NDL: ప్రభుత్వం ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమాలతో పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తుండగా, కిందిస్థాయి సిబ్బంది మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చాగలమర్రి మండలం ముత్యాలపాడులో గ్రామపంచాయతీకి చెత్త తరలించేందుకు మంజూరైన చెత్త బండ్లు వినియోగం లేక చెత్తలోనే కూరుకుపోయాయి. దీంతో అధికారుల తీరుపై గ్రామస్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.