PLD: శావల్యాపురం మండలం బొందిలిపాలెం గ్రామంలోని శ్రీ అడివి పేరంటాలమ్మ అమ్మవారి తిరుణాల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు.