కృష్ణా: ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దేవదాయ శాఖ అర్చకులకు ప్రత్యేక పారితోషికం మంజూరు చేసింది. గురువారం జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం అవనిగడ్డలోని శ్రీ రాజశేఖరస్వామి వారి దేవస్థాన అర్చకులు జి.పవన్ శాస్త్రికి ఉగాది పారితోషకం రూ.5,116లను దేవస్థానం ఛైర్మన్ ఘంటసాల రాజమోహనరావు అందచేశారు. దేవదాయ శాఖ ఈవో యార్లగడ్డ వాసు, సిబ్బంది పాల్గొన్నారు.