TG: ఈనెల 22 నుంచి రైతుభరోసా నిధులు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో 60లక్షల మందికి పైగా రైతులకు ఈ నిధులు జమ చేస్తామన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సన్న బియ్యం పండించే రైతులకు రూ.500 బోనస్, యంత్ర పరికరాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.