NDL: ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మన మిత్ర’ వాట్సాప్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కొత్తపల్లి తహసీల్దార్ ఉమారాణి ఇవాళ సూచించారు. ఈ సేవల ద్వారా ధ్రువీకరణ పత్రాలు, RTC, విద్యుత్, రెవెన్యూ, హెల్త్ కార్డులు సహా 160కు పైగా సేవలను ఇంటి నుంచే పొందవచ్చన్నారు. 95523 00009 నెంబర్కు ‘హాయ్’ మెసేజ్ పంపి అవసరమైన శాఖను ఎంపిక చేసుకుని, సమాచారం పొందవచ్చని పేర్కొన్నారు.