BHNG: కొండగడపలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామ పెద్దలు, యువకుల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మోత్కూరులో ఉగాది అంటే బోనాల పండుగగా ప్రసిద్ధి చెందగా, ఇక్కడ మాత్రం వేద పండితులు నూతన సంవత్సర ఫలితాలను వివరించారు. ఈ ఆచారం గత కొన్ని దశాబ్దాలుగా వస్తోందని, గ్రామస్థులంతా ఏకమై పంచాంగాన్ని వినడం ఇక్కడి ప్రత్యేకత అన్నారు.