కృష్ణా: ఉయ్యూరు రైతు బజార్లో సోమవారం అధికారులు తాజాగా కూరగాయల ధరల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో ఫ్రెంచ్బీన్స్, కాప్సికం కిలో రూ.62తో అత్యధికంగా నమోదు కాగా, క్యారెట్ రూ.26, టమాటా రూ.15, బీరకాయ రూ.24గా నిర్ణయించారు. పచ్చిమిర్చి రూ.45, వంకాయ రూ.20–22, దొండకాయలు రూ.32, బెండకాయ రూ.24, బంగాళాదుంప రూ.24, బీట్రూట్ రూ.28, ఉల్లిపాయలు రూ.23, దోస రూ.26గా ఉంది.
SKLM: జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక ‘మీ కోసం’ నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్లో అర్జీలు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ఈ వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
KKD: ప్రత్తిపాడు మండలం ధర్మవరం శివారులో రహస్యంగా నిర్వహిస్తున్న కోడిపందేల స్థావరంపై ఎస్సై లక్ష్మీకాంతం ఆదివారం సాయంత్రం మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రెండు కోడిపుంజులు, రూ.2,550 నగదును స్వాధీనం చేసుకున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.
తూ.గో.జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు రాజమండ్రిలో అనూరియా కేసుల క్లస్టర్పై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. కే.వెంకటేశ్వరరావు వివరాలు ప్రకారం రాజమండ్రికి చెందిన నలుగురు వ్యక్తులు అనూరియా లక్షణాలతో ఆసుపత్రిలో చేరినట్లు చెప్పారు. జిల్లా సర్వైలెన్స్ అధికారికి సమాచారం అందించి విచారణ ప్రారంభించామన్నారు.
మార్కాపురంలోని కలెక్టరేట్లో ఈ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించడం జరుగుతుందనీ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. కావున ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలియజేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
PLD: జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు రెవెన్యూ క్లినిక్ జరుగుతుందని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదుల కోసం కలెక్టరేట్కు రావడంతో పాటు, ఇంటి నుంచే మీ కోసం కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. 1100 నంబర్కు ఫోన్ చేసి లేదా Meekosam.ap.gov.in ద్వారా సమస్యలను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
GNTR: వెంకటపాలెం యూనియన్ బ్యాంకులో కస్టమర్లు దాచుకున్న బంగారం మాయమవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది. సుమారు 328 గ్రాముల బంగారం కనిపించకుండా పోయినట్లు ఈ నెల 2న బ్యాంకు మేనేజర్ గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, ఒక మహిళా ఉద్యోగి లాకర్ నుంచి రెండు పౌచ్లను బయటకు తీసుకెళ్లిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు.
GNTR: కొల్లిపర గ్రామానికి చెందిన కొల్లి రామిరెడ్డి (85) ఆదివారం రాత్రి గుదిబండివారిపాలెంలో జరిగిన ఒక శుభకార్యానికి హాజరయ్యారు. అక్కడ భోజనం చేస్తుండగా ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను సమీప ఆరోగ్య కేంద్రానికి తరలించగా, తీవ్ర గుండె నొప్పితో అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
అనంతపురం జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉ.9 నుంచి మ.12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు ఏవైనా సమస్యలు లేదా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు 08554-277626 నంబరుకు కాల్ చేసి సమాచారం పొందవచ్చు.
AKP: ఏయూలో బీజేపీ శ్రేణులు చేసిన విధ్వంసాన్ని విద్యావేత్తలు, ప్రజలు ఖండించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి సీపీఎం కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. బస్సులలో జనాలను తీసుకువచ్చి ఏయూ అధికారులు, పోలీసులపై దాడులకు దిగడం దారుణం అన్నారు. గతంలో ఎన్నడూ ఈ విధంగా జరగలేదన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
GNTR: జాతీయ నృత్య, సంగీత కళా ఉత్సవం గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగింది. నృత్యాలు మన సంస్కృతి, సాంప్రదాయాల ప్రతిబింబమని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్, వెస్ట్ ఎమ్మెల్యే గళ్లా మాధవి, మలినేని కాలేజీ ఛైర్మన్ పెరుమాళ్లు, అపెక్స్ సొల్యూషన్స్ డైరెక్టర్ నరేంద్ర పాల్గొన్నారు.
VZM: జామిలోని శ్రీ ఎల్లారమ్మ తల్లి జాతర మహోత్సవాల సందర్భంగా అమ్మవారిని వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ జాతర మహోత్సవాలలో భాగంగా సోమవారం తొలేళ్ల ఉత్సవం, మంగళవారం అమ్మవారి జాతర, బుధవారం చిన్న తీర్థం జరుగుతుంది. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
కోనసీమ: అమలాపురం ఉపాధి కార్యాలయంలో ఈనెల 26న భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమో విద్యార్హతలు కలిగిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని సూచించారు.
గుంటూరులో నిర్వహించిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే శంకరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిని, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కార్యకర్తలకు తానున్నాననే భరోసా కల్పిస్తూ, ప్రతి సోషల్ మీడియా వారియర్కు అండగా ఉంటానన్నారు.
KRNL: బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో ఆచార్య ఎన్డీరంగా విశ్వవిద్యాలయం, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి సమన్వయంతో జాతీయ తేనెటీగల మండలి ఆధ్వర్యంలో శాస్త్రీయ తేనేటీగల పెంపకంపై 7 రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కేవీకే సమన్వయకర్త డాక్టర్ కె. రాఘవేంద్రచౌదరి తెలిపారు. ఈనెల 25 నుంచి మార్చి 3వ తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయన్నారు.