MDK: రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ గ్రామంలో ఆదివారం పారిశుధ్య కార్మికులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రజలకు సేవలు అందిస్తున్న పారిశుధ్య కార్మికులను సర్పంచ్ ఉమా సంజీవరెడ్డి సన్మానం చేశారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యానికి అండగా ఉంటున్న కార్మికుల సేవలు మరువలేనివని అన్నారు.