ATP: కార్మికులకు మున్సిపల్ శాఖనే వేతనాలు చెల్లించాలని, ఇంజనీరింగ్ కార్మికులకు గత సమ్మె హామీ ప్రకారం వేతనాలు పెంచాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం మున్సిపల్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామికి వినతి పత్రం అందజేశారు.
CTR: కుప్పం మున్సిపాలిటీలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన చిరు వ్యాపారుడు వేలు అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి చిరు వ్యాపారం సంఘం అధ్యక్షుడు మంజునాథ్ ఆధ్వర్యంలో సోమవారం రూ.15 వేల ఆర్థిక సాయం అందజేశారు. వేలు అనారోగ్యంతో మృతి చెందడం అత్యంత బాధాకరమని, వారి కుటుంబానికి అన్ని విధాలుగా చిరు వ్యాపారుల సంఘం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
PLD: కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ను గెలిపించాలని జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ పిలుపునిచ్చారు. అమరావతి మండలం లేమల్లే, పెదకూరపాడు మండల బలుసుపాడులో సోమవారం పట్టభద్రులను గ్రాడ్యుయేట్లును ఓట్లు అభ్యర్థించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఆలపాటి కృషి చేస్తానని పేర్కొన్నారు.
CTR: పలమనేరు రూరల్ మండల పరిధిలోని కొలమాసనపల్లి గొల్లపల్లిలో నిర్వహిస్తున్న గంగ జాతరకు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సోమవారం ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికి, ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వెంట మాజీ సర్పంచ్ వెంకటరత్నం, సెల్వరాజ్, తదితరులు ఉన్నారు.
సత్యసాయి: పెనుకొండలోని ఆర్అండ్బి గెస్ట్ హౌస్లో మాల నాయకులు సోమవారం సమావేశం నిర్వహించారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షులు ఎం.ఎన్ మూర్తి మాట్లాడుతూ.. ఈనెల 23న వర్గీకరణకు వ్యతిరేకంగా రాయలసీమ జిల్లాల మాలలతో నిర్వహించు మాలల మహా సింహ గర్జన సభకు సంబంధించి కరపత్రాలు విడుదల చేశారు. మాలల మహా సింహ గర్జన సభకు జిల్లా నుండి మాలలు తరలి రావాలని పిలుపునిచ్చారు.
ATP: గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డిని సోమవారం నెలగొండ వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైసీపీ నాయకులు జయరాంరెడ్డి మాట్లాడుతూ… మాజీ ఎమ్మెల్యే రాకతో వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ వచ్చిందని తెలిపారు.
సత్యసాయి: రేషన్ షాపుల ద్వారా 16 రకాల నిత్యవసర వస్తువులను ప్రజలకు అందించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) ఆద్వర్యంలో పెనుకొండ ఆర్డీవోకి 200 మందితో సంతకాలతో సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా శ్రీ సత్యసాయి జిల్లా నాయకురాలు గౌతమి, అంజనా దేవి, స్థానికులు సుమిత్ర, కావేరి, కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.
VZM: మక్కువ మండలానికి చెందిన ఓ ప్రముఖ పత్రకా విలేఖరి రామారావుపై టీడీపీ నాయకుడు దాడి చేయడాన్ని జిల్లా వైసీపీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో ఖండించారు. ప్రజాస్వామ్య మనుగడకు మూలాధారమైన పత్రికా వ్యవస్థపై దాడి సమంజసం కాదని, వ్యతిరేక వార్తలు రాసినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా దానికి వివరణ ఇవ్వాలని, ప్రకటన ద్వారా ఖండించాలి తప్ప, దాడులు సరైనవి కాదన్నారు.
ELR: చింతలపూడి ఐసీడీఎస్ ప్రాజెక్టు వద్ద అంగన్వాడి కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్వి ఎస్ నారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారిన అంగన్వాడీల బ్రతుకు మారలేదన్నారు. 42 రోజులు అంగన్వాడీల సమ్మె సందర్భంగా అప్పటి ప్రభుత్వంతో కుదుర్చుకున్న అగ్రిమెంట్ నేటి వరకు అమలు కాలేదన్నారు. రాబోయే కాలంలో మరో సమ్మె చేస్తామన్నారు.
W.G: మన్యం జిల్లాలోని మక్కువ మండల విలేకరి మాల్యాడ రామారావుపై మండల టీడీపీ అధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్ దాడి చేయడాన్ని నిరసిస్తూ యలమంచిలి తహసీల్దార్ కార్యాలయం వద్ద జర్నలిస్టులు సోమవారం నిరసన చేపట్టారు. అనంతరం తహశీల్దార్ గ్రంధి పవన్ కుమార్కి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరారు.
ATP: రాయదుర్గం పట్టణంలో ప్రధానంగా డ్రైనేజీలు, కాలువలు లేక వివిధ వార్డుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మల్లికార్జున కలెక్టర్ వినోద్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. పట్టణంలో సీతారామాంజనేయ కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్న విషయం తెలిసిందే.
ATP: గుంతకల్లు పట్టణ శివారులో సోమవారం రైలు కిందపడి ఓ గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
సత్యసాయి: రొద్దం మండల పరిధిలోని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తహశీల్దార్ ఉదయ శంకర్ రాజు, ఎంపీడీఓ ప్రేమ్ కుమార్లను ఎంపీ పార్థసారథి ఆదేశించారు. సోమవారం మరువపల్లిలో తన స్వగృహంలో అధికారులతో సమీక్షించారు. ఎంపీ మాట్లాడుతూ.. మండల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారుల దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
ASR: కొయ్యూరు మండలంలోని బకులూరు గ్రామానికి చెందిన బీ.రాజుబాబు అనే రిమాండ్ ఖైదీ మృతి చెందాడని ఎస్సై పీ.కిషోర్ వర్మ సోమవారం తెలిపారు. కోట్లాట కేసుకు సంబంధించి రాజుబాబు విశాఖ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఊపిరి తిత్తులు, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అతడిని జైలు సిబ్బంది కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు.
GNTR: నారాకోడూరు రోడ్డు ప్రమాద ఘటనపై జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. ప్రమాద ఘటనపై మంత్రి దుర్గేష్ ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జీజీహెచ్ వైద్యులకు మంత్రి దుర్గేష్ ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంలో ముగ్గురు మహిళలు దుర్మరణం చెందారన్న వార్త కలిచి వేసిందన్నారు. భాదితులకు అండగా ఉంటామని అన్నారు.