• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నవజీవన్ చిల్డ్రన్ హోమ్ తనిఖీ

VZM: విజయనగరం, కేఎల్‌పురంలో నిర్వహిస్తున్న శిశు గృహం, కనపాకలో నిర్వహిస్తున్న నవజీవన్ చిల్డ్రన్ హోమ్‌ను జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి కృష్ణ ప్రసాద్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హోమ్‌లో ఉంటున్న బాల బాలికలకు సరైన వసతి సౌకర్యాలు ఉన్నవి లేనిది తనిఖీ చేశారు. పిల్లలకి అందిస్తున్న ఆహారం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

September 8, 2025 / 07:20 PM IST

ఉపాధ్యాయురాలిని సన్మానించిన తోటి ఉపాధ్యాయులు

E.G: గురుపూజోత్సవ సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు అందుకున్న రోబ్బి. కృష్ణవేణిని గోకవరం జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు, అవుట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులు ఇవాళ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. గోకవరం మండలంలో 20 సంవత్సరాలుగా నిబద్దతో పనిచేస్తూ, విద్యార్థులతో కలిసిపోయారన్నారు.

September 8, 2025 / 07:17 PM IST

‘చెరువులో జరుగుతున్న అవినీతిని అడ్డుకోండి’

NLR: దగదర్తి గ్రామ చెరువు పరిధిలో యదేచ్ఛగా గత కొంతకాలం నుంచి అక్రమంగా నల్లతుమ్మ చెట్లను రవాణా చేస్తున్నారు. చెరువు కట్టను ధ్వంసం చేసిన విషయంపై టీడీపీ నేత మాలేపాటి రవీంద్ర నాయుడు ఇవాళ పలువురు అధికారులను కలిశారు. కొంతమంది స్వలాభం కోసం చెరువులో ఉన్న నల్లతుమ్మ చెట్ల కట్టెలను అమ్ముకోవడం పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారులకు వినతి పత్రాన్నిఅందజేశారు.

September 8, 2025 / 07:16 PM IST

‘యూరియా లభ్యతపై అపోహలను నమ్మవద్దు’

W.G: తణుకు మండలంలో రైతులకు తగినంత యూరియా అందుబాటులో ఉందని యూరియా లభ్యతపై అపోహలు నమ్మవద్దని తణుకు వ్యవసాయ సహాయ సంచాలకులు జి.నరేంద్ర తెలిపారు. తణుకు మండలం తేతలి పీఎసీఎస్‌ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన యూరియా అవుట్‌ రీచ్‌ కార్యక్రమంలో భాగంగా రైతులకు అవగాహన కల్పించారు.

September 8, 2025 / 07:16 PM IST

గుంటూరులో సూపర్ సిక్స్-సూపర్ హిట్ విజయోత్సవ సభ

GNTR: గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మాధవి ఆధ్వర్యంలో సోమవారం సూపర్ సిక్స్-సూపర్ హిట్, స్త్రీ శక్తి విజయోత్సవ సభ ఏటుకూరు రోడ్డులో జరిగింది. ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటుందని, భవిష్యత్తులో కూడా ప్రజలు తమ ప్రభుత్వానికి ఇదే విధంగా మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సభలో నాయకులు, కర్యకర్తల పాల్గొన్నారు.

September 8, 2025 / 07:15 PM IST

సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన కర్నూలు DIG

ATP: కర్నూలు రేంజ్ DIG కోయ ప్రవీణ్ అనంతపురంలో పర్యటించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 10న నగరానికి వస్తుండటంతో భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. జిల్లా ఎస్పీ, కూటమి నాయకులతో సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు. సభ ఏర్పాట్లను సహచర ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి డీఐజీకి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని వివరించారు.

September 8, 2025 / 07:12 PM IST

‘మసీదుల ఇమామ్‌లు, మౌజన్లకు 11 నెలలుగా జీతాలు చెల్లించాలి’

BPT: మసీదులలో పనిచేసే మౌజనులు,ఇమామ్‌లకు11 నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదని చీరాలకు చెందిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ కబీర్ చెప్పారు. జిల్లా వైసీపీ మైనార్టీ నాయకులతో కలిసి ఆయన సోమవారం ఈ విషయమై బాపట్ల జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఐదు పూటలా మసీదులలో నమాజ్ చేయించే వారికి మరో పని చేసుకునే అవకాశం ఉండదన్నారు.

September 8, 2025 / 07:12 PM IST

ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

ప్రకాశం: పెనమలూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డీకే.బాలాజీ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పలు రికార్డులను పరిశీలించారు. పెనమలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలపై పలువురు రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఈ సందర్భంగా సూచించారు.

September 8, 2025 / 07:11 PM IST

చెక్కు బౌన్స్ కేసులో వ్యక్తికి జరిమానా

VZM: చెక్కు బౌన్స్ కేసులో వ్యక్తికి జైలు జరిమానా విధిస్తూ గజపతినగరం కోర్టు న్యాయమూర్తి విజయ్ రాజ్ కుమార్ సోమవారం సాయంత్రం తీర్పు చెప్పారు. గజపతినగరం మండలం పురిటిపెంట న్యూ కాలనీకి చెందిన కంది వెంకటరమణ జక్కువకు చెందిన బాలి రాముకు ఇచ్చిన చెక్కు బౌన్స్ కావడంతో వెంకటరమణకు రెండు సంవత్సరాలు జైలు శిక్షతోపాటు 10 లక్షలు జరిమానా విధించారు.

September 8, 2025 / 07:08 PM IST

మూగ బాలికపై అత్యాచారంపై.. మాజీ మంత్రి ఏమన్నాంటే?

TPT: మూగ బాలికను రక్షించలేని ఈ ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అంటూ మాజీ మంత్రి రోజా మండి పడ్డారు. విశాఖపట్నం సీతమ్మధారలో ఆదివారం సాయంత్రం ఓ మూగ బాలికపై దుండగులు అత్యాచారానికి పాల్పడిన ఘటన తెలిసిందే. దీనిపై ఆమె ‘X’ వేదికగా స్పందించారు. బాలికపై అత్యాచారం జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.

September 8, 2025 / 07:08 PM IST

రైతుల ముసుగులో రాజకీయాలు సహించం: బీటెక్ రవి

కడప: పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి సోమవారం రైతులతో సమావేశమయ్యారు. రైతుల ముసుగులో రాజకీయాలు చేస్తే సహించేది లేదన్నారు. నిజమైన రైతుకు పూర్తి న్యాయం చేస్తామని పేర్కొన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సరైన గిట్టుబాటు ధరలు కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పుకొచ్చారు.

September 8, 2025 / 07:07 PM IST

‘అన్నదాతలకు అండగా వైసీపీ పార్టీ’ పోస్టర్ ఆవిష్కరణ

E.G: ఎరువులు కొరతపై అన్నదాతలకు వైసీపీ పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ అన్నారు. ఇవాళ కొవ్వూరు పార్టీ కార్యాలయంలో YCP ఇంఛార్జ్ తలారి వెంకటరావు ఆధ్వర్యంలో ‘అన్నదాతలకు అండగా వైసీపీ పార్టీ’ అనే పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ  మేరకు ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎరువులు సక్రమంగా అందించేవరకు పోరాడుతామని తెలిపారు.

September 8, 2025 / 07:06 PM IST

గ్రామ స్థాయిలో యూరియా అవగాహన బృందాలు ఏర్పాటు

PLD: పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు యూరియా కొరతపై రైతుల ఆందోళనలను తొలగించడానికి గ్రామ స్థాయిలో అవగాహన బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ బృందాల్లో వీఆర్వో, మహిళా పోలీసు, వ్యవసాయ, ఉద్యాన సహాయకులు సభ్యులుగా ఉంటారన్నారు. ప్రతి రైతు వద్దకు వెళ్లి యూరియా కొరత లేదని వివరించాలన్నారు.

September 8, 2025 / 07:06 PM IST

పుంగనూరులో ఇంటి తలుపులు పగలగొట్టి చోరీ

CTR: పుంగనూరు పట్టణం చింతల్ వీధిలో గుర్తుతెలియని దుండగులు ఓ ఇంటి తలుపులు పగలగొట్టి ఆభరణాలు దోచకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ఇంటి యజమాని హరి ప్రసాద్ కుటుంబ సభ్యులతో తిరుపతికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దుండగులు తలుపులు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఈ మేరకు సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

September 8, 2025 / 07:04 PM IST

కలెక్టర్‌కు గంగమ్మ జాతర ఆహ్వాన పత్రిక

TPT: వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఆహ్వాన పత్రికను ఇవాళ జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్‌కు ఆలయ అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు అర్చకులు పాల్గొన్నారు.

September 8, 2025 / 07:01 PM IST