BPT: కూటమి ప్రభుత్వం ఏర్పాటై జూన్ నాలుగో తేదికి ఏడాది కావస్తోందని, ఇప్పటివరకూ సూపర్ సిక్స్ హామీలేవీ నెరవేర్చలేదని జిల్లా వైసీపీ అధ్యక్షుడు మెరుగు నాగార్జున విమర్శించారు. అద్దంకిలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆదివారం అయన మీడియా సమావేశం నిర్వహించారు. వైఫల్యాలను ప్రజలకు తీసుకొని వెళ్లాలన్నారు.
NLR: అక్రమ మైనింగ్ కేసులో మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం నగరంలోని డైకాస్ రోడ్డు మాజీ మంత్రి కాకాణి నివాసంలో వారి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి పరామర్శించారు. కాకాణి అక్రమ అరెస్ట్ ను మాజీ ఎమ్మెల్యే ఖండించారు.
ప్రకాశం: రాష్ట్రంలో రేషన్ సరుకుల పంపిణీని మెరుగుపరుస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో ఆదివారం రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని పునఃప్రారంభించారు. రాష్ట్రంలో కోటి 46 లక్షల మందికి రేషన్ షాపుల ద్వారా నాణ్యమైన సరుకులు అందిస్తున్నామన్నారు.
SKLM: ప్రభుత్వ ఉద్యోగిగా విధి నిర్వహణలో చేసిన సేవలు గుర్తింపునిస్తాయని మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. ఆదివారం నరసన్నపేట మండల పరిషత్ సమావేశ మందిరంలో పదవీ విరమణ పొందిన బొడ్డేపల్లి మధుసూదనరావు దంపతులను ఆయన అభినందించి సత్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా చేసిన సేవలు ప్రతి ఒక్కరు గుర్తించుకుంటారని ఆయన కొనియాడారు.
ATP: కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏడాది కాలంలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వైసీపీ క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వెంకట్రాంరెడ్డి వెన్నుపోటు దినం పోస్టర్లను వైసీపీ కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు.
SKLM: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం వస్తుందని ఆయుష్ వైద్యులు డా. పి. జగదీష్ వెల్లడించారు. యోగా ప్రతి ఒక్కరూ చేయవచ్చన్నారు. ఆదివారం 80 అడుగుల రహదారిలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగా పట్ల అందరూ అవగాహన పెంచుకొని యోగాసనాలు వేయడం వలన ఆరోగ్యం మెరుగుపరచుకోవచ్చని చెప్పారు.
SKLM: ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావుకు మామ అని చూడకుండా వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నేడు ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ విమర్శించారు. ఆదివారం నరసన్నపేట వైసీపీ కార్యాలయంలో ఈ నెల 4న జరగనున్న వెన్నుపోటు కార్యక్రమంలో భాగంగా పోస్టర్లు విడుదల చేశారు.
CTR: వెదురుకుప్పం మండలం పేరుమళ్ళుపల్లి డీలర్ షాపును మండల తహశీల్దార్ బాబు, మాజీ ఎంపీటీసీ, టీడీపీ నేత మోహన మురళి ప్రారంభించి సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచి శశికళ ఆనందరెడ్డి, గొడుగుచింత సర్పంచి బాబు, మారేపల్లి సర్పంచి అంబురాసి అశోక్, ఆర్ఎస్ఐ, వీఆర్డీ నరసింహారెడ్డి, మాజీ సర్పంచులు హనుమంతురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సత్యసాయి: లేపాక్షి మండలంలో చౌకధాన్య దుకాణాల వద్ద రేషన్ పంపిణీని తహసిల్దార్, టీడీపీ మండల కన్వీనర్ జయప్ప ప్రకాష్, సీనియర్ నేత ఆదినారాయణ ప్రారంభించారు. గ్రామస్తులకు సమయానికి నాణ్యమైన రేషన్ అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రేషన్ సరఫరా సజావుగా సాగుతోంది.
అన్నమయ్య: రాష్ట్రవ్యాప్తంగా ఓ రోజు ముందే చేపట్టిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో శనివారం రాత్రి 10 గంటలకు అన్నమయ్య జిల్లా రెండో స్థానంలో నిలిచింది. జిల్లాలోని 30 మండలాల్లో 215650 పింఛన్లకు గాను 204317 పింఛన్లు పంపిణీ చేశారు. గ్రామ వార్డు సత్యవారి సిబ్బంది ఉదయం 7 గంటల నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. జిల్లా పింఛన్ల పంపిణీ 94.74 శాతంలో నిలిచింది.
ASR: అరకులోయ మండల కేంద్రంలో రేషన్ షాప్ను అరకు నియోజవర్గం టీడీపీ ఇన్చార్జి దొన్నుదొర ఆదివారం కొబ్బరికాయ పున:ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ షాపుల ద్వారా అనేక అక్రమాలు జరిగాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు చర్యలు చేపడుతుందన్నారు.
అన్నమయ్య: మంగళవారం కలికిరికి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుండి తిరుపతి విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన 2:35 గంటలకు కలికిరి చేరుకోనున్నారు. బుధవారం స్థానికంగా జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొని, తిరిగి గురువారం తిరుపతికి బయలుదేరి, అనంతరం శుక్రవారం హైదరాబాద్ చేరుకుంటారన్నారు.
సత్యసాయి: కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి వద్ద పెట్రోల్ బంకులో పంప్ బాయ్గా పనిచేస్తున్న ఫకృద్దీన్పై దాడి చేసినందుకు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంక్ మేనేజర్ సత్యనారాయణ, పంప్ బాయ్లు అమర్నాథ్, మాబు, హరికృష్ణను నిందితులుగా చేర్చారు. బంక్ నిర్వహిస్తున్న హరిప్రసాద్, ఆయన తండ్రి వెంకటరమణపై కేసు నమోదు చేయలేదు.
ASR: షెడ్యూల్ ప్రాంతంలో 100శాతం ఉద్యోగ నియామక చట్టం చేయాలని ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ సభ్యులు ధర్మన్నపడాల్, రామకృష్ణ కోరారు. ఏజెన్సీలో ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని కోరారు. ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ జూన్ 4వరకూ నిర్వహిస్తున్న జీపు యాత్ర విజయవంతం చేయాలన్నారు. ఈమేరకు ఆదివారం జీ.మాడుగులలో జీపు యాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు.
SKLM: ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో మురుగు కాలువలు చెత్త, వ్యర్థాలతో పేరుకుపోయి దుర్వాసన వస్తోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దుర్వాసనతో పాటు దోమల బెడద రాత్రిళ్లు అధికమైందని అంటున్నారు. పంచాయతీ అధికారులు స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, తాగు నీటి కుళాయిలు, బావుల వద్ద బ్లీచింగ్ పౌడర్ను చల్లి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.