ప్రకాశం: పామూరులోని ఓ లాడ్జిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కనియంపాడుకు చెందిన వ్యక్తి గ్రామానికి చెందిన వెంగబాబు జీవనోపాధి కోసం బెంగళూరుకు వెళ్లాడు. అక్కడే నివాసం ఉంటున్నాడు. ఏమైందో ఏమో పామూరులో ఓ లాడ్జిలో రూము తీసుకుని ఉరేసుకున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
GNTR: దేశ సరిహద్దుల్లో మన ప్రజల రక్షణకు కవచంలా నిలబడే సైనికుల సేవ, త్యాగాలు వెలకట్టలేనివని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సోమవారం పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. సైనికులు, వారి కుటుంబాలకు సమాజంలోని ప్రతి ఒక్కరూ కృతజ్ఞులై ఉండాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
SKLM: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డులలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు ఇవాళ పర్యటించారు. వార్డులలో పారిశుద్ధ్య నిర్వహణ పనులు ను పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా అన్ని వార్డుల్లో పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను సూచించారు.
VSP: వైసీపీ జిల్లా అధ్యక్షులు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె. రాజు జన్మదిన వేడుకలు ఇవాళ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి ,మాజీ మంత్రులు, శాసనమండలి సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మేయర్, డిప్యూటీ మేయర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు ఏప్పుడు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరిస్తానన...
అన్నమయ్య: మదనపల్లె డిపోకు చెందిన RTC నాన్-స్టాప్ బస్సులో సోమవారం ఉదయం స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పీలేరు సమీపంలోని రొంపిచర్ల క్రాస్ వద్దకు చేరుకున్న సమయంలో బస్సు లోపల అకస్మాత్తుగా పొగలు ఎగసిపడ్డాయి. డ్రైవర్ చాకచక్యంగా బస్సును ఆపి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనంతరం ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానాలకు తరలించారు.
NLR: వరికుంటపాడు మండలం కనియంపాడుకు చెందిన వ్యక్తి పామూరులోని ఓ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన వెంగబాబు జీవనోపాధి కోసం బెంగళూరుకు వెళ్లాడు. అక్కడే నివాసం ఉంటున్నాడు. ఏమైందో ఏమో పామూరుకు వచ్చాడు. ఇక్కడ ఓ లాడ్జిలో రూము తీసుకుని ఉరేసుకున్నాడు. విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో బోరున విలపించారు.
ATP: రాయదుర్గంలోని నాన్ చెరువులో అక్రమంగా మట్టిని తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్ఐ గొల్ల శ్రీరామ ప్రసాద్ తెలిపారు. తమకు అందిన సమాచారంతో సీఐ జయనాయక్ ఆధ్వర్యంలో తమ సిబ్బంది ట్రాక్టర్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని స్టేషన్కు తరలించినట్లు వెల్లడించారు. తదుపరి చర్యల కోసం వాటిని తహశీల్దార్కు అప్పగించినట్లు తెలిపారు.
KRNL: కంది పంటకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తుగ్గలిలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు నబి రసూల్, మండల కార్యదర్శి సయ్యద్ సుల్తాన్ ఆధ్వర్యంలో బెంగళూరు–మంత్రాలయం ప్రధాన రహదారిపై ఆందోళన కొనసాగింది. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు ప్రభుత్వాన్ని తక్షణ చర్యలు తీసుకోవాలనిన్నారు.
W.G: అత్తిలి మండలం మంచిలి గ్రామంలో సోమవారం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ప్రారంభించారు. అత్తిలి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శిరగాని నాగేశ్వరరావు, హైదరాబాదుకు చెందిన బసవతారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని వైద్యులు పేర్కొన్నారు.
E.G: తిమ్మరాజుపాలెంలో శ్రీ శ్రీ శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి తిరునాళ్ల అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం అమ్మవారిని మంత్రి కందుల దుర్గేష్ దర్శించుని నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ అమ్మవారి దయ ఉండాలని ప్రజలకు అభ్యున్నతి, సమృద్ధి కలుగజేయాలని కోరుకున్నారు. తిరునాళ్ళు చివరి రోజు కావడంతో భక్తుల రద్దీ దృష్ట్యా సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు.
ATP: గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను సోమవారం ఆయన నివాసంలో ప్యాపిలి మండలం గుడిపాడు గ్రామానికి చెందిన వాల్మీకి కుల పెద్దలు మర్యాదపూర్వకంగా కలిశారు. గుడిపాడులో వాల్మీకి విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పెద్దలు ఎమ్మెల్యేకు తెలిపారు. దీంతో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, వాల్మీకి విగ్రహాన్ని తన సొంత నిధులతోనే ఇప్పిస్తానని వారికి హామీ ఇచ్చారు.
AKP: పరవాడ గ్రామం ముత్యాలమ్మపాలెం గ్రామంలో గల నిరుద్యోగ యువతకు గతంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు కల్పించాలని విశాఖ ఫార్మాసిటీ ఎండీ లాల్ కృష్ణను పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అధీప్ రాజ్ కోరారు.ఈ మేరకు సంస్థ మేనేజ్మెంట్కు, గ్రామ నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. యువతకు ఏప్పుడు ఏ సహాయం కావాలన్న ముందు ఉంటానని తెలిపారు.
SKLM: టెక్కలి మండలం సైనిక్ నగర్ సమీపంలో ఉన్న స్మశాన వాటిక సమస్యలను పరిష్కరించాలంటూ ఆర్డీవో కృష్ణమూర్తికి సోమవారం బీజేపీ మండల అధ్యక్షులు జర్జాన రాంజీ వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్మశాన వాటికలో పూర్తిగా ముళ్ల పోదలు చెత్తాచెదారంతో నిండి కొన్ని ఏళ్ళు నుండి అభివృద్ధి కాక ఉండిపోయిందని తెలిపారు.
CTR: చిత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని పూనేపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన ముత్యాలమ్మ ఆలయంలో మహా కుంభాభిషేక వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయం వద్ద వేద పండితుల ఆధ్వర్యంలో హోమాలు, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకుని.. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
W.G: కార్మికుల పక్షాన సమరశీల పోరాటాలు చేస్తున్న సీఐటీయూ ఆల్ ఇండియా మహాసభలు జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి పీ.వీ ప్రతాప్ కోరారు. సోమవారం తణుకు అమరవీరుల భవనంలో సీఐటీయూ మండల సమావేశం జరిగింది. డిసెంబర్ 31 నుంచి జనవరి 3 వరకు ఈ సమావేశాలు జరుగుతాయని చెప్పారు. ఈనెల 15న మహాసభలు ప్రారంభ సూచికంగా అన్ని యూనియన్ కార్యాలయాల వద్ద జెండాలు ఆవిష్కరణ చేయాలని కోరారు.