కృష్ణా: మొవ్వ మండలం కూచిపూడి గ్రామాన్ని స్వచ్ఛ సుందర కూచిపూడిగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు గ్రామస్థులు సహకరించాలని అధికారులు ఈరోజు సూచించారు. కూచిపూడి గ్రామంలోని పసుమర్తి ధర్మచెరువు పరిసరాలు, ఆర్ అండ్ బీ రోడ్డు పక్కన జరిగిన ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించాలని కూచిపూడి ఎస్సై సురేష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి అంకబాబు కోరారు.