ప్రకాశం: రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ముండ్లమూరు పరిసర ప్రాంతాలలో గురువారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం పడింది. వాహనదారులకు ఆతరాయం కలిగింది. సాధారణంగా ఈ కాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. కానీ వర్షం పడటం వలన ప్రజలకు ఎండల నుంచి కొంత ఉపశమనం దొరికింది.