కృష్ణా: ఉయ్యూరు రైతు బజార్లో సోమవారం అధికారులు తాజాగా కూరగాయల ధరల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో ఫ్రెంచ్బీన్స్, కాప్సికం కిలో రూ.62తో అత్యధికంగా నమోదు కాగా, క్యారెట్ రూ.26, టమాటా రూ.15, బీరకాయ రూ.24గా నిర్ణయించారు. పచ్చిమిర్చి రూ.45, వంకాయ రూ.20–22, దొండకాయలు రూ.32, బెండకాయ రూ.24, బంగాళాదుంప రూ.24, బీట్రూట్ రూ.28, ఉల్లిపాయలు రూ.23, దోస రూ.26గా ఉంది.