NTR: రబీలో పండిన ధాన్యాన్ని మద్దతు ధర ప్రకారం వెంటనే కొనుగోలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఇబ్రహీంపట్నం మండలం ఈలప్రోలులో ఆయన పర్యటించారు. రైతులతో మాట్లాడి ధాన్యం అమ్ముకోవడంలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రబీలో ధాన్యానికి మద్దతు ధర దక్కడంలేదని రైతులు వాపోయారు.
ASR: ఎంపీడీవో ఆఫీసులో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారంన రద్దు చేసినట్లు ఆదివారం అరకులోయ ఎంపీడీవో లవరాజు తెలిపారు. రేపు సోమవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరకులోయ పర్యటన కారణంగా రేపు జరగవలసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను రద్దు చేయడం జరిగిందని ఎంపీడీవో పేర్కొన్నారు. కావున ప్రజలు గమనించగలరని కోరారు.
NDL: ఇండ్లకు విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగిస్తే అడ్డుకుంటామని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగేశ్వరరావు హెచ్చరించారు. ఆదివారం నందికోట్కూరు మున్సిపాలిటీ వాల్మీకి నగర్లో విద్యుత్ స్మార్ట్ మీటర్ల స్టిక్కర్ విడుదల చేసి, ఇండ్లకు అతికించడం జరిగింది. జగన్ చేసిన తప్పిదాలను కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లుతుందన్నారు.
NDL: శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి, శ్రీ సీతారాముల వారి కల్యాణ మహోత్సవ సందర్భంగా పగిడ్యాలలో సోమవారం పోట్టేల పందెములు నిర్వహిస్తున్నట్లు కార్య నిర్వాహకులు బి.నాగేశ్వ రెడ్డి, శివరామి రెడ్డిలు ఆదివారం తెలిపారు. గెలుపొందిన వారికి రూ.8.000, రూ.6.000, రూ.4.000 మూడు బహుమతులు కలవన్నారు. వివరములకై సెల్:9949493857ను సంప్రదించాలని తెలిపారు.
KDP: ప్రమాదవశాత్తు, సహజ మరణం చెందిన కార్మికుల కుటుంబాలకు బీమా పరిహారం కోసం ఎదురుచూస్తున్నారని ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ బాదుల్లా పేర్కొన్నారు. ఆదివారం కడపలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు చనిపోయిన కార్మికుల కుటుంబాలు అందరికీ సహాయం అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
KDP: గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా 2432 టిడ్కో ఇళ్లను ప్రజలకు పంపిణీ చేయలేదని కడప ఎమ్మెల్యే మాధవి ఆరోపించారు. కడపలోని లక్ష్మీ నగర్లో టిడ్కో ఇళ్లకు రోడ్ పనులను ఆమె ప్రారంభించారు. 2014 నుంచి 2019 వరకు ఉన్న టీడీపీ హయాంలో ఇళ్లు పూర్తి అయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వం ఇళ్లను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందిస్తామని తెలిపారు.
GNTR: నగరపాలక సంస్థలో సోమవారం (ఏప్రిల్ 7) పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు జనన మరణ నమోదు కార్యాలయం (పార్కింగ్ వద్ద) నిర్వహిస్తామని జిఎంసి కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. అదే రోజున కౌన్సిల్ హాల్లో వార్షిక బడ్జెట్ సమావేశం జరుగనున్నందున ఈ స్థల మార్పు జరిగిందన్నారు.
ప్రకాశం: కనిగిరి పట్టణంలో సీతారామ కళ్యాణ మహోత్సవ సందర్భంగా ఆదివారం హనుమాన్ భజన సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుని ప్రతేక పూజలు నిర్వహించారు. డీఎస్పీ సాయి ఈశ్వర్ కుటుంబ సభ్యులను కనిగిరి బ్రాహ్మణ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు.
CTR: పీలేరు పట్టణంలోని ప్రకాశం రోడ్డులో గల శ్రీరాములవారి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MLA కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆయనకు అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
PPM: కురుపాం (M)సింగుపురం గ్రామంలో గత 20 రోజులుగా శ్రీ జాకరమ్మ తల్లి యూత్ ఆధ్వర్యంలో జరిగిన మెగా క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్లో విజేతగా నిలిచిన పోలీస్ టీంకు అరకు మాజీ పార్లమెంట్ సభ్యులు వైరుచర్ల ప్రదీప్ చంద్ర దేవ్ చేతులు మీదగా రూ.20,000 క్యాష్ ప్రైస్తో పాటు ట్రోపీను అందజేశారు. ప్రతిభను వెలుగు తీసేందుకే క్రీడా పోటీలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.
TPT: తిరుపతిలోని శ్రీకోదండరామ స్వామివారి ఆలయం నవమి శోభను సంతరించుకుంది. రాములవారి దర్శనార్థం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. శ్రీరామనవమి సందర్భంగా పుష్పాలు, విద్యుత్ దీపాలంకరణలతో రామాలయం వెలిగిపోతోంది. ఉదయం నుంచి క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ మంచి నీరు, మజ్జిగ పంపిణీ చేసింది.
ప్రకాశం: కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో దైవ సేవకులు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి నిరసనగా మండల క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. క్రైస్తవులపై దాడులు అరికట్టాలంటూ వారు నినాదాలు చేశారు. ప్రవీణ్ పగడాల కేసులో న్యాయం జరగాలంటూ పలువురు నినదించారు. దర్యాప్తు సక్రమంగా జరగాలని కోరారు. నిజా నిజాలు తేల్చాలని డిమాండ్ చేశారు.
SKLM: సీతంపేట మండలం దుగ్గి గ్రామం లో పీఎమ్ జన్ మన్ పథకం ద్వారా రూ.8.లక్షల అంచనా విలువతో 10000 లీటర్ల సామర్ధ్యం గల వాటర్ ట్యాంక్, ఇంటి ఇంటికి మంజూరైన నీటి కుళాయిలుకు ఆదివారం పాలకొండ ఎమ్మెల్యే ఎన్.జయకృష్ణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి శుభ్రమైన నీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.
CTR: బోయకొండ గంగమ్మకు భక్తులు భారీగా కానుకలు సమర్పించారు. హుండీ ద్వారా ఏడాదికి రూ. 5.52 కోట్లు సమకూరినట్లు ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం వెల్లడించారు. గతేడాది కంటే ఇది రూ. 72 లక్షలు అధికమని చెప్పారు. అలాగే బంగారు, వెండి సైతం భారీగా సమకూరిందన్నారు. ఆలయ ఆదాయానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
NDL: బనగానపల్లె మండలం నందవరం గ్రామంలోని శ్రీ చౌడేశ్వరి ఆలయ అభివృద్ధికి ప్యాపిలి వాస్తవ్యులు తుమ్మనేని రాజశేఖర్ నాయుడు కుటుంబం రూ.50 వేల విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు కుటుంబ సమేతంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరమ్మ, మాజీ చైర్మన్ పీవీ కుమార్ రెడ్డికి ఆదివారం విరాళాన్ని అందించారు. దర్శన ఏర్పాట్ల అనంతరం దాతలకు తీర్థప్రసాదాలు అందజేశారు.