కోనసీమ: 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం సోమవారం నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు అమలాపురం ఆర్టీసీ డిపో మేనేజర్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఉచితంగా పరీక్ష కేంద్రాలకు చేరవచ్చ అని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం పరీక్ష సమయానికి అనుగుణంగా బస్సుల సమయాలలో మార్పులు చేశామన్నారు.