• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రైల్వే స్టేషన్‌లో గుర్తుతెలియని యువకుడు మృతి

W.G: కృష్ణా జిల్లా తరిగొప్పుల రైల్వే స్టేషన్ ప్లాట్ఫారమ్ వద్ద గుర్తుతెలియని యువకుడు (సుమారు 25-30 ఏళ్లు) రైలు ఢీకొని మృతి చెందాడు. మృతుని వివరాలు తెలిసిన వారు వెంటనే గుడివాడ రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని భీమవరం రైల్వే జీఆర్పి సుబ్రహ్మణ్యం కోరారు. మృతుని ఆచూకీ తెలిస్తే 92475 85713, 99890 29379 నెంబర్లను సంప్రదించాలని విన్నవించారు.

March 21, 2026 / 11:16 AM IST

అకాల వర్షంతో అరటి రైతులకు భారీ నష్టం

NDL: గిట్టుబాటు ధరలు లేక ఇప్పటికే నష్టాల్లో ఉన్న అరటి రైతులను అకాల వర్షం మరింత కుదిపేసింది. మండలంలోని చిన్న వంగలి గ్రామంలో ఈదురు గాలులకు అరటి తోటలు నేలకూలాయి. లక్ష్మీకాంతరెడ్డి, మోహనరెడ్డి, నారాయణరెడ్డి, నాగయ్యలకు చెందిన పంట దెబ్బతింది. దీంతో రూ.2 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు.

March 21, 2026 / 11:16 AM IST

రైళ్లలో చోరీ.. విశాఖలో కాకినాడ వాసి అరెస్టు

KKD: రన్నింగ్ ట్రైన్స్‌లో ల్యాఫ్‌టాప్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని జీఆర్పీ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్‌ఫెక్టర్ సీహెచ్. ధనంజయ నాయుడు ఆధ్వర్యంలో స్టేషన్‌లో తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న కాకినాడకు చెందిన అనంత దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.2 లక్షల విలువైన 4 ల్యాప్‌టాప్, రూ.20 వేలు స్వాధీనం చేసుకున్నారు. 

March 21, 2026 / 11:15 AM IST

బస్టాండ్‌లో గుర్తు తెలియన వ్యక్తి మృతి

E.G: దేవరపల్లిలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన నెలకొంది. వివరాల్లోకి వెళితే.. బస్టాండ్‌కి వచ్చిన పలువురు ప్రయాణికులు ఉదయం మృతిదేహాన్ని గమనించారు. వెంటనే దేవరపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడు తెల్ల రంగు షర్టు ధరించి ఉన్నట్లు తెలియజేశారు. కాగా అతని మృతి‌పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

March 21, 2026 / 11:12 AM IST

ఖాజీపేటలో ఘనంగా రంజాన్ వేడుకలు

KDP: ఖాజీపేట పట్టణంలో ముస్లిం సోదరులు రంజాన్ పండుగను అత్యంత ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని ఈద్గా మైదానంలో నిర్వహించిన ఈద్-ఉల్-ఫితర్ ప్రత్యేక సామూహిక ప్రార్థనల్లో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం, ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మైదానం ప్రాంగణమంతా ఆధ్యాత్మిక, పండుగ వాతావరణంతో ఆహ్లాదకరంగా మారింది.

March 21, 2026 / 11:10 AM IST

వైభవంగా మత్స్య జయంతి వేడుకలు

TPT: నాగలాపురంలోని మత్స్యావతార మూర్తి శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో శనివారం ఉదయం మత్స్య జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక మత్స్య కార్మిక కుటుంబాల వారు కంకణం, ఇరుముడులు ధరించారు. వేదనారాయణ స్వామి ఆలయం నుంచి కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణస్వామి వారు గ్రామోత్సవానికి బయలుదేరారు.

March 21, 2026 / 11:07 AM IST

ఎర్రంపల్లిలో రేపు హనుమంతరాయ చౌదరి అంత్యక్రియలు

ATP: కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత హనుమంతరాయ చౌదరి అంత్యక్రియలు ఆదివారం ఉ.10 గంటలకు నిర్వహించనున్నారు. కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లి గ్రామంలో ఈ కార్యక్రమం జరగనుంది. అనారోగ్యంతో కన్నుమూసిన ‘పెద్దాయన’కు తుది వీడ్కోలు పలికేందుకు భారీగా అభిమానులు, రాజకీయ నాయకులు తరలిరానున్నారు. ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

March 21, 2026 / 11:06 AM IST

అన్నదాన ట్రస్ట్ కు రూ.50,116 విరాళం

కోనసీమ: వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం కానూరు కి చెందిన కాశీ చొప్పరపు రమేష్ బాబు, సునీత దంపతులు స్వామి వారిని దర్శించుకుని, ఆలయంలో నిర్వహిస్తున్న అన్నదాన ట్రస్ట్‌కు రూ.50,116లు విరాళం ఆలయ అధికారులకు అందజేశారు. వారికి ఆలయ అర్చకులు స్వామి వారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. 

March 21, 2026 / 11:05 AM IST

నేడు, రేపు వర్షాలు: APSDMA

VZM: బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో నేడు, రేపు వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఇవాళ రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రేపు విజయనగరంపాటు ఇతర జిల్లాలో కూడా వర్షాలు పడతాయని హెచ్చరించింది.

March 21, 2026 / 11:05 AM IST

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

కృష్ణా: పెడన–గుడివాడ రహదారిలో ఈద్గాలో రంజాన్ పర్వదినం దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొని,ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో శాంతి, సౌహార్ద్రం నెలకొనాలని ఆకాంక్షిస్తూ, రంజాన్ పర్వదినం అందరికీ ఆనందం, సుఖసంతోషాలు తీసుకురావాలన్నారు.

March 21, 2026 / 11:02 AM IST

తెనాలి ఈద్గాలో నమాజ్ చేసిన మంత్రి నాదెండ్ల

GNTR: తెనాలి చెంచుపేట ఈద్గాలో నిర్వహించిన రంజాన్ ప్రార్థనల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేసిన ఆయన, అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కఠోర దీక్షల అనంతరం జరుపుకునే ఈ పండుగ అందరి ఇళ్లలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఈద్గా కమిటీ సేవలను అభినందించారు.

March 21, 2026 / 11:00 AM IST

రాజంపేటలో ఘనంగా రంజాన్ వేడుకలు

అన్నమయ్య: రాజంపేట పట్టణంలోని ఈద్గా మైదానంలో ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లిం సోదరులు ఘనంగా వేడుకలు నిర్వహించుకున్నారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న వారు ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈద్గా వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అర్బన్ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

March 21, 2026 / 10:53 AM IST

అమానుషం.. కాళ్లు, చేతులు కట్టేసి!

NLR:  జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఏపీ తీరంలోకి వచ్చిన తమిళనాడు బోట్లను మత్స్యకారులు పట్టుకొని జువ్వలదిన్నె హార్బర్ నిలిపారు. అయితే అల్లూరు మండలం ఇస్కపాలెంలోని పల్లి పాలేనికి చెందిన పెద్దకాపు వర్గం వీటిని విడుదల చేయించిందని సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన మత్స్యకారులు ఆ పెద్ద మనిషి, కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టి నిర్భంధించారని తెలుస్తోంది.

March 21, 2026 / 10:51 AM IST

రంజాన్ వేడుకల్లో ఎంపీ నాగరాజు

KRNL: రంజాన్ పండుగ సందర్భంగా నగరంలోని సంతోష్ నగర్ వద్ద ఉన్న ఈద్గాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనలలో MP బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. ముందుగా ముస్లిం సోదరులతో కలిసి ప్రార్ధనలు చేసిన ఎంపీ అనంతరం వారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. స్నేహం, కరుణ, క్రమ శిక్షణ దయగుణాలకు రంజాన్ ప్రతీకగా నిలుస్తుందన్నారు.

March 21, 2026 / 10:51 AM IST

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే

NTR: నందిగామ ఈద్గా వద్ద రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు ఈద్గా చేరుకుని ముస్లిం సోదరులు, సోదరీమణులను కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని, పరస్పర గౌరవంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

March 21, 2026 / 10:39 AM IST