KRNL: పెసలబండ వాటర్ స్కీం ద్వారా పది రోజులైనా త్రాగునీరు సరఫరా కావడం లేదని కొత్తూరు గ్రామంలో సీపీఎం, గ్రామ ప్రజలు ఖాళీ బిందెలతో ఇవాళ నిరసన తెలియజేశారు. సీపీఎం శాఖ కార్యదర్శి కర్ణ, నాయకులు నాగరాజు మాట్లాడుతూ.. వేసవి కాలంలో పది రోజులైనా త్రాగునీళ్లు రావడంలేదని వెంటనే త్రాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.