• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సోమందేపల్లిలో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు

సత్యసాయి: ప్రతి మనిషి తన శాశ్వత నివాసమైన సమాధి కోసం బ్రతికే ఉన్నప్పుడే సిద్ధం చేసుకోవాలని మౌలానా మహమ్మద్ ఇలియాజ్ తెలిపారు. సోమందేపల్లిలోని జామియా మజీద్‌లో ఆదివారం ముస్లిం సోదరులు 25వ ఉపవాసాన్ని ఆచరించి ఫజర్ నమాజ్ నిర్వహించారు. అనంతరం ఖురాన్ బోధనలు చేశారు. ఈ సందర్భంగా ఐదు పూటల నమాజ్ చేయడంతో పాటు దానధర్మాలు చేసి సమాజానికి మంచి చేయాలని మౌలానా సూచించారు.

March 15, 2026 / 11:32 AM IST

అంకాలమ్మ తల్లి జాతరలో టీడీపీ అధ్యక్షులు

అన్నమయ్య: రాయచోటి పట్టణం పాతరాయిచుటిలో నిర్వహించిన అంకాలమ్మ తల్లి జాతర మహోత్సవం కన్నుల పండగ సాగింది. ఈ కార్యక్రమానికి రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు, టీడీపీ పాలక మండలి మాజీ సభ్యులు శ్రీనివాస్ ప్రసాద్ బాబు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

March 15, 2026 / 11:29 AM IST

రగ్బీ రాష్ట్రస్థాయి పోటీలకు కేజీబీవీ బాలికలు

కర్నూలులో రగ్బీ రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలు జరిగాయి. ఇందులో కోసిగి కేజీబీవీ నుంచి శిరీష, శృతి హాసిని, సుధ రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈ నెల 19, 20, 21, 22 కర్నూలులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారు. అదే విధంగా సీనియర్ రగ్బీ ఆటలో కోసిగి కేజీబీవీ పీఈటీ సుమ మంచిగా రగ్బీ ఆడి సీనియర్ రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.

March 15, 2026 / 11:26 AM IST

కుటుంబంతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి

ప్రకాశం: రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ఆదివారం కుటుంబ సమేతంగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తి భావంతో స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు పోవాలని ఆకాంక్షించారు. TTD భక్తులకు చేస్తున్న ఏర్పాట్లు ఆశాజనకంగా ఉన్నాయని అన్నారు.

March 15, 2026 / 11:17 AM IST

300 కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లు పంపిణీ

ATP: రాప్తాడు మండలం ప్రసన్నయపల్లి పంచాయతీ చిన్మయనగర్‌కు చెందిన టీడీపీ కార్యకర్త భాష తన మిత్రుల సహకారంతో 300 ముస్లిం కుటుంబాలకు రంజాన్ సందర్భంగా తోఫా కిట్లు పంపిణీ చేశారు. అనంతపురం క్యాంప్ కార్యాలయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత నిర్వహించిన కార్యక్రమంలో ఒక్కో కుటుంబానికి 6 రకాల వస్తువులతో కూడిన రంజాన్ తోఫా కిట్‌ను అందజేశారు.

March 15, 2026 / 11:16 AM IST

రేపు మార్కాపురంలో PGRS కార్యక్రమం

మార్కాపురం జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో స్పష్టంగా రాసుకొని అధికారులకు అందజేయాలని కోరారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

March 15, 2026 / 11:12 AM IST

తణుకులో కార్డన్ అండ్ సెర్చ్

W.G: తణుకులోని ఇరగవరం రోడ్డు కాలనీలో పోలీసులు ఇవాళ ఉదయం కార్డన్ అండ్ సెర్చ్ చేపట్టారు. తెల్లవారుజాము నుంచి నివాసాల్లో సోదాలు చేసి అనుమానితులను విచారించారు. సరైన పత్రాలు లేని పలు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. CI డి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సుమారు 60 మంది పోలీసు సిబ్బంది ఈ ఆపరేషన్ లో పాల్గొని శాంతి భద్రతలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

March 15, 2026 / 11:11 AM IST

రేపటి నుంచి ‘రైతన్నా మీకోసం’ వారోత్సవాలు

KRNL: రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి 25 వరకు ‘రైతన్నా మీకోసం’ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా AO పీఎల్ వరలక్ష్మి తెలిపారు. ఉగాది, రంజాన్ సెలవుల కారణంగా ఈ నెల 19 నుంచి 4 రోజుల పాటు విరామం ఉంటుందని చెప్పారు. రైతులతో సమావేశాలు నిర్వహించి 2026-27 వ్యవసాయ సంవత్సరానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు పేర్కొన్నారు.

March 15, 2026 / 11:10 AM IST

చెవిలో పూలతో స్విమ్స్ కార్మికులు వినూత్న నిరసన

TPT: ఏడుకొండలవాడా.. వెంకటరమణ నీవే మా దిక్కు అంటూ స్విమ్స్ కార్మికుల చెవిలో పువ్వు, పంగనామాలు పెట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. స్విమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులు కనీస వేతనాలు ఇవ్వాలన్న డిమాండ్ల సాధన కోసం చేపట్టిన పోరాటం 16వ రోజుకు చేరుకుంది. యాజమాన్యం ఇచ్చిన హామీలు అమలు చేయాలని CITU నాయకుడు సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు.

March 15, 2026 / 11:07 AM IST

మానవత్వం చాటుకున్న ADCC బ్యాంక్ చైర్మన్

ATP: గార్లదిన్నె మండలం సిరివరం గ్రామానికి చెందిన నారాయణస్వామి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ADCC బ్యాంక్ చైర్మన్ ముంటి మడుగు కేశవరెడ్డి మానవత్వం చాటుకున్నారు. మెరుగైన వైద్యం కోసం బాధితుడికి ఆదివారం రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. నిరుపేద కుటుంబాలను ఆదుకోవడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

March 15, 2026 / 11:03 AM IST

గ్యాస్ ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు

CTR: జిల్లాలో వంట గ్యాస్ సరఫరా సజావుగా సాగుతోందని, ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని JC ఆదర్శ్ రాజేంద్రన్ తెలిపారు. గ్యాస్ సరఫరాపై వినియోగదారుల సందేహాలను నివృత్తి చేసేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదులు, సందేహాలు ఉంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 08572-242734 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు.

March 15, 2026 / 11:01 AM IST

బొడ్డు వెంకటరమణకు నారా భువనేశ్వరి సన్మానం

E.G: హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూడా ఛైర్మన్, తూర్పుగోదావరి జిల్లా TDP అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఆయనను శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు.

March 15, 2026 / 11:00 AM IST

‘ బస్సుల సమయాలలో మార్పులు’

కోనసీమ: 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం సోమవారం నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు అమలాపురం ఆర్టీసీ డిపో మేనేజర్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఉచితంగా పరీక్ష కేంద్రాలకు చేరవచ్చ అని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం పరీక్ష సమయానికి అనుగుణంగా బస్సుల సమయాలలో మార్పులు చేశామన్నారు.

March 15, 2026 / 11:00 AM IST

రాయవరంలో అక్షరాంధ్ర పరీక్ష ప్రారంభం

AKP: ఎస్.రాయవరం మండలంలో ‘అక్షరాంధ్ర పరీక్ష’ ఆదివారం ప్రశాంతంగా ప్రారంభమైంది. మండలంలో 93 కేంద్రాల్లో 4,000 మంది పరీక్ష రాస్తున్నట్లు ఉపాధి హామీ పథకం ఏపీడీ ఎరకయ్య తెలిపారు. 10 గంటలకు ప్రారంభమైన పరీక్ష సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందన్నారు. పరీక్ష రాసే అబ్యాసకులకు అవసరమైన సౌకర్యాలను పరీక్ష కేంద్రాల్లో కల్పించమన్నారు. అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారన్నారు.

March 15, 2026 / 10:54 AM IST

ముత్యాలపాడులో చెత్తలోనే చెత్త బండ్లు..!

NDL: ప్రభుత్వం ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమాలతో పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తుండగా, కిందిస్థాయి సిబ్బంది మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చాగలమర్రి మండలం ముత్యాలపాడులో గ్రామపంచాయతీకి చెత్త తరలించేందుకు మంజూరైన చెత్త బండ్లు వినియోగం లేక చెత్తలోనే కూరుకుపోయాయి. దీంతో అధికారుల తీరుపై గ్రామస్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

March 15, 2026 / 10:52 AM IST