SDPT: మిరుదొడ్డి మండలంలో ఆదివారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అందే గ్రామంలో జరిగే ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటలకు దుబ్బాక రూరల్ మండలంలోని పెద్దమ్మ దేవాలయాన్ని దర్శించుకోనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పర్యటన వివరాలను వెల్లడించింది.