NTR: చంద్రబాబుపై రాళ్లదాడి కేసులో నిందితులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. 2022లో చందర్లపాడు రోడ్షోలో రాళ్లదాడి చేసిన కేసులో అరెస్ట్ అయిన నలుగురికి మంజూరైన బెయిల్ను కోర్టు రద్దు చేసింది. అప్పట్లో పోలీసులు నిందితులను నందిగామ కోర్టులో హాజరుపర్చగా బెయిల్ మంజూరైంది. అయితే వెంటనే బెయిల్ రద్దు చేయాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను విచారించి బెయిల్ రద్దు చేసింది.