• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పాఠశాలలో పనులు పరిశీలించిన మంత్రి

ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం పాఠశాలలో జరుగుతున్న పలు నిర్మాణ పనులను మంత్రి స్వామి పరిశీలించారు. ఇవాళ ఆయన పాఠశాలలోనే కాకుండ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అభివృద్ధి పనుల్లో ముందంజలో ఉన్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోట్లతో అనేక సాంఘిక సంక్షేమ హాస్టల్ మరమ్మతులు చేయిస్తున్నట్లు తెలిపారు.

September 9, 2025 / 06:12 PM IST

యూనివర్సిటీలో రేపు క్వాంటం వ్యాలీ హ్యాకథాన్

CTR: శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ధృతి హాల్లో గురువారం ఉదయం 9 గంటలకు అమరావతి క్వాంటం వ్యాలీ హ్యాకథాన్ – 2025 ఫైనల్ రౌండ్ కార్యక్రమం జరుగుతుందని వర్సిటీ కార్యాలయం పేర్కొంది. నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాలకు చెందిన 18 కాలేజీల నుంచి 220 మంది విద్యార్థినిలు పాల్గొంటారని తెలియజేశారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు చెప్పారు.

September 9, 2025 / 06:11 PM IST

‘సూపర్ హిట్’ సభకు ఏర్పాట్లు పూర్తి

అనంతపురంలో రేపు జరగనున్న ‘సూపర్ సిక్స్- సూపర్ హిట్’ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడు లక్షల మందికి పైగా పాల్గొనేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆశీనులయ్యే వేదికను సిద్ధం చేశారు. సభా ప్రాంగణంతోపాటు, నగరాన్ని మొత్తం పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. సభ విజయవంతం అయ్యేందుకు ఎస్పీ జగదీశ్ పకడ్బందీగా చర్యలు చేపట్టారు.

September 9, 2025 / 06:10 PM IST

మద్యం సేవించిన యువకుడుపై కేసు నమోదు

ELR: మద్యం సేవించి వాహనాన్ని నడపడంతో భీమడోలుకు చెందిన ఓ యువకునిపై కేసు నమోదు చేసి మంగళవారం ఏలూరు కోర్టుకు హాజరు పరిచామని భీమడోలు CI విల్సన్, ఎస్సై సుధాకర్ తెలిపారు. ఏలూరు ఫస్ట్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ న్యాయమూర్తి నిందితునికి వివిధ సెక్షన్ల కింద 20 రోజులు జైలు శిక్ష విధించినట్టు తెలిపారు.

September 9, 2025 / 06:10 PM IST

శ్రీశైలంలో యువతికి పోలీసుల కౌన్సెలింగ్

NDL: శ్రీశైలంలో అనకాపల్లి జిల్లాకు చెందిన యువతికి పోలీసులు ఇవాళ కౌన్సెలింగ్ నిర్వహించారు. సీఐ జి. ప్రసాద రావు వివరాల మేరకు. తిట్టి మల్లికా ఓ వ్యక్తికి రూ. 80 వేలు అప్పు ఇచ్చి ఆ వ్యక్తి తిరిగి చెల్లించకపోవడంతో మనస్తాపానికి గురై శ్రీశైలానికి వచ్చారు. అక్కడి పోలీసులతో మాట్లాడి వైజాగ్ బస్సు టికెట్ బుక్ చేసి ఆమెను పంపించామని తెలిపారు.

September 9, 2025 / 06:10 PM IST

‘పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలి’

GNTR: నగరాభివృద్ధికి ప్రజలు ఆస్తి పన్నులను సకాలంలో చెల్లించాలని మంగళవారం గుంటూరు మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు కోరారు. పన్ను బకాయిలు చెల్లించిన వారికి ఆయన అభినందనలు తెలిపారు. ప్రజలు చెల్లించే పన్నుల ద్వారానే మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందని చెప్పారు. బకాయిల వసూలుపై దృష్టి సారించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

September 9, 2025 / 06:07 PM IST

క్యాన్సర్ పేషెంట్ కు రూ. 10,000 ఆర్థిక సహాయం

VSP: విశాఖ దక్షిణ నియోజకవర్గం 39వ వార్డుకి చెందిన క్యాన్సర్ పేషెంట్ మహమ్మద్ రహమతుల్లాకు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మంగళవారం రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు. పేషెంట్ ఇంటికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. తన సొంత నిధులతో మెడికల్ ఖర్చులకోసంఆర్థిక సహాయం అందించినట్లు మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.

September 9, 2025 / 06:07 PM IST

వెంకటగిరిలో సాంస్కృతిక కార్యక్రమాల వివరాలు

TPT: శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ఇవాళ 3వరోజు రాత్రి 7 గంటలకు ప్రారంభంకానున్నాయి. అయితే మొదట కేరళ కళాకారులచే జై హనుమాన్ ప్రదర్శన, కోలాటం, పండరి భజన శ్రీ పోలేరమ్మ ఆర్చ్ సెంటర్ నుంచి కాశీపేట పాత MRO ఆఫీస్ మీదుగా తూర్పు వీధిలోని పాత బస్టాండ్ వరకు జరుగుతుందని తెలిపారు.

September 9, 2025 / 06:06 PM IST

ముగ్గురికి పది సంవత్సరాలు జైలు శిక్ష, జరిమానా: ఎస్పీ

శ్రీకాకుళం: గంజాయి కేసులో ముగ్గురు ముద్దాయిలకు 10 సం.రాలు జైలు శిక్ష, లక్ష రూపాయలు జరిమానా విధించినట్లు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కె.వీ.మహేశ్వర రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బెహరా, త్రినాధరావు, వాసులకు, ఒకటవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి పి.భాస్కరరావు తీర్పును వెల్లడించినట్లు వివరించారు. గంజాయి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

September 9, 2025 / 06:06 PM IST

‘పెండింగ్ వేతనాలు చెల్లించాలి’

KRNL: పెండింగ్‌లో ఉన్న ఉపాధి వేతనాలను తక్షణమే చెల్లించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఇవాళ పెద్దకడబూరు MPDO కార్యలయంలో వినతి పత్రం అందజేశారు. దాదాపు 8 వారాలుగా వేతనాలు చెల్లించలేదని వాపోయారు. అలాగే ఇంటిపన్నుల వసూళ్లు నగర పంచాయితీ, కార్పొరేషన్ తరహాలో వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉపాధి దినాలు 200 రోజులకు పెంచాలన్నారు.

September 9, 2025 / 06:03 PM IST

బాధితులకు ఆర్థిక సాయాన్ని అందజేసిన సేవా సంస్థ

కోనసీమ: రావులపాలెం మండలం పరిధిలోని ఈతకోట గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో కొల్లి సత్యవతి అనే మహిళ పెంకుటిల్లు పూర్తిగా కాలిపోయింది. ఈ నేపథ్యంలో రావులపాలెంకు చెందిన శ్రీ కాశీ అన్నపూర్ణదేవి సేవా సంస్థ ఆధ్వర్యంలో సభ్యులు మంగళవారం పరామర్శించి బాధిత కుటుంబానికి రూ. 30,116 చెక్కును ఆర్థిక సాయంగా అందజేశారు.

September 9, 2025 / 06:00 PM IST

‘నూరు శాతం విద్యాబోధనే ప్రభుత్వ లక్ష్యం’

KKD: బడి ఈడు పిల్లలంతా నూరు శాతం పాఠశాలలోనే ఉంటూ విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తుందని CDPO వై. లక్ష్మి పేర్కొన్నారు. రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. అంగన్వాడీల ద్వారా పిల్లలకు విద్య అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

September 9, 2025 / 06:00 PM IST

రసాభాసగా మారిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

KDP: మంగళవారం జరిగిన ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. YCP ఛైర్మన్ ఫోన్ చేస్తే కమిషనర్ ఫోన్ తీయలేదని వైసీపీ కౌన్సిలర్లు, కమిషనర్ క్షమాపణ చెప్పాలని పట్టుపట్టారు. కమిషనర్ క్షమాపణ చెప్పిన పట్టు విడవకపోవడంతో MLA వరదరాజుల రెడ్డి మున్సిపల్ కమిషనర్‌తో పాటు అధికారులను, టీడీపీ కౌన్సిలర్లను సమావేశం నుంచి బయటికి తీసుకవెళ్లారు.

September 9, 2025 / 05:53 PM IST

స్త్రీ శక్తి భారం కాదు బాధ్యత: ఎమ్మెల్యే

శ్రీకాకుళం: స్త్రీ శక్తి భారం కాదు బాధ్యత అని శ్రీ‌కాకళం ఎమ్మెల్యే శంకర్ అన్నారు. మంగళవారం నగరంలో స్త్రీ శక్తి పథకం ప్రచారంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్త్రీ శక్తి పథకం వల్ల ఎక్కువ మంది మహిళలు లబ్ధి పొందుతున్నారని అన్నారు. త్వరలో మహిళలు, ట్రాన్స్‌ జెండర్లకు స్మార్ట్ కార్డులను అందజేస్తామన్నారు.

September 9, 2025 / 05:52 PM IST

కుప్పంలో చెత్త సేకరణకు CNG వాహనాలు

 CTR: CNG, సోలార్ వాహనాల ద్వారా ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణకు కుప్పం మున్సిపాలిటీలో అధికారులు ఇవాళ శ్రీకారం చుట్టారు. ఈరోస్ కంపెనీ రూ. 60 లక్షల విలువ చేసే 20 సీఎన్జీ ఆటోలతో పాటు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ రూ. 80 లక్షల విలువచేసే కాంప్యాక్టర్ వాహనాన్ని ఎమ్మెల్సీ శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు.

September 9, 2025 / 05:46 PM IST