తిరుమల శ్రీవారి దర్శనానంతరం CM చంద్రబాబు కుటుంబ సమేతంగా శ్రీ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి చేరుకున్నారు. స్వయంగా కుటుంబ సభ్యులే భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. అనంతరం సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు మంత్రి లోకేశ్, మనవడు దేవాన్ష్ అక్కడి భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు.
ATP: టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి మరణం పట్ల పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంతాపం వ్యక్తం చేశారు. పార్టీకి, ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. నిబద్ధతతో పనిచేసిన నాయకుడిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని పేర్కొన్నారు. హనుమంతరాయ చౌదరి మరణం పార్టీకి, కుటుంబ సభ్యులకు తీరని లోటుగా అభివర్ణించారు.
ప.గో: జిల్లాలో అతిపెద్ద దర్గా అయిన జమాతే దర్గాలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తొలుత ఆయనను ముస్లిమ్ మత పెద్దలు ముస్లిం టోపీ పెట్టీ శాలువాతో సత్కరించారు. అనంతరం అల్పాహార విందు ముస్లిం లతోపాటు ఆరగించారు. అన్నీ మాతలు ఒక్కటేనని ఆయన సూచించారు.
CTR: జిల్లాలోని యాదమరి మండలం చిన్న రెడ్డిపల్లి క్రాస్ సంత వద్ద ఇవాళ ఉదయం నుంచే గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు బారులు తీరారు. వందలాది సిలిండర్లను లైన్లో పెట్టి నిరీక్షిస్తున్నారు. గంటల తరబడి వేచి చూసినా సిలిండర్లు అందడంలేదని పలువురు తెలిపారు. జిల్లాలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని అధికారులు చెబుతున్నప్పటికీ సిలిండర్లు మాత్రం దొరకడంలేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కోనసీమ: యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అముడా చైర్మన్ స్వామి నాయుడు పాల్గొన్నారు.
W.G: భీమవరం కలెక్టరేట్లో గృహ గణనపై శుక్రవారం తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో DRO శివన్నారాయణ గూగుల్ మీట్ ద్వారా సమీక్ష చేశారు. ఆయన మాట్లాడుతూ.. గృహ గణన కార్యక్రమం విజయవంతంగా అమలు కావాలంటే ప్రాథమిక స్థాయి నుంచి పటిష్టమైన ఏర్పాట్లు అవసరమని తెలిపారు. ఈ ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా, నిష్పాక్షికంగా సమాచార సేకరణ జరిగేలా చూడాలని సూచించారు.
కృష్ణా: జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ప్రస్తుతం ఎటువంటి ఇబ్బందులు లేవని జేసీ నవీన్ అన్నారు. వినియోగదారులకు నిరంతరాయంగా గ్యాస్ సరఫరా జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. ఒక గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత, మరో సిలిండర్ బుక్ చేసుకునేందుకు గ్రామీణ ప్రాంతాల వినియోగదారులకు 45 రోజులు, పట్టణ ప్రాంతాలలో 25 రోజులుకు బుక్ చేసుకోవాలన్నారు.
AKP: పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా టీకాలు వేయించాలని పశువైద్య అధికారిణి డాక్టర్ కె.రాఘవమ్మ సూచించారు. శుక్రవారం చీడికాడ మండలం బైలపూడిలో పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా టీకాలు వేశారు. పాడి పశువులకు గాలికుంటు వ్యాధి సోకితే పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుందని అన్నారు.పెయ్యిలకు సోకితే మరణాలు సంభవిస్తాయన్నారు.
W.G: పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా తణుకు పట్టణంలోని కొమ్మాయి చెరువుగట్టు వద్ద ఉన్న ఈద్గా వద్ద ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యత మరింత బలపడాలని మనస్పూర్తిగా ఆశించారు.
VZM: బొబ్బిలి సీఐ కె. నారాయణరావు శుక్రవారం సాయంత్రం స్దానిక ఆకుల రెల్లివీదిలో శక్తి యాప్, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్ధాలపై మహిళలకు అవగాహన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలు స్మార్ట్ ఫోన్లో శక్తి యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నారు. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండేలా పిల్లలపై పర్యవేక్షణ చేయాలని కోరారు. సైబర్ నేరాలకు గురికాకుండా జాగ్రత్త పడాలన్నారు.
E.G: పర్యావరణ పరిరక్షణలో పిచ్చుకల పాత్ర ఎంతో కీలకమని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత చిలికూరి శ్రీనివాసరావు తెలిపారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా కడియంలో పిచ్చుకల కోసం వరి కంకులు కట్టారు. వేసవిలో పక్షుల కోసం ప్రతి ఇంటిలో ఆహారం, నీరు ఏర్పాటు చేయాలని, అంతరించిపోతున్న పిచ్చుకలను కాపాడటం మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు.
ప్రకాశం: మార్కాపురం మండలం ఇడుపూరులోని ఆంజనేయ స్వామి గుడి వద్ద సంకుల మల్లయ్య అనే వ్యక్తి చనిపోయాడు. గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ ఎస్సై వేమన మృతదేహాన్ని పరిశీలించారు. తల వెనుక గాయాలు ఉండటంతో అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జీజీహెచ్కు తరలించారు.
KDP: లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా వెలసిన వెయ్యి నూతులకోనలో శనివారం సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి తెల్లవారుజామున జల, పసుపు, కుంకుమ, చందన, తేనెతో పంచామృత అభిషేకాలు చేపట్టి అనంతరం పూల మాలలు, తులసి దళాలతో అలంకరించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులకు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
PLD: మాచర్ల నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసాన్ని భక్తి, నియమ నిష్ఠలతో పాటిస్తూ ఉపవాస దీక్షలు నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. అల్లా కృపతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాతో ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని… ఐక్యంగా, సౌభ్రాతృత్వంతో జీవించాలని ఆకాంక్షించారు.