• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అభ్యుదయ సైకిల్ యాత్ర విశేష ఆదరణ

PPM: మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా పాయకరావుపేట నుండి ఇచ్చాపురం వరకు తలపెట్టిన అభ్యుదయ సైకిల్ యాత్ర నేడు సీతానగరం మండలం మరిపివలస గ్రామం చేరింది. స్థానిక పాఠశాల విద్యార్థులు మాదకద్రవ్యాల పై అవగాహన కల్పించారు. ర్యాలీ నర్శిపురం వద్దకు చేరుకోగానే పార్వతీపురం ఎఎస్పీ మనీషా రెడ్డి సైకిల్ యాత్రకు డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు.

December 8, 2025 / 06:20 PM IST

గంజాయి తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు

SKLM: ఒడిస్సా నుంచి కేరళకు ఆక్రమంగా తరలిస్తున్న రూ.5,000 విలువైన గంజాయిని కొత్తవలస ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద స్వాధీనం చేసుకున్నట్లు సీఐ షణ్ముఖరావు సోమవారం తెలిపారు. అనంతరం నిందితుడిని స్థానిక ఇంఛార్జ్ తహసీల్దార్ సునీత సమక్షంలో హాజరుపరిచినట్లు చెప్పారు. అనంతరం అతనిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కి తరలించినట్లు పేర్కొన్నారు.

December 8, 2025 / 06:17 PM IST

కల్తీ నెయ్యి నిందితులకు 4 రోజుల కస్టడీ

TPT: తిరుమల కల్తీ నెయ్యి కేసులో అరెస్టు అయిన ఇద్దరు నిందితులకు నెల్లూరు ఏసీబీ కోర్టు 4 రోజులు కస్టడీకి అనుమతించారు. ఏ16 అజయ్ కుమార్ సుగంధ్, ఏ29 సుబ్రహ్మణ్యంను ఈనెల 9 నుంచి 12 వ తేదీ వరకు సీబీఐ సిట్ కస్టడీలో విచారించేందుకు న్యాయమూర్తి అనుమతించారు. కాగా ఏ16 బెయిల్ పిటిషన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

December 8, 2025 / 06:16 PM IST

కొండ గుడి భక్తులకు ఉచిత అన్నదానం

VSP: శ్రీ స్వామి వివేకానంద సంస్థ ఆధ్వర్యంలో సోమవారం విశాఖ మేరీ మాత ఉత్సవాల సందర్భంగా కొండ గుడికి వచ్చిన సుమారు 2,000 మంది భక్తులకు ఉచిత అన్నదానం నిర్వహించారు. దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదానం చేశారు. అనంతరం వివేకానంద సంస్థ ఆశ్రమ వాసులకు బంగారు ఉంగరాలను అందజేశారు.

December 8, 2025 / 06:15 PM IST

‘ప్రజల సమస్య పరిష్కారానికి ప్రజా దర్బార్’

SKLM: ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. సోమవారం స్థానిక విశాఖలో ఏ కాలనీలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించిన అనంతరం వారితో స్వయంగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలను అధికారులు పరిష్కరించాలన్నారు.

December 8, 2025 / 06:12 PM IST

PGRSలో 128 పిటిషన్లు స్వీకరించిన ఎస్పీ జగదీష్

ATP: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఎస్పీ జగదీష్ నేతృత్వంలో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి 128 పిటిషన్లను ఎస్పీ స్వీకరించారు. ప్రజలు భయపడకుండా తమ సమస్యలను స్వేచ్ఛగా తెలియజేయాలని, చట్ట పరిధిలో పరిష్కారం చూపుతామని ఆయన హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

December 8, 2025 / 06:11 PM IST

‘ఏసుక్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శం’

KKD: ఏలేశ్వరంలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభముఖ్య అతిథిగా హాజరయ్యారు. యేసుక్రీస్తు ప్రపంచానికి అందించిన ప్రేమ, దయ, కరుణ వంటి శాశ్వత సందేశాలు మానవాళికి మార్గదర్శకం అన్నారు.

December 8, 2025 / 06:11 PM IST

పీజీఆర్ఎస్ నిర్వహించిన ఎస్పీ

PPM: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మాధవరెడ్డి సోమవారం నిర్వహించారు. ప్రజల నుండి వచ్చిన పిర్యాదులను శ్రద్ధగా విని, సంబంధిత పోలీసు అధికారులకు వివరించారు. పిర్యాదుదారుల సమస్యలు సానుకూలంగా స్పందించాలని, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి వారికి న్యాయం చేయాలన్నారు.

December 8, 2025 / 06:11 PM IST

‘ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం’

NLR: ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీఎస్పీ వేణుగోపాల్ సోమవారం తెలియజేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల ఆదేశాల మేరకు దువ్వూరు, పెరమన , సంగం వద్ద ఎన్ హెచ్-67పై ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్, సీఐ గంగాధర్, ఎస్సై రాజేష్, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ రాములు జాయింట్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించారు.

December 8, 2025 / 06:10 PM IST

పీజీఆర్ఎస్‌కు 370 ఫిర్యాదులు

చిత్తూరు: జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మొత్తం 370 ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. వాటిలో రెవెన్యూ, సర్వే శాఖలకు చెందినవి 226 కాగా, పోలీస్ శాఖకు 14, వైద్య ఆరోగ్య శాఖకు 8 ఫిర్యాదులు వచ్చినట్టు తెలిపారు. అందిన ఫిర్యాదులను తక్షణమే పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత విభాగాలకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

December 8, 2025 / 06:09 PM IST

‘ప్రజా సమస్యల పరిష్కారమే పోలీసుల ముఖ్య ధ్యేయం’

అన్నమయ్య: ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం పోలీసుల ప్రధాన బాధ్యతేనని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల వేదికలో ఆయన స్వయంగా హాజరై భూవివాదాలు, కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు, మహిళలపై వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి అర్జీపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

December 8, 2025 / 06:05 PM IST

ఎరులై పారుతున్న మురుగు నీరు

NTR: విజయవాడ తూర్పు నియోజకవర్గం రెండో డివిజన్ గుణదల బెత్లేహేమ్ నగర్ డవున్‌లో మురుగు నీరు ఎరులై పారుతుంది. డ్రైనేజీ నిండి అక్కడ ఉన్న వారికి ఇబ్బందికరంగా మారింది. ఆ నీళ్లలో ఉన్న నాచుకి కాలుజారి పడిపోతున్నారు. వర్షాలు రాకుండానే ఇలా ఉండే వర్షాలు వస్తే పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని స్థానికులు పేర్కొన్నారు. పరిష్కపై అధికారులను స్పందిచాలని వారు కోరుతున్నారు.

December 8, 2025 / 06:05 PM IST

వైద్య, విద్య ప్రైవేటీకరణపై SFI విమర్శ

అన్నమయ్య: రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానంలో వైద్య విద్యను ప్రైవేటు చేతుల్లోకి నెట్టుతున్నదని SFI జిల్లా ఉపాధ్యక్షుడు లతీఫ్ అన్నారు. రైల్వే కోడూరు ఎన్జీవో భవనంలో జరిగిన జిల్లా సమావేశంలో మాట్లాడుతూ.. జీవో 77ను రద్దు చేస్తామని మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ నిలబడలేదని విమర్శించారు. రూ.4700 కోట్ల ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

December 8, 2025 / 06:04 PM IST

గ్రీవెన్స్‌లో 136 అర్జీలు

ASR: రంపచోడవరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో 136 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ITDA PO స్మరణ్ రాజ్ అర్జీలు స్వీకరించారు. కొన్ని సమస్యలు అక్కడే పరిష్కరించారు. వై. రామవరం మండలం చవిటి దిబ్బలు గ్రామంలో జూనియర్ కళాశాల, రాజవొమ్మంగిలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలని ప్రజలు కోరారు.

December 8, 2025 / 06:04 PM IST

పంటలను పరిశీలించిన ఎమ్మిగనూరు ఏడీఏ

KRNL: ఎమ్మిగనూరు మండలం కె. నాగలాపురంలోని మొక్కజొన్న, మిరప, వరి పంటలను ఎమ్మిగనూరు ఏడీఏ మహమ్మద్ ఖాద్రి, మండల వ్యవసయాధికారి శివశంకర్, వ్యవసాయ విస్తరణాధికారి నరసింహులు సోమవారం పరిశీలించారు. ముఖ్యంగా వరి పంట కోత, కంకి దశలో ఉందన్నారు. ఈ పంటకు మాని పండు తెగులు ఆశించిందని అన్నారు. దీని నివారణకు ప్రొవిజినల్ ఒక మిల్లీ లీటరు, ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేయాలన్నారు.

December 8, 2025 / 06:03 PM IST