KRNL: వాలంటీర్లను విధుల్లోకి తీసుకొని ఉపాధి కల్పించాలని సీఐటీయు ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మిగనూరులో జిల్లా జాయింట్ కలెక్టర్ బి. నవ్యకి వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ పట్టణ కార్యదర్శి రాముడు, గ్రామ వార్డు వాలంటర్ యూనియన్ గౌరవ అధ్యక్షులు సురేష్, అధ్యక్షురాలు శిరీష మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వాలెంటీర్లను విధుల్లోకి తీసుకోవాలన్నారు.
CTR: జిల్లాలో స్వయం సహాయక సంఘాల ఆర్థిక లావాదేవీలతో పాటు సమగ్ర వివరాలను క్రోడీకరించే విధంగా రూపొందించిన ‘లోకోస్ యాప్’ సేవలను సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీదేవి తెలిపారు. బుధవారం చిత్తూరులోని జిల్లా సమాఖ్య సమావేశంలో జిల్లాలోనీ అకౌంటెంట్ల సమావేశం జరిగింది. యాప్ ఉపయోగం గురించి వివరించారు.
NDL: బీసీ కార్పొరేషన్ కింద 50% సబ్సిడీతో అందించే రుణాల మంజూరుకు ప్రభుత్వం మరోసారి దరఖాస్తు గడువు పొడిగించినట్లు సంజామల ఎంపీడీవో సాల్మన్ తెలిపారు. ఇవాల్టితో గడువు ముగుస్తుండగా.. ప్రభుత్వం ఈనెల 15 వరకు పొడిగించిందన్నారు. 21 నుంచి 60 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. BC(A)-23, BC(B)-14, BC(D)-7, BC(E)-11, EBC-4 ఉన్నట్లు వెల్లడించారు.
KRNL: ఎమ్మిగనూరు మండలం రీ సర్వే పైలెట్ ప్రాజెక్టుగా ఎన్నికైన కడిమెట్ల గ్రామంలో జరుగుచున్న రీసర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో జాయింట్ కలెక్టర్ నవ్వ, సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నవ్వ మాట్లాడుతూ.. రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఇందులో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి పాల్గొన్నారు.
SKLM: టెక్కలి కోర్టులో మార్చి 8న జరగనున్న “జాతీయ లోక్ అదాలత్”ను సద్వినియోగం చేసుకొని ఎక్కువ కేసులు రాజీకి అందరూ సహకరించాలని టెక్కలి కోర్టు సివిల్ జడ్జి ఎమ్.రోషిణి కోరారు. టెక్కలి కోర్టుల పరిధిలోని న్యాయవాదులు, పోలీసు అధికారులుతో కోర్టు హాల్లో ఆమె వేరువేరుగా జాతీయ లోక్అదాలత్ పై బుధవారం సమీక్ష సమావేశాలు నిర్వహించారు.
VZM: ఈపీఎఫ్ కనీస పింఛను రూ.9 వేలు చెల్లించాలని ఈపీఎఫ్ పింఛన్దారుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. నెల్లిమర్ల పోస్టు ఆఫీసు వద్ద ఈపీఎఫ్ పింఛన్దారుల సంఘం నాయకులు మొయిద పాపారావు, కిల్లంపల్లి రామారావు ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 78.49 లక్షలు మంది ఉన్నారని చెప్పారు.
ELR: తెలుగుదేశం జాతీయ కార్యాలయం మంగళగిరిలో రాష్ట్ర అధ్యక్షులు పళ్ళ శ్రీనివాస్, మంత్రి కొల్లి రవీంద్రతో కలిసి రాష్ట్ర ట్రైకర్ ఛైర్మన్, పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ బొరగం శ్రీనివాసులు ప్రజాసమస్యలు వినతలు స్వీకరించారు. వచ్చిన వినతులపై సమీక్షించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రజా సమస్యల నిర్మూలనకు కృషి చేస్తామన్నారు.
PLD: మాచర్ల పురపాలక సంఘ పరిధిలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కమిషనర్ వేణుబాబు బుధవారం పరిశీలించారు. పురపాలక సంఘ పరిధిలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని కమిషనర్ అన్నారు. పురపాలక సిబ్బంది తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించడం జరుగుతుందని తెలిపారు. స్వచ్ఛ మాచర్లకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన అన్నారు.
VZM: జిల్లాలోని ప్రధాన రహదారులపై సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ఆదేశించారు. అన్ని మండల కేంద్రాలు, మున్సిపాలిటీలు, మేజర్ పంచాయితీలు, జాతీయ రహదారిపై ముందుగా కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. హిట్ అండ్ రన్ జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశం క&zwnj...
VZM: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం న్యూ ఢిల్లి ఏపీ భవన్లో ఏర్పాటు చేసిన చేనేత ఎగ్జిబిషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా తనకు వచ్చిన పార్లమెంట్ నిధులలో మొదటి కోటి రూపాయలు విజయనగరం పార్లమెంట్లోని చేనేత రంగ అభివృద్ధి కై ఖర్చు చేయబోతునట్లుగా తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలోని చేనేత కార్మికులకు న్యాయం జరుగుతుందని అన్నారు.
KRNL: కోడుమూరు మండలంలో చౌడేశ్వరి దేవి అమ్మవారికి డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి బుధవారం పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా తమ అభిమాన నాయకుడికి స్థానిక నేతలు, గ్రామస్థులు డప్పు మేళాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ నిర్వహకులు, ఆలయం మర్యాదల చేత ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్య క్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
KRNL: రాష్ట్రంలో కౌలు రైతులకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కౌలు రైతు సంఘం పట్టణ కార్యదర్శి గోపాల్, సీపీఐ కార్యదర్శి మండల కార్యదర్శి కల్లుబావి రాజు కోరారు. బుధవారం తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కౌలు రైతులు పండించిన పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కేటాయించాలన్నారు. రైతు ఆత్మహత్యలలో కౌలు రైతుల సంఖ్య అధికంగా ఉందని గుర్తు చేశారు.
AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టంలోని శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయంలో మాఘపౌర్ణమి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి ఆలయ కొండకు ఇరువైపులా గిరి ప్రదర్శన చేశారు. ప్రతి ఏడాది మాఘపౌర్ణమి సందర్భంగా ఈ గిరి ప్రదర్శన చేస్తున్నట్లు వీరు తెలిపారు.
AKP: పరవాడ మండలం పెదముషిడివాడ గ్రామానికి చెందిన జన సైనికుడు బలిరెడ్డి బాబి రెండు రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో పంచకర్ల యువసేన యూత్ సహాయం అందించడానికి ముందుకు వచ్చింది. బుధవారం రూ.10,000 నగదు, రైస్ బ్యాగ్ అందించారు. ఈ కార్యక్రమంలో పంచకర్ల యువసేన యూత్ సభ్యులు సతీశ్, వెంకటేశ్, హేమంత్, రవి, ప్రతాప్, మనోహర్ పాల్గొన్నారు.
SKLM: కంచిలి మండలం చిన్న కొజ్జిరియా గ్రామానికి చెందిన గొనప జగ్గు నాయుడు అనే విద్యార్థి ఇటీవల విడుదలైన జెఈఈ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారని ఎంఈవో శివరాం ప్రసాద్ బుధవారం తెలిపారు. ఈ పరీక్ష లో 97.8 పర్సంటైల్తో ఉత్తీర్ణత సాధించారన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.