SRCL: వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా రాత్రి ఒక్కసారిగా భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచి ఆలయంలో భక్తుల రద్దీ మామూలుగానే ఉండగా ఒక్కసారిగా భక్తులు భారీగా పెరిగిపోవడంతో ఆలయ అధికారులు రద్దీకి అనుకున్నగా చర్యలు గైకొన్నారు. ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.