కోనసీమ: ర్యాలి దేవస్థానంలో శ్రీ జగన్మోహిని కేశవ స్వామి దివ్య కళ్యాణ మహోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని పోస్టర్ను ఆవిష్కరించారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ మెర్ల నాగేశ్వరరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.