KKD: ప్రత్తిపాడు మండలం ధర్మవరం శివారులో రహస్యంగా నిర్వహిస్తున్న కోడిపందేల స్థావరంపై ఎస్సై లక్ష్మీకాంతం ఆదివారం సాయంత్రం మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రెండు కోడిపుంజులు, రూ.2,550 నగదును స్వాధీనం చేసుకున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.