• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

తాగునీటి బావిని వినియోగంలోకి తేవాలని వినతి

SKLM: జిల్లా ఆమదాలవలస మండలం చిన్న జొన్నవలస గ్రామంలో త్రాగునీటి బావిని వినియోగంలోనికి తెచ్చే విధంగా సంబంధిత అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని స్థానికులు రెడ్డి రామారావు, ఎం.మల్లేష్ శనివారం తెలిపారు. బావి పై నందలు తక్కువ ఎత్తు ఉండడంతో చిన్నారులు ఆదమరిస్తే బావిలో పడే ప్రమాదం ఉందని అన్నారు. అలాగే నీటికి క్లోరినేషన్ చర్యలు చేపట్టాలని కోరారు.

April 12, 2025 / 09:25 AM IST

ఇంటర్ విద్యార్థులారా.. GETREADY

SKLM: ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. నేడు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఫస్టియర్ 20,389 మంది, సెకండియర్ 19,967 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 40,356 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.

April 12, 2025 / 09:06 AM IST

నేటి నుంచి మూడు రోజులు పాటు వెంగమాంబ తల్లి తిరుణాల

ప్రకాశం: హనుమంతునిపాడు మండలంలోని మంగంపల్లి గ్రామంలో శనివారం నుంచి మూడు రోజులపాటు మంగమ్మ తల్లి సమేత గరటయ్య స్వామి తిరునాళ్ల కార్యక్రమం జరగనుంది. ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. మరోవైపు పోలీసులు తిరుణాలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు చర్యలను చేపట్టారు.

April 12, 2025 / 09:00 AM IST

మడపాం హైవే బ్రిడ్జిపై లారీ బోల్తా

SKLM: నరసన్నపేట మండలం, మండపాం హైవే బ్రిడ్జ్ పై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం నుంచి నరసన్నపేట వైపు కోడి గుడ్ల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడమే కారణంగా తెలుస్తోంది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

April 12, 2025 / 08:56 AM IST

రెండు రోజులు రైల్వే గేటు మూత

ELR: మండవల్లి గ్రామంలోని మండవల్లి మూడుతాళ్లపాడు రైల్వే గేటును మరో 2 రోజులు మూసివేస్తున్నట్లు సీనియర్ సెక్షన్ ఇంజనీర్ MD అబ్దుల్ రహమాన్ తెలిపారు. లెవల్ క్రాసింగ్ 74 (63 కిలోమీటరు ) వద్ద అత్యవసర ట్రాక్ మరమ్మతుల పనులు పూర్తి కాకపోవడంతో గేట్లు మూసివేసినట్లు తెలిపారు. ఈనెల 15 రాత్రి 7 గంటల వరకు గేటు మూసివేసి ఉంటుందన్నారు.

April 12, 2025 / 06:47 AM IST

SR కోట గ్రామం సమీపంలో పిడుగుపాటు

ATP: అనంతపురం జిల్లాలో 3 రోజులుగా వర్షాలు పడుతున్నాయి. ఇవాళ సాయంత్రం రాయదుర్గం నియెజకవర్గంలో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. ఈ క్రమంలో డి. హిరేహల్ మండలం SR కోట గ్రామం సమీపంలో పిడుగు పడింది. కొబ్బరి చెట్టుపై పడటంతో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

April 11, 2025 / 08:23 PM IST

‘వెల్లంపల్లిని కలిసిన వైసీపీ నేతలు’

NTR: విజయవాడలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును వైసీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల నూతనంగా నియమితులైన వైసీపీ పశ్చిమ నియోజకవర్గ మండల అధ్యక్షులు బొండా నిరీష్, కేసరి కృష్ణారెడ్డి, వాసా ఆదినారాయణ బాబు, అయితా కిషోర్లు వెల్లంపల్లిని కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వెల్లంపల్లిని వారు శాలువాతో సన్మానించారు.

April 11, 2025 / 08:16 PM IST

“ట్రూ అప్ చార్జీలు రద్దు చేయాలని’

NDL: స్మార్ట్ మీటర్లు వద్దు ట్రూప్ చార్జీలు రద్దు చేయాలని సిపిఎo పార్టీ పట్టణ కార్యదర్శి రణధీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆత్మకూరులోని సుదర్శన్ భవన్ నందు విద్యుత్ చార్జీలు తగ్గించాలని పోస్టర్ విడుదల చేశారు. రణధీర్ మాట్లాడుతూ.. విద్యుత్ బారాలపై కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు. 

April 11, 2025 / 08:15 PM IST

‘అహుడా అభివృద్ధికి ప్రభుత్వ సహకారం’

ATP: అనంతపురం-హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 19వ సమావేశం శుక్రవారం జరిగింది. అహుడా ఛైర్మన్ టీసీ వరుణ్, అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అభివృద్ధి అజెండాను ఈ సమావేశం ఆమోదించింది. అనంతరం వరుణ్ మాట్లాడుతూ.. అహుడా అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందేలా తాను కృషి చేస్తానని తెలిపారు.

April 11, 2025 / 07:57 PM IST

‘నాణ్యమైన ఆహారం సరఫరా చేయాలి’

SKLM: ఆసుపత్రిలోని పేషెంట్లకు నాణ్యమైన ఆహారం సరఫరా చేయాలని సరఫరా చేసే కాంట్రాక్టరుకు జిల్లా ఫుడ్ కంట్రోల్ అధికారి కె. వెంకటరత్నం సూచించారు. కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ అమరావతి ఆదేశాల మేరకు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పేషెంట్లకు సరఫరా చేసే ఆహారాన్ని శుక్రవారం ఆసుపత్రి డైటీషియన్ సమక్షంలో ఆయన పరిశీలించారు.

April 11, 2025 / 05:18 PM IST

మంత్రిని కలిసిన ఆలయ అసిస్టెంట్ కమిషనర్

KDP: చక్రాయపేట మండలంలోని గండిక్షేత్రంలో శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం ఆలయ అసిస్టెంట్ కమీషనర్ వెంకటసుబ్బయ్య, డిప్యూటీ కమిషనర్ పట్టెం గురు ప్రసాద్ ప్రధాన అర్చకులు కేసరి స్వామి, ఆలయ పాలకమండలి మాజీ ఛైర్మన్ వెంకటస్వామి శుక్రవారం బద్వేలులో మంత్రి ఆనం నారాయణ రెడ్డిని కలిశారు. ఆయనను శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వాదం చేశారు.

April 11, 2025 / 05:15 PM IST

శ్రీ పద్మావతి అమ్మవారికి బంగార గజ్జల కానుక

TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి కడపకు చెందిన డాక్టర్ రామస్వామి ఏలుమలై రెడ్డి దంపతులు బంగారు గజ్జలను కానుకగా అందజేశారు. అమ్మవారికి అలంకరించడానికి వీలుగా 120 గ్రాములు బంగారంతో రూ. 10 లక్షలు విలువైన రెండు గజ్జలను తయారు చేయించారు. ఆలయంలో గజ్జలను ఏఈఓ దేవరాజులు, ఆర్జితం ఇన్‌స్పెక్టర్ చలపతికి దాత కుటుంబ సభ్యులు అందజేశారు.

April 11, 2025 / 05:03 PM IST

ఎర్రగుంట్లలో రేషన్ డీలర్లు, ఎండీయూ ఆపరేటర్ల వాగ్వాదం

KDP: ఎర్రగుంట్ల పట్టణ పరిధిలోని పోలీస్ స్టేషన్ వెనక గల కాలనీలో శుక్రవారం రేషన్ డీలర్లు, ఎండీయూ ఆపరేటర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రేషన్ బియ్యం సరఫరా చేయకుండా దోచుకుంటున్నారని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొని ఘర్షణకు దిగారు. వీరి వాగ్వాదంతో లబ్ధిదారులు ఇబ్బంది పడ్డారు.

April 11, 2025 / 04:32 PM IST

పవన్ కళ్యాణ్‌ను విమర్శించే స్థాయి కవితకు లేదు

PLD: ఓకే గూటి పక్షులు ఒకేలా వ్యవహరిస్తున్నాయడానికి Dy సీఎం పవన్ కళ్యాణ్‌పై BRS నాయకురాలు కవిత చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని JSP నాయకుడు బాలాజీ అన్నారు. శుక్రవారం చిలకలూరిపేటలో ఆయన మాట్లాడుతూ.. జైలుకెళ్లి బెయిల్‌పై వచ్చిన జగన్‌కు లిక్కర్ స్కామ్‌లో జైలులో ఉండి వచ్చిన కవిత కితాబ్ ఇవ్వటం బాగానే ఉందన్నారు. పవన్ పేరెత్తే అర్హత కూడా కవితకు లేదన్నారు.

April 11, 2025 / 04:08 PM IST

రైతులను ముంచిన అకాల వర్షం

NLR: మనుబోలు మండల రైతులను అకాల వర్షం నిండా ముంచింది. శుక్రవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. గాలులు వీయడంతో భారీ వృక్షాలు పడిపోయాయి. ఇదే సమయంలో రైతుల పొలంలో వందలాది ఎకరాలలో ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. అసలే ధరలు లేవని అల్లాడుతున్న రైతులకు అకాల వర్షంతో మరింత దెబ్బతిన్నారు.

April 11, 2025 / 02:21 PM IST