శ్రీకాకుళం జిల్లా గ్రంథాలయంలో ఉగాది కవి సమ్మేళనం నిర్వహించినట్లు యురవే అధ్యక్షురాలు తంగి ఎర్రమ్మ గురువారం తెలిపారు. యువ తెలుగు రచయితలను ప్రోత్సహించడానికి యురవే ప్రోత్సాహాన్ని, మార్గదర్శకత్వం అందిస్తుందన్నారు. తెలుగు భాషా మాధుర్యాన్ని, కొత్త భావాలను అందిపుచ్చుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా కవులు తమ కవిత్వాలను చదివి వినిపించారు.