ప్రకాశం: మర్రిపూడి మండలంలో 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన శిలాశాసనం వెలుగులోకి వచ్చింది. శనివారం ఆర్కాలజీ అధికారులు సన్నుమూరు సమీపంలోని శివాలయం వద్ద ఈ శాసనాన్ని గుర్తించారు. ఎంతో చరిత్ర కలిగిన శాసనం బయటపడటంతో స్థానిక గ్రామస్తులు చూసేందుకు ఆసక్తి కనబరిచారు. ఈ శాసనాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నట్లు పరిశోధకుడు నాగిరెడ్డి తెలిపారు.