యూ గ్రీవెన్స్ కార్యక్రమంలో కొండేపి ఎమ్మెల్యే, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఆయన స్వయంగా అర్జునుని తీసుకొని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల వద్ద నుండి వచ్చే అర్జీలను వెంటనే పరిష్కరించే విధంగా ప్రత్యేక కాల్చిన రూపొందించినట్లు ఆయన తెలియజేశారు.
KRNL: పత్తికొండ సీపీఐ కార్యాలయంలో శనివారం ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎరుకల హనుమేశ్ ఆధ్వర్యంలో ఏఐవైఎఫ్ 66వ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఏఐవైఎఫ్ మాజీ రాష్ట్ర నేతలు భీమలింగప్ప జెండా ఆవిష్కరణ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. మే 15వ తేదీ తిరుపతిలో జరిగే ఏఐవైఎఫ్ మహాసభలను జయప్రదం చేయాలన్నారు.
కృష్ణా: అవనిగడ్డలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి నూతన ఆలయ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. గ్రామంలోని గుర్రపు చెరువు వద్ద వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సతీమణి విజయలక్ష్మి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు.
కృష్ణా: ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల రెల్లీ కులస్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళగిరిలో జరిగిన అంతర్ రాష్ట్రాల క్రికెట్ పోటీల్లో గుడివాడకు చెందిన రాజ్ సీసీ జట్టు సభ్యులు ప్రతిభ చూపి రన్నరప్గా నిలిచారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపిన టీం సభ్యులను తన కార్యాలయంలో సీనియర్ వైసీపీ నేతలు మండలి హనుమంతరావు శనివారం అభినందించారు.
KRNL: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఉపకులపతిగా రాయలసీమ నుంచి మొట్టమొదటి వ్యక్తిగా కర్నూలుకి చెందిన డాక్టర్ చంద్రశేఖర్ నియామకం కావడం శుభపరిణామం అని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. శనివారం కర్నూల్ మెడికల్ కళాశాలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిని NTR హెల్త్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ చంద్రశేఖర్తో కలిసి పరిశీలించారు. అనంతరం చంద్రశేఖర్ను సన్మానించారు.
KRNL: అంతర్జాతీయ క్రీడాకారుడు రామాంజనేయులును ఆదుకోవాలని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు. శారీరక వికలాంగుడైన రామాంజనేయులు 2015 నుంచి వివిధ రకాల క్రీడాల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ, రాణిస్తున్న ఆర్థిక ప్రోత్సాహంలేక ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే శనివారం తెలిపారు. ఇలాంటి క్రీడాకారులను దాతలు ముందుకు వచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.
NTR: అమరావతి 2.0కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన వేడుకకు రాష్ట్రవ్యాప్తంగా జైత్రయాత్ర కదిలిందని శనివారం ఏపీ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. రూ.49,040 కోట్ల ప్రాజెక్టులకు వెలగపూడిలో ప్రారంభోత్సవాలు వైభవంగా జరిగాయని, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో రాజధాని గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొందన్నారు.
SKLM: గార మండలం సతివాడ గ్రామంలో శనివారం ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ మేరకు శ్రీకూర్మం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డా.డి. పద్మజ పలువురు రోగులకు కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు అందజేశారు. ఈ వైద్య శిబిరంలో ఏఎన్ఎం అప్పమ్మ, 104 సిబ్బంది, ఆశా కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
SKLM: పాతపట్నం మండల కేంద్రానికి సమీపంలోని కాకితోట వద్ద శనివారం గుణుపూర్ నుంచి పూరి వెళ్తున్న రైలు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. గుర్తుపట్టలేని విధంగా మృతదేహం నుజ్జునుజ్జయింది.
KRNL: కౌతాళం మండలంలోని ఉరుకుందలో వెలసిన శ్రీ నరసింహ ఈరన్నస్వామి దేవస్థానంలో శనివారం హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. 05-03-2025 నుంచి 01-05-2025, 56 రోజుల స్వామివారి హుండీని లెక్కించారు. హుండీ ఆదాయం రూ.1,14,68,836, బంగారం 29.గ్రా 100 మి. గ్రా, వెండి 13 కేజీల 790గ్రా. వచ్చిందని అదికారులు తెలిపారు.
NDL: రుద్రవరంలోని హైస్కూల్ కాలనీకి చెందిన వైసీపీ యువ నాయకుడు అవుట శ్రీనివాసులు మృతి పార్టీకి తీరనిలోటని మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి అన్నారు. శనివారం అనారోగ్యంతో మృతి చెందిన శ్రీనివాసులు మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. మాజీ ఎమ్మెల్యే వెంట వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
KKD: ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపు భగీరథ జయంతిని ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగలి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం కలెక్టరేట్లో ఈ జయంతి కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతి నిధులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజలు హాజరు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
SKLM: పాతపట్నంలో కొలువైన శ్రీ నీలమణి దుర్గమ్మ ఆలయం 50వ వార్షిక మహోత్సవాల్లో భాగంగా వైశాఖ మాసం శనివారం పురస్కరించుకుని అమ్మవారు భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు రాజేశ్ ఆధ్వర్యంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు అలకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు కోసం తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో వాసుదేవరావు తెలిపారు.