KRNL: డీఐజీ కార్యాలయంలో హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బందికి నిర్వహిస్తున్న మూడు రోజుల మెడిటేషన్ శిక్షణ కార్యక్రమం మంగళవారం రెండో రోజు కొనసాగింది. సీఎం సూచనలు, డీజీపీ హరీష్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో యోగా ఆసనాలు, ధ్యాన సాధన చేపట్టారు. విధుల్లో ఒత్తిడి తగ్గించేందుకు ధ్యానం ఉపయోగపడుతుందని శిక్షకులు తెలిపారు.
KKD: పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప సామర్లకోట మున్సిపాలిటీలో గత రెండేళ్లలో సుమారు రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. మంగళవారం అంబటి వారి తోటలో రూ.26.50 లక్షలతో నూతన రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రోడ్లు, డ్రైన్లు, అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, త్వరలో రూ. 30 కోట్లతో డ్రైనేజీ ఆధునీకరణ పనులు పూర్తి చేస్తామన్నారు.
కోనసీమ: అల్లవరం మండలం బోడసకుర్రులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు మంగళవారం ఎన్డీఏ నాయకులు చక్కటి మజ్జిగ అందించారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు అడపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కూలీలకు సంబంధించి ప్రభుత్వం నుంచి కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
సత్యసాయి: బక్రీద్ వేళ జిల్లాలో పొట్టేళ్లకు భారీగా డిమాండ్ పెరిగింది. సాధారణ ధరల కన్నా ఏకంగా నాలుగు రెట్లు ఎక్కువకు పొట్టేళ్లు అమ్ముడు పోతున్నాయి. మాములు రోజుల్లో రూ.10 నుంచి రూ.15 వేలు పలికే పొట్టేళ్ల ధర.. బక్రీద్ డిమాండ్ కారణంగా రూ.30 నుంచి రూ.50 వేలకు పెరిగింది. మెలి తిరిగిన కొమ్ములు.. బలిష్టంగా ఉన్న పొట్టేళ్లు, మేకపోతుల ధర మరింత ఎక్కువగా ఉంటోంది.
ప్రకాశం: కొమరోలు మండలం కత్తులవానిపల్లిలో మంగళవారం తెల్లవారుజామున గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య ఆధ్వర్యంలో పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోగా, 8 వాహనాలకు జరిమానా విధించారు. గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, దొంగతనాలు నివారించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
PPM: విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ సి.యస్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంఛార్జ్ ఐటీడీఏ పీవో యశ్వంత్ కుమార్ రెడ్డి గిరిమిత్ర హాల్లో ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల విద్యాసంస్థలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
CTR: ఈనెల 28వ తేదీన జరుగు బక్రీద్ పండుగ ఏర్పాట్లను అంజుమన్ కమిటీ సభ్యుల తో కలసి CI సుబ్బరాయుడు మంగళవారం పరిశీలించారు. పుంగనూరు పట్టణంలోని NS పేటలోని ఈద్గా మైదానానికి చేరుకున్నారు. తర్వాత ఏర్పాట్లపై చర్చించి తగు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రార్థనలు జరిగేటప్పుడు ఎలాంటి ఆటంకాలు జరగకుండా ట్రాఫిక్ను మళ్లించనున్నట్లు CI తెలిపారు.
GNTR: పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ జిల్లాలో ముగ్గురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను పంపిణీ చేశారు. పెదకాకాని మండలానికి చెందిన నంబూరు పాము రాజు, తక్కెళ్లపాడు అన్నపూర్ణ, ఉప్పలపాడు ఎమ్మెల్యమ్మలకు మంగళవారం రూ.1.80 లక్షల విలువైన ఈ చెక్కులను ఆయన అందజేశారు.
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం టీడీపీ క్యాంప్ కార్యాలయంలో ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న మహానాడు వేడుకల నేపథ్యంలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి మండల క్లస్టర్ ఇన్ఛార్జ్లు, కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. మహానాడును విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు.
VZM: కొత్తవలస సంత మార్కెట్ ఎదురుగా శ్రీ సత్యసాయి మందిరం వారిచే మజ్జిగ చలివేంద్రం మంగళవారం ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రత దృష్టిలో ఉంచుకుని పలు గ్రామాల నుంచి సంతకు వచ్చేవారు వడదెబ్బ బారినపడకుండా ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు కన్వీనర్ రవికుమార్ చెప్పారు. ప్రతి మంగళవారం క్రమం తప్పకుండా చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ఏలూరు తూర్పువీధి శివాలయం వద్ద మంగళవారం చెత్త ట్రాక్టర్ నుంచి మెయిన్ రోడ్డుపై చెత్త పడిపోయింది. రద్దీగా ఉండే ప్రధాన రహదారి కావడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెత్త పడిన విషయం తెలిసినా ట్రాక్టర్ సిబ్బంది పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. అధికారులు స్పందించి చెత్తను తొలగించాల్సిందిగా కోరారు.
NTR: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విజయవాడ త్రీ ట్రాఫిక్ పోలీసులు మానవత్వం చాటుతున్నారు. రోడ్ల వెంట దాహంతో అలమటిస్తున్న గోవులు, కుక్కలకు త్రాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. సీఐ సుధాకర్ సూచనలతో పలు ప్రాంతాల్లో నీటి తొట్టెలు ఏర్పాటు చేయగా, ఏఎస్ఐ మెహర్ స్వయంగా గోవులకు నీరు అందించారు. సిపి ఆదేశాలతో ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
CTR: గంగాధర నెల్లూరు మండలంలోని పాచిగుంట గ్రామంలో గంగ జాతరను మంగళవారం వైభవంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి విగ్రహాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని.. మొక్కులు చెల్లించారు. గంగ జాతర సందర్భంగా పలువురు నాయకులు పట్టు వస్త్రాలు సమర్పించారు. జాతర పురస్కరించుకుని గ్రామంలో సందడి నెలకొంది.
NTR: జిల్లా నందిగామలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటలకే 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కంచికచర్ల, వీర్లపాడు, చందర్లపాడు మండలాల్లో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని, వడదెబ్బ బారిన పడకుండా మజ్జిగ, మంచినీరు, కొబ్బరి నీళ్లు ఎక్కువగా సేవించాలని వైద్యులు సూచిస్తున్నారు.