MNCL: నెన్నెల మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొమ్మేన హరీశ్ గౌడ్ మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా నియామకమయ్యారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి నియమించి నియామక ఉత్తర్వులు గురువారం జారీ చేశారు. హరీశ్ గౌడ్ మాట్లాడుతూ.. ఎన్నికకు సహకరించిన కాంగ్రెస్ పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.