KDP: సింహాద్రిపురం మండల పరిధిలోని రైతులకు 20 టన్నుల మెట్రిక్ యురియా అందుబాటులో ఉన్నట్లు మండల వ్యవసాయ అధికారి అభిలాష్ తెలిపారు. యూరియా అవసరమైన రైతులు రూ.266 చెల్లించి తీసుకువెళ్లాలని సూచించారు. లోమడ రైతు సేవా కేంద్రాలలో యూరియా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
కృష్ణా: పెనమలూరు (M) కానూరు సనత్నగర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అమీదున్నిసా ప్రమాదానికి గురై మంచానికే పరిమితం కాగా, కుమార్తె నాగుల్బేగం సంరక్షణ చేపట్టింది. ఈనెల 27 రాత్రి కుమార్తె దోమల చక్రం వెలిగించి పక్క షాపుకు వెళ్లి తిరిగి వచ్చేసరికి చీరకు మంటలు అంటుకుని తీవ్రంగా కాలింది. బెజవాడ GGHకు తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది.
అనంతపురం కలెక్టరేట్, రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. డీఆర్వో మలోల, ఇతర శాఖల అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో భూ సమస్యలు, పౌర సేవలకు సంబంధించిన వినతులు అందుతున్నట్లు అధికారులు తెలిపారు.
NDL: డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి 2026 జనవరి 1న ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా జనవరి ఒకటో తేదీన అధికారులు, నాయకులు, కార్యకర్తలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపడానికి పూల దండలు, బొకేలతో వస్తుంటారు. కానీ అలాంటివి వద్దని, మీ అభిమానంతో విద్యార్థులకు ఉపయోగపడే నోటు పుస్తకాలు, పూల మొక్కలు, పండ్లు తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు.
NTR: రాష్ట్ర ప్రభుత్వం జనవరి 8 నుంచి 10 వరకు పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్, బెర్మ్ పార్కు పరిసరాల్లో ఆవకాయ్ అమరావతి ఉత్సవాలు ప్రభుత్వ స్థలంలోనే జరుగుతాయని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. సందర్శకుల భద్రత, శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ దృష్ట్యా నియమ నిబంధనలకు అనుగుణంగా ఎగ్జిబిషన్ అనుమతులను తాత్కాలికంగా రద్దు చేశామని వదంతులు నమ్మవద్దని స్పష్టం చేశారు.
CTR: గుడిపాల మండలం కొత్తపల్లి వద్ద చిత్తూరు-వేలూరు జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. హైవేపై వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. అతను అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడు కొత్తపల్లి గ్రామానికి చెందిన నేసన్గా గుర్తించిన పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. ఘటనపై పోలీసులు కేసి నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
CTR: పుంగనూరు నియోజకవర్గంలో అధికంగా పండించే పంటల్లో టమాటా ఒకటి. కొద్దిరోజులుగా దీనికి మంచి ధర లభిస్తోంది. ప్రస్తుతం కిలో రూ.50 నుంచి రూ.70 వరకు పలుకుతోంది. ఈ నేపథ్యంలో పలువురు రైతులు టమాట సాగుకు మొగ్గు చూపిస్తున్నారు. దీంతో నర్సరీల్లో టమాటా నారుకు గిరాకీ ఏర్పడింది. నారు కోసం రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
SKLM: కార్గో ఎయిర్పోర్ట్ను రద్దు చేయాలని కోరుతూ కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ పిలుపునిచ్చింది. తమ ఊరు–తమ భూమిని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ కార్యక్రమాలను జనవరి 7 నుంచి 13 వరకు అన్ని గ్రామాల్లో నిర్వహించనున్నట్లు CPM జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు ఇవాళ తెలిపారు. కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ సమావేశం సోమవారం నిర్వహించారు.
AKP: సీపీఎం జిల్లా నాయకుడు ఎం అప్పలరాజును హౌస్ అరెస్టు చేసిన నేపాధ్యంలో నక్కపల్లి, ఎస్ రాయవరం మండలాల్లో సీపీఎం బంద్కు పిలుపునివ్వడంతో పోలీసులు రాజయ్యపేట పేటలో ఇద్దరు మత్స్యకార నేతలను హౌస్ అరెస్టు చేశారు. సోమవారం ఉదయం గ్రామానికి వెళ్లిన సీఐలు అప్పన్న, మురళి గ్రామంలో పరిస్థితిని పరిశీలించారు.
VSP: ఎలమంచిలి రైల్వే ప్రమాదం నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రాష్ట్ర హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించి, రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులను కోరారు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు.
EG: సీతానగరం మండలం కూనవరం మిత్తిపాడు గ్రామపంచాయతీ పరిధి ట్రైనీ ఎస్సై సురేష్ బాబు ఆధ్వర్యంలో పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు ఆదివారం రాత్రి 10 గంటలకు కూనవరంలో నలుగురుని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 2600, అలాగే మిత్తిపాడులో ఆరుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.9,900 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు.
VZM: విశాఖ పార్లమెంట్ అధ్యక్షులుగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన పట్టాభిరాంను విశాఖ పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు లెఃక శ్రీను ఆదివారం విశాఖలోని ఎం.వి.పి. కాలనీలో స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్బంగా ఇరువురు పార్టీ కార్యకలాపాలపై కొద్దిసేపు ముచ్చటించారు. కలిసిన వారిలో TDP నాయకులు పాల్గొన్నారు.
AKP: ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డులో సోమవారం ఉదయం ముగ్గురు సిపిఎం నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం అడ్డరోడ్డు జంక్షన్లో సిపిఎం నాయకులు డి. వెంకన్న, శ్రీనివాసరావు, సత్తిబాబు షాపులను మూయిస్తుండగా సీఐ రామకృష్ణ, ఎస్సై విభీషణరావు వారిని అదుపులోకి తీసుకుని ఎస్ రాయవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్రమంగా తమను అరెస్టు చేశారని వారు తెలిపారు.
ATP: కళ్యాణదుర్గంలోని కోటవీధి శ్రీ పట్టాభి రామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు, రథోత్సవ మరమ్మతుల కోసం ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి రూ.50 వేల విరాళం ప్రకటించారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సమక్షంలో ఈ నగదును ఆలయ అభివృద్ధి కమిటీకి అందజేశారు. దాత కేశవరెడ్డి కుటుంబంపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆలయ కమిటీ సభ్యులు ఆకాంక్షించారు.
W.G: తణుకులో ఫ్లెక్సీల వివాదంతో పోలీసుల పహారా కొనసాగుతోంది. తణుకు తేతలి వై జంక్షన్ సమీపంలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఇటీవల టీడీపీ, వైసీపీ నాయకులు వివాదం నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వైఎస్ఆర్ విగ్రహం వద్ద 144 సెక్షన్ విధించడంతో మరోసారి ఫ్లెక్సీలు వివాదం తెరపైకి వచ్చింది.