CTR: కుప్పం ఏరియా ఆసుపత్రిలోని టాటా డీజీ నెర్వ్ సెంటర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈసేవలు అందించేందుకు సిబ్బంది కొరతపై ఆరా తీశారు. అదనంగా రెండు వేల మంది సిబ్బంది అవసరమని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పీహెచ్సీలలో డీజీ నెర్వ్ సెంటర్ సేవల తీరును సీఎం వర్చువల్గా పరిశీలించారు.
KDP: రీ కాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని YCP నేతలు నాయకులు విజయవంతం చేయాలని కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంజాద్ భాషా పిలుపునిచ్చారు. గురువారం కడప నగరం రామాంజనేయపురంలోని నూతన YCP కార్యాలయంలో జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
VZM: APSRTC ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 4, 5వ తేదీల్లో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ భానుమూర్తి తెలియజేశారు. గురువారం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మాట్లాడుతూ.. ఉద్యోగులందరికీ గత ఆరేళ్లుగా పెండుంగ్లో ఉన్న ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని, ఖాళీగా ఉన్న 10 వేల మంది సిబ్బంది నియామకాలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ATP: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పొగాకు వినియోగ వ్యతిరేక సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పొగాకు వ్యతిరేకంగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం DMHO దేవి మాట్లాడుతూ.. జూలై 1 నుంచి 21 వరకు పొగాకు వ్యతిరేకంగా సంతకాలు సేకరించాలన్నారు.
KRNL: నందవరం మండలం మిట్ట సోమాపురంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామస్థులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. పింఛన్లు, రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీటి సమస్యలపై ప్రజలు విజ్ఞప్తి చేశారు. సమస్యను పరిష్కరించే విధం కృషి చేస్తానని తెలిపారు.
GNTR: సోషల్ మీడియా మోసాలు పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గురువారం తెనాలి డీఎస్పీ జనార్ధనరావు సూచించారు. ప్రకటనలు చూసి పెట్టుబడులు పెట్టవద్దని, రెట్టింపు లాభాలకు ఆశపడి మోసపోవద్దని హెచ్చరించారు. మోసపూరిత వెబ్సైట్లు, ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కృష్ణా: నియోజకవర్గంలో రూ.3.16 కోట్లతో ఆరు కిలోమీటర్లు తారు రోడ్లు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. గురువారం అవనిగడ్డ ఆర్టీసీ డిపో నుంచి ఏఎస్ఆర్ మండపం వరకు 1040 మీటర్ల తారు రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఉపాధి నిధులతో నియోజకవర్గంలో రూ.32.24 కోట్లతో 46.785 కిలోమీటర్ల మేర 522 సీసీ రోడ్లు నిర్మించినట్లు తెలిపారు.
CTR: ఎస్ఆర్ పురం మండలం ముది కుప్పం పంచాయతీలో గురువారం సుపరిపాలనపై ప్రచార కార్యక్రమం మండల అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు ప్రారంభించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించి కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కుమార్, నిరంజన్ రెడ్డి, పైనేని మురళి, కేఎం రవి పాల్గొన్నారు.
NLR: వరికుంటపాడు మండలం తూర్పు బోయమడుగుల మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ లోకసాని వెంగయ్య బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో తల్లిదండ్రులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు DEO డాక్టర్ ఆర్ బాలాజీ రావు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు MEO -2 రమణయ్య తెలిపారు. సస్పెండ్ కాపీ ఇచ్చేందుకు టీచర్ అందుబాటులో లేరని తెలిపారు.
కర్నూలు: జిల్లాలోని తుంగభద్ర జలాశయానికి గురువారం వరద ప్రవాహం కొనసాగుతోంది. మొత్తం సామర్థ్యం 105.788 టీఎంసులు కాగా, ప్రస్తుతం 77.144 టీఎంసుల నీరు ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 1,633 అడుగులు కాగా, ప్రస్తుతం 1, 625. 20 అడుగులుంది. జలాశయానికి 29, 645 క్యూసెక్కుల ఇన్లో వచ్చిపోతుండగా, 1,701 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.
CTR: సదుం మండలం భట్టువారిపల్లి భారతం మిట్టలో ఈనెల 7 నుంచి మహాభారత యజ్ఞం ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో దీనికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. భాగవతారిణి జ్యోత్స్న ఆధ్వర్యంలో మధ్యాహ్నం హరికథా కాలక్షేపం, నాట్య కళామండలి వారి ఆధ్వర్యంలో రాత్రివేళ నాటక ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు. భక్తులు పాల్గొనాలని కోరారు.
SKLM: ఆముదాలవలస మండలం దూసిపేట గ్రామానికి వెళ్ళే రహదారి పూర్తిగా అధ్వానంగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతల్లో నీళ్లు చేరి బురదమయమైంది. తోగారం, దూసి నుంచి ఈ రహదారి మీదుగా ఆమదాలవలస, రాగోలుకు వెళ్లే వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు.
SKLM: సూపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం శ్రీకాకుళం నియోజకవర్గం తండెంవలస గ్రామంలో గురువారం జరిగినది .ఈ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి పార్టీ పథకాలు ప్రజలు అందరికీ అందుతున్నాయా? లేదా? ప్రభుత్వం పైన మీ యొక్క అభిప్రాయం అన్నీ అడిగితె ప్రజలు చాలా సంతృప్తిగా అన్నీ అందినట్లు ప్రజలు తెలియపరిచారు అని మండల టీడీపీ నాయకులు తెలిపారు.
NDL: శ్రీశైలం మండలం సున్నిపెంట ఫిష్ మార్కెట్ సమీపంలో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో చిరుత పులి 4 కుక్క పిల్లలపై దాడి చేసింది. రెండింటిని చంపేసి, ఒక పిల్లను ఎత్తుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. శివారు ప్రాంతాలలో చిరుతపులుల సంచారం పరిపాటిగా మారిందని అంటున్నారు. రాత్రి వేళలో తీవ్ర భయాందోళనకు గురవుతున్నామని చెబుతున్నారు.
NLR: చెత్త రహిత గ్రామాలుగా పంచాయతీలను తీర్చిదిద్దాలని ZP CEO మోహన్ రావు అన్నారు. గురువారం ఉదయం మనుబోలులోనే అంబేద్కర్ నగర్లో పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు. ఇంటింటికి తిరిగి చెత్తను ఎలా సేకరిస్తున్నారో తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 250 గ్రామాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి చెత్త రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుతామన్నారు.