ATP: రాష్ట్రంలో దివ్యాంగులకు రేపటి నుంచి RTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పూల నాగరాజు మంగళవారం తెలిపారు. పల్లె వెలుగు నుంచి మెట్రో ఎక్స్ప్రెస్ వరకు అన్ని సర్వీసుల్లో ఈ వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు. ‘దివ్యాంగ శక్తి’ పథకం ద్వారా కూటమి ప్రభుత్వం వీరికి భరోసా కల్పిస్తోందని ఆయన చెప్పారు.