TPT: విద్యుత్ బిల్లుల పేరుతో వినియోగదారులను మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులు అవలంభిస్తున్నారని ఏపీఎస్పీడీసీఎల్ CMD శివశంకర్ లోతేటి తెలిపారు. బిల్లు బకాయి ఉందని మెసేజ్లు పంపి OTP అడుగుతున్నారని, ఇలాంటి మెసేజ్లకు స్పందించవద్దని సూచించారు. సందేహాలుంటే టోల్ ఫ్రీ నంబర్ 1912ను సంప్రదించాలని తెలిపారు.