• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ప్రొద్దుటూరులో ఇద్దరు మైనర్ బాలురు అదృశ్యం

KDP: ప్రొద్దుటూరు ఆర్ట్స్ కళాశాల రోడ్డులో తప్పిపోయిన ఇద్దరు బాలుర కోసం పోలీసులు గాలిస్తున్నారు. సంబటూరు వెంకటరమణ కుమారుడు వెంకటదర్శన్ (10వ తరగతి), తన తమ్ముడు లక్ష్మణ్‌తో కలిసి ఆడుకుంటూ ఇంటి నుంచి వెళ్లినట్లు తెలిపారు. సోమవారం నుంచి వారి ఆచూకీ తెలియడం లేదని ఎస్సై సంజీవరెడ్డి పేర్కొన్నారు.

April 29, 2025 / 10:38 AM IST

కోమన్నూతలలో ఎంపీడీవో పర్యటన

KDP: లింగాల మండలంలోని కోమన్నూతల పంచాయతీలో జరుగుతున్న పనులను ఎంపీడీవో శ్రీనివాసులురెడ్డి మంగళవారం పరిశీలించారు. అనంతరం ఉపాధి వేతనదారులకు ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాలపై అవగాహన కల్పించారు.

April 29, 2025 / 10:06 AM IST

రేపే పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష !

KRNL: పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు పూర్తి ఏర్పాట్లు చేయాలని డీఆర్వో వెంకట నారాయణమ్మ ఆదేశించారు. ఈ నెల 30వ తేదీన 11am-1pm వరకు పాలిటెక్నిక్ పరీక్ష జరుగతుందని పేర్కొన్నారు. ఈ పరీక్షకు విద్యుత్తు అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ఆమె ఆదేశించారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాల వద్ద తాగునీటి వసతి కల్పించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

April 29, 2025 / 08:12 AM IST

‘ఆస్తి పన్ను బకాయిలు చెల్లించాలి’

శ్రీకాకుళం: నగరపాలక సంస్థ పరిధిలో గృహ యజమానులు, వాణిజ్య సముదాయ యజమానులు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను బకాయిలను చెల్లించాలని నగరపాలక సంస్థ కోరింది. ఈ నెల 30లోగా చెల్లించాలని, లేకుంటే మే నెల నుంచి అదనంగా 2% వడ్డీ విధిస్తామన్నారు. దీనిపై నగరంలోని పలు వీధుల్లో ఆటోతో అవగాహన కల్పించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

April 29, 2025 / 08:12 AM IST

ఐదుగురి మృతి అత్యంత బాధాకరం: DY.CM పవన్

TPT: పాకాలలో నిన్న ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై DY. CM పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘ఐదుగురు చనిపోయారని తెలిసి ఆవేదనకు లోనయ్యా. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. తిరుమల దర్శనం చేసుకుని తిరుగు పయనమైన భక్తులు ప్రమాదానికి గురికావడం దురదృష్టకరం’ అని పేర్కొన్నారు. అలాగే, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

April 29, 2025 / 08:10 AM IST

నేడు శ్రీశైలం డ్యామ్ పరిశీలన

NDL: నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని బృందం నేడు శ్రీశైలం డ్యామ్ను పరిశీలించనుంది. డ్యామ్ గేట్ల దిగువన ఏర్పడిన భారీ గొయ్యి స్థాయిని అంచనా వేయనుంది. 2009 వరదల కారఎణంగా ఏర్పడిన ఈ గొయ్యి డ్యామ్ భద్రతకు ముప్పు కలిగిస్తోంది. తక్షణమే గొయ్యి పూడ్చివేత పనులను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలపై బృందం సమీక్ష నిర్వహించనుంది.

April 29, 2025 / 08:08 AM IST

చిరుత సంచారం, పాదముద్రలతో గ్రామస్తుల్లో ఆందోళన

KRNL: పత్తికొండ నియోజకవర్గంలోని కృష్ణగిరి మండలం పెనుమాడ గ్రామ సమీపంలోని కొండ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. సోమవారం పులి పాదముద్రలు గుర్తించిన తరువాత, గ్రామంలో భయాందోళన నెలకొంది. కొండలో కుక్కను చంపి తిన్నట్లు కూడా వివరించారు. ఫారెస్టు అధికారులు పాదముద్రలను పరిశీలించి, తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.

April 29, 2025 / 08:01 AM IST

జిల్లా DCMS ఛైర్మన్‌గా సుబ్రహ్మణ్యం నాయుడు

CTR: చిత్తూరు జిల్లా సహకార మార్కెటింగ్ సంఘాల (DCMS) ఛైర్మన్‌గా పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు నియమితులయ్యారు. చంద్రగిరి మండలం పనకపాకం ఆయన స్వగ్రామం. ప్రస్తుతం ఆయన టీడీపీ చంద్రగిరి మండల అధ్యక్షుడిగా వ్యహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

April 29, 2025 / 06:30 AM IST

ఊరు పేరు ఉంది.. కానీ ఎవరు లేరు

శ్రీకాకుళం: ఆమదాలవలస మండలంలో చెవ్వాకులపేట గ్రామానికి సమీపంలో అప్పట్లో కనకముడిపేట అనే గ్రామం ఉండేది. ప్రస్తుతం ఆ ప్రాంతానికి ఊరు పేరు మాత్రం అలానే ఉంది. అక్కడ ఎటువంటి గృహాలు లేవు. 1980లో వంశధార నదికి వచ్చిన వరద ప్రవాహానికి గ్రామం నీట మునిగిపోవడంతో గ్రామస్థులంతా ఖాళీ చేసి ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు.

April 29, 2025 / 06:17 AM IST

‘జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలపై డేగ కళ్లతో నిఘా’

TPT: శాంతి భద్రతల దృష్ట్యా తిరుపతి జిల్లాలోని వివిధ ప్రదేశాలలో అమర్చేందుకు రూ. 10 లక్షల విలువైన 150 సోలార్ కెమెరాలను కొనుగోలు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. కెమెరాలు సౌరశక్తితో పనిచేస్తాయని, ఇవి పర్యావరణానికి అనుకూలంగా ఉండటంతో పాటు అడ్వాన్స్ ఫీచర్స్ కలిగి ఉన్నాయన్నారు. వీటి ద్వారా అసాంఘిక కార్యక్రమాలపై నిఘా ఏర్పాటు చేస్తామన్నారు.

April 29, 2025 / 05:50 AM IST

పాడి పశువుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే

SKLM: జి సిగడాం మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పశువులకు త్రాగు నీటి తొట్లను ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు సోమవారం రాత్రి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పాడి పశువుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు. వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్థానిక నాయకులు ఉన్నారు.

April 29, 2025 / 05:30 AM IST

ట్రైనింగ్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే

SKLM: లావేరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉచిత కుట్టు మిషన్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు సోమవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. 90 రోజులు వీరికి టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చి, ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తామన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

April 29, 2025 / 05:23 AM IST

బాలకృష్ణకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే

W.G: పద్మభూషణ్ అవార్డు అందుకున్న నందమూరి బాలకృష్ణకు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకోవడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. క్యాన్సర్ బాధితులకు బాసటగా నిలుస్తూ తన వంతు సహకారం మరువలేనిదని అన్నారు.

April 28, 2025 / 08:11 PM IST

ప్రమాదం జరిగే వరకూ పట్టించుకోరా..?

KDP: మైలవరం మండలంలో తొర్రివేముల కుంటకట్ట వీధిలో చెట్టుకు విద్యుత్ లైన్ తగిలించారు. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత స్పందిస్తారా అని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. 4 వారాల కిందట గాలి వానకి విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. అధికారులకు తాత్కాలికంగా లైన్‌ను చెట్టుకు ఏర్పాటు చేశారు. కొత్త స్తంభాలు ఏర్పాటు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు.

April 28, 2025 / 08:01 PM IST

ప్రకృతి వ్యవసాయమే ముద్దు

KDP: ముద్దనూరు మండల సమాఖ్య భవనంలో ప్రకృతి వ్యవసాయం గురించి ఖరీఫ్ ప్రణాళికపైన వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని ఏడీఏ వీ.వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో మండల వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకట కృష్ణారెడ్డి ఏర్పాటు చేశారు. ADA మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయం గురించి అవగాహన పొంది సహజ సిద్ధమైన సాగుపైన దృష్టి సారించాలన్నారు.

April 28, 2025 / 06:37 PM IST