WGL: జిల్లాలో విషాదం నెలకొంది. నర్సంపేట పట్టణంలోని శశి ఆసుపత్రి వైద్యుడు డా.శశిధర్ రెడ్డి ఆదివారం అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన గుండెపోటుతో మరణించి ఉండవచ్చని తోటి వైద్యులు భావిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు, సిబ్బంది దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన మృతికి సంబంధించి కారణాలపై స్పష్టత లేదు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.