KRNL: ‘మై భారత్ బడ్జెట్ క్వెస్ట్-2026’లో భాగంగా ప్రధాని మోదీతో జరగనున్న సమావేశానికి రాయలసీమ యూనివర్సిటీ బయోటెక్నాలజీ విద్యార్థిని జె.శివకీర్తి ఎంపికైంది. ఈ విషయాన్ని వీసీ ఆచార్య వి.వెంకట బసవరావు తెలిపారు. గురువారం యూనివర్సిటీలో శివకీర్తిని అభినందించారు. దేశవ్యాప్తంగా 12 లక్షల మంది పాల్గొన్న వ్యాసరచన పోటీలో ఆమె ఎంపిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు.