NTR: పెనుగంచిప్రోలు నిన్న కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గురువారం పరిశీలించారు. అనంతరం బాధిత రైతులకు మాట్లాడి పంట నష్ట తీవ్రతను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం తరఫున సరైన నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.