• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు: చిర్ల

కోనసీమ: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణపై జిల్లా వైసీపీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. మహిళలను అవమానించేలా మాట్లాడటం అసహ్యకరమని, ఇలాంటి వ్యాఖ్యలు సమాజానికి హానికరమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో అమలాపురం హైస్కూల్ సెంటర్‌లో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.

April 8, 2026 / 08:04 PM IST

‘డంపింగ్ యార్డ్ స్థలం కేటాయించాలి’

EG: ఉండ్రాజవరం (M)తాడిపర్రు గ్రామంలో సమగ్ర భూ కొలతలు పర్యవేక్షణ నిమిత్తం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి బుధవారం పర్యటించారు. బీజేపీ కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ అక్కిన గోపాలకృష్ణ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, డంపింగ్ యార్డ్ కొరత, పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కిసాన్ మోర్చా నాయకులు కలెక్టర్‌ని శాలువ కప్పి సన్మానించారు.

April 8, 2026 / 08:02 PM IST

శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన జేసీ

W.G: ఉండి MRO ఆఫీస్‌లో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు రెండు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని జేసీ రాహుల్ బుధవారం పరిశీలించారు. గృహ, జనగణన డేటా సేకరణకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న వారికి పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. దేశ చరిత్రలో తొలిసారిగా గృహ జనగణన ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించబడుతుందని అన్నారు.

April 8, 2026 / 08:02 PM IST

‘శాంతియుత ఆందోళనను జయప్రదం చేయండి’

NDL: కొలిమిగుండ్లలో సీపీఐ ఆధ్వర్యంలో ఈనెల 10న చేపట్టే శాంతియుత ఆందోళనను జయప్రదం చేయాలని బేతంచర్ల మండల కార్యదర్శి యన్నా భార్గవ్ కోరారు. రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. సిమెంట్ పరిశ్రమలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని, కాలుష్యంతో నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

April 8, 2026 / 08:00 PM IST

రోడ్డుపైకి కరెంటు స్తంభాలు.. ప్రమాదాలకు ఆహ్వానం

BPT: సంతమాగులూరు మండలంలోని గురిజేపల్లి-ఈటీ రోడ్డులో విద్యుత్ స్తంభాల ఏర్పాటు అస్తవ్యస్తంగా సాగుతోంది. నిబంధనల ప్రకారం పాత లైన్ వెనుక స్తంభాలు పాతాల్సి ఉండగా, రోడ్డు మార్గంలోకి వచ్చేలా వేస్తుండటంపై స్థానికులు మండిపడుతున్నారు. దీనివల్ల వర్షాకాలంలో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు కాంతారావు పేర్కొన్నారు.

April 8, 2026 / 08:00 PM IST

గుంటూరులో వైసీపీ బూత్ కమిటీ సమావేశం

GNTR: గుంటూరు నగరంలోని జేకేసీ కాలేజ్ రోడ్డులో ఉన్న వికాస్ ఫంక్షన్ హాల్‌లో వైసీపీ గుంటూరు జిల్లా బూత్ కమిటీ విశృతస్థాయి సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, విజయవాడ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పాల్గొని పార్టీ బలోపేతంపై సూచనలు చేశారు.

April 8, 2026 / 08:00 PM IST

‘ఉచిత విద్యుత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి’

కృష్ణా: చేనేత కార్మికులు ఉచిత విద్యుత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా చేనేత జౌళి శాఖ అభివృద్ధి అధికారి ఆర్. రాజు కోరారు. బుధవారం చల్లపల్లిలోని చేనేత సొసైటీలో చేనేత లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మగ్గం ఉన్న ప్రతి ఒక్క చేనేత కార్మికుని ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు లభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు మధు, ప్రకాష్ పాల్గొన్నారు.

April 8, 2026 / 08:00 PM IST

హింసా రాజకీయాలను వైసీపీ నేతలు మానుకోవాలి: ఎమ్మెల్యే

NTR: నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య బుధవారం తమ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఏబీఎన్–ఆంధ్రజ్యోతి కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. మీడియాపై దాడులు అంటే ప్రజాస్వామ్యంపై దాడులే అని అన్నారు. హింసా రాజకీయాలను వైసీపీ నేతలు మానుకోవాలని కోరారు. ఇటువంటి చర్యలు రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.

April 8, 2026 / 08:00 PM IST

ముప్పాళ్ళలో గగనతళం నుంచి నిఘా

ప్రకాశం: పొన్నలూరు మండలం ముప్పాళ్ళ గ్రామ శివారులలో ఎస్ఐ సత్యనారాయణ బుధవారం డ్రోన్ కెమెరాతో నిఘా నిర్వహించారు. గ్రామ పరిసర ప్రాంతాల్లో అనుమానస్పద కదలికలు గుర్తించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. డ్రోన్ సర్వే లైన్స్ ద్వారా పరిసర ప్రాంతాలు, పంటపొలాలు సమగ్రంగా పరిశీలించారు.

April 8, 2026 / 08:00 PM IST

కోతిని తప్పించబోయి.. కాలువలోకి దూసుకెళ్లిన కారు

PLD: పిడుగురాళ్ల మండలం శివారులో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారంపూడికి చెందిన కొందరు కారులో గుత్తికొండ బిలం వైపు వెళుతుండగా, ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చిన కోతులను తప్పించబోయి వాహనం అదుపుతప్పి నాగార్జునసాగర్ కుడికాలువలోకి దూసుకెళ్లింది. ఇది గమనించిన స్థానికులు తక్షణమే స్పందించి, కారులో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీయడంతో ప్రాణాపాయం తప్పింది.

April 8, 2026 / 08:00 PM IST

‘సీఎం వల్లే కాఫీకి మంచి బ్రాండ్ వచ్చింది’

VSP: గిరిజన రైతులకు ఆర్థిక భద్రత, మార్కెట్ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. బుధవారం విశాఖలో ఆమె సమీక్షా నిర్వహించారు. గిరిజన రైతులు సేకరించే అటవీ ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధరలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సీఎం చంద్రబాబు వల్లే కాఫీకి మంచి బ్రాండ్ వచ్చిందన్నారు.

April 8, 2026 / 07:47 PM IST

యువతకు ఉపాధి అవకాశాలు కల్పనే లక్ష్యం: కలెక్టర్

కోనసీమ: జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యమని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మండలి కమిటీతో జరిగిన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పరిశ్రమల స్థాపన, స్వయం ఉపాధి మెరుగుపరచడంపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

April 8, 2026 / 07:45 PM IST

వైసీపీ నేత బుల్లెట్ సురేశ్ సస్పెండ్

చిత్తూరు జిల్లాలో వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టీజీ సురేశ్ @ బుల్లెట్ సురేశ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీచేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ సిఫార్సులపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

April 8, 2026 / 07:43 PM IST

వేసవి తాపానికి జీవీఎంసీ చర్యలు

VSP: వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని జీవీఎంసీ నగరంలోని 10 జోన్లలో 198 చలివేంద్రాలు, 52 గ్రీన్ షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు బుధవారం అదనపు కమిషనర్ పి. నల్లనయ్య తెలిపారు. హీట్‌వేవ్ యాక్షన్ ప్లాన్‌పై సమావేశం నిర్వహించి అధికారులతో సమీక్షించారు. చలివేంద్రాల్లో తాగునీరు, ORS ప్యాకెట్లు అందిస్తామని తెలిపారు.

April 8, 2026 / 07:43 PM IST

PNG గ్యాస్ సరఫరా అందేలా చర్యలు

TPT: తిరుపతిలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) ప్రాజెక్టుపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావుతో కలిసి పురోగతిని సమీక్షించారు. ప్రజలకు సురక్షితమైన PNG గ్యాస్ సరఫరా అందేలా చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు.

April 8, 2026 / 07:42 PM IST