ADB: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు గోడం నగేశ్ అన్నారు. ఈ మేరకు బీజేపీ జిల్లాధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్తో కలిసి కలెక్టర్ రాజర్షి షాకు వినతిపత్రం అందజేశారు. రైతులందరికీ రుణమాఫీ జరగలేదన్నారు. రైతు భరోసా సకాలంలో అందకపోవటంతో రైతులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.