మార్కాపురంలోని కలెక్టరేట్లో ఈ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించడం జరుగుతుందనీ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. కావున ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలియజేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.