BPT: చీరాల టీడీపీ ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, నియోజకవర్గ అధికార ప్రతినిధి మహేంద్ర నాథ్లను గురువారం తెలుగు యువత అధ్యక్షులు దోగిపర్తి బాలకృష్ణ కలిశారు. పార్టీ సేవా కార్యక్రమాలు, జరుగుతున్న అభివృద్ధిని గురించి ప్రజలకు తెలియజేస్తున్న విధానాన్ని ఆయన ఎమ్మెల్యే కొండయ్యకు వివరించారు. అనంతరం వారిరువురికి ఉగాది నామ శుభాకాంక్షలు తెలియజేశారు.