బాపట్ల: రేపల్లెలో సోమవారం తెల్లవారుజామున విషాద ఘటన జరిగింది. 5వ వార్డులో నివసించే సింగోటి కోటేశ్వరమ్మ అనే మహిళా ఉద్యోగి తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె స్థానిక సచివాలయంలో ఏఎన్ఎంగా పనిచేస్తుంది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
CTR: పెనుమూరు మండలం మాజీ MPTC అరుణకుమారి తమ పొలంలో దౌర్జన్యంగా రోడ్డు వేసి తమను వేధిస్తోందని సామిరెడ్డిపల్లికి చెందిన ఉష, సుజన వాపోయారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో వారు మాట్లాడుతూ.. జీడీనెల్లూరు MLA థామస్ పేరు వాడుకుని ఆయనకు చెడ్డ పేరు తెచ్చేలా అరుణకుమారి అక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు. రికార్డుల ప్రకారం ఆమె ఆక్రమించుకున్న భూములు రోడ్డు మార్గానివేనన్నారు.
SKLM: నర్సన్నపేట మండలం చింతువానిపేట గ్రామానికి చెందిన ప్రముఖ వైద్య అధికారి జిల్లా అడిషనల్ డీఎంహెచ్వో తాడేలా శ్రీకాంత్ మాతృమూర్తి సోమవారం తెల్లవారుజామున స్వర్గస్తులయ్యారు. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ సోమవారం గ్రామానికి వెళ్లి ఆమె భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనతో పలువురు నేతలు పాల్గొన్నారు.
ప్రకాశం: ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సోమవారం గిద్దలూరులో పర్యటించనున్నారు. మార్కెట్ యార్డులో రైతులకు వ్యవసాయ సబ్సిడీ పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో కార్య కర్తలకు అందుబాటులో ఉంటారని టీడీపీ కార్యాలయం తెలిపింది.
కోనసీమ: నేడు రావులపాలెంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తునట్లు ఎంపీడీవో మహేష్ తెలిపారు. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుందన్నారు. ఈ సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు పాల్గొనాలని కోరారు. అలాగే, సంబంధిత అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలన్నారు.
ATP: శెట్టూరు మండలంలో ఈ నెల 5 నుంచి 15వ తేదీ వరకు ఆధార్ శిబిరాలు నిర్వహించనున్నట్లు ఇన్చార్జ్ ఎంపీడీవో రఘురామరావు తెలిపారు. మండలంలోని ఐదుకల్లు, యాటకల్లు, చిన్నంపల్లి, బచ్చేహళ్లి, చింతర్లపల్లి గ్రామాల్లో శిబిరాలు రోజువారీగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
SKLM: వాతావరణ శాఖ అధికారులు సూచనల మేరకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి పలు సూచనలు జారీ చేశారు.
KKD: రైతులకు కూటమి ప్రభుత్వం ఆపద్బాంధవుడుగా పని చేస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కాకినాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం కంటే కూడా అదనంగా 11 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. రైతులకు అండగా ఈ ప్రభుత్వం పనిచేయడం జరుగుతుందన్నారు.
కోనసీమ: గ్రామాలలో రోడ్డు సదుపాయాల అభివృద్ధి ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా అవకాశాలు కలుగుతాయని.. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం రావులపాలెం మండలం గోపాలపురంలో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డు, డ్రైన్ను పరిశీలించారు.
E.G: పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సోమవారం పర్యటన వివరాలు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఉదయం 10:30కు అయినవిల్లి మండలం ఎన్. పెదపాలెంలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11:30కు అంబాజీపేట మండలంలో ఇటీవల సింహాచలంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.
SKLM: పాతపట్నంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం డీసీసీబీ ఛైర్మన్గా నియమితులైన శివాల సూర్యం పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని ముందుండి నడిపించిన కార్యకర్తలే అధినేతగా గుర్తించబడతారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
కోనసీమ: ఇటీవల పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (PAC) సభ్యులుగా నియమితులైన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ని రామచంద్రపురం YCP కార్యాలయం వద్ద కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
E.G: భారీ వర్షాల దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లాలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. ఆదివారం నుంచి 72 గంటల పాటు కలెక్టరేట్, డివిజన్ కేంద్రాల్లో కంట్రోల్ రూం నంబర్లు అందుబాటులో ఉంటాయన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నంబర్: 8977935611, 08832442344, కొవ్వూరు: 8500667698 నంబర్లో సంప్రదించాలని కోరారు.
NDL: బనగానపల్లె మండలం ఫతేనగర్ గ్రామంలో మమత అనే వివాహిత కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన మమత అనే మహిళ కుటుంబ కలహాలతో ఆదివారం నాడు పేడలో రంగు పసుపు నీళ్లు కలిపి తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SKLM: సోంపేట మండలం బారువ బీచ్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. మూడు రోజులపాటు జరగనున్న ఈ బీచ్ ఫెస్టివల్లో ఇసుకతో చేసిన సైకతశిల్పం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సైకతశిల్పంలో ఆలీవ్ రిడ్లే తాబేళ్లు, బారువ లైట్ హౌస్ తదితర ఆకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పర్యాటకులు ఎంతో ఆసక్తిగా రూపొందించిన సైకితశిల్పాన్ని ఆసక్తిగా చూశారు.