RR: ఐక్యత, సోదరభావంతో పండుగలు జరుపుకోవాలని యాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి సూచించారు. రంజాన్, శ్రీరామనవమి పండుగలను.. మన సంప్రదాయాలను గౌరవిస్తూ శాంతియుత, ఆహ్లాదకర వాతావరణంలో భక్తిభావంతో నిర్వహించుకోవాలని ఆయన కోరారు. శాంతిభద్రతల పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని అన్నారు. ఎవరైనా ఉత్సవాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.