NTR: విజయవాడ వెటర్నరీ కాలనీ యూత్ హాస్టల్ ఖాళీ స్థలాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుతో కలిసి ఎంపీ కేసినేని చిన్ని ఆదివారం పరిశీలించారు. ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విజయవాడ అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. కానీ కార్పొరేషన్ పాలకవర్గంలో ఉన్న వైసీపీ నాయకులు నగర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని విమర్శించారు.