NRML: లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.8 లక్షల నిధులు మంజూరైనట్లు మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన నిధుల ప్రోసిడింగ్ కాపీని గ్రామస్థులలకు అందజేశారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.