TG: హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా హైడ్రోపోనిక్ గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. రూ.3 కోట్ల విలువైన 9 కేజీల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలను తెలుసుకోవాడానికి నిందితులను విచారిస్తున్నారు.
AP: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో దారుణం జరిగింది. సుధాకర్ అనే అనుమానంతో భార్య శ్రీలేఖను హత్యచేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లి ముచ్చుకోట అటవీ ప్రాంతంలో పడేశాడు. అనంతరం పెద్దపప్పూరు PSలో లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుణ్ని విచారిస్తున్నారు.
AP: తిరుపతి జిల్లా యర్రావారి పాల్యం మండలంలో విషాదం నెలకొంది. నెరబైలు పంచాయతీ పరిధి పొలాల్లో రెండు ఏనుగులు మృతిచెందాయి. అడవి పందుల నుంచి పంట రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగల కంచె తగిలి ఏనుగులు మరణించినట్లుగా తెలుస్తోంది. నెరబైలు ఫారెస్ట్ బంగ్లా సమీపంలో ఈ ఘటన జరగ్గా.. అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు.
AP: గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిలో డయేరియా కలకలం రేగింది. 25 మంది హాస్టల్ విద్యార్థులు, సిబ్బంది 3 రోజులుగా వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. అందరికీ ఎయిమ్స్లోని ప్రత్యేక వార్డులో చికిత్స కొనసాగుతోంది. డయేరియాకు నీటి కాలుష్యమే కారణమా అన్న కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు. నీరు ఎక్కడ కలుషితమైందో తెలుసుకునేందుకు 40 చోట్ల శాంపిల్స్ తీసుకున్నారు.
TG: హైదరాబాద్లోని మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. బైక్ను కారుతో ఢీకొట్టి డ్రైవర్ పరారయ్యాడు. ఈ క్రమంలో ఒకరికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. అయితే కారు డ్రైవర్ను స్థానికులు వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కర్ణాటక బళ్లారిలోని ఓ స్కూల్ హాస్టల్లో దారుణం జరిగింది. తోటి విద్యార్థి హేమంత్ను భరత్ కత్తితో పొడిచాడు. అడ్డుకోబోయిన ఆరుగురు 9వ తరగతి విద్యార్థులకు గాయాలయ్యాయి. అయితే హేమంత్ది కర్నూలు జిల్లా సమ్మతగేరి స్వగ్రామం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అనకాపల్లి జిల్లా ఏటికొప్పాకలో బాలుడి మృతదేహం కలకలం సృష్టించింది. పోలవరం కాలువ దగ్గర మృతదేహం ఉన్న ఫొటోలు SMలో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులు వెళ్లేలోపు బాలుడి మృతదేహం మాయమైంది. ఘటనా స్థలంలో రక్తపు మరకలు తుడిచేసిన ఆనవాళ్లు కనిపించాయి. పోలీసులు కొండకింద పొదల్లో మృతదేహం గుర్తించారు. మరకలు శరీరంపై బలమైన గాయాలు ఉండటంతో నాటుతుపాకీతో కాల్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
TG: ఆగ్రాలో తెలంగాణ ఈగల్ టీమ్ భారీ ఆపరేషన్ చేపట్టింది. హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ ముడిసరకు రవాణా చేస్తున్న డెన్ను ఆగ్రాలో ఈగల్ టీమ్ గుర్తించింది. ఈ క్రమంలో 10 కిలోల మెపిడ్రిన్, 1000 లీటర్ల ముడిసరుకును సీజ్ చేసింది. ఐదుగురిని అరెస్ట్ చేసి ఆగ్రా పోలీసులకు అప్పగించింది.
AP: మార్కాపురం జిల్లా చిన్న గుడిపాడు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబు ట్రయల్ రన్ మినీ వ్యాన్ ఓ యువకుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకర్ వెంకన్న(25) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ కాన్వాయ్ బైకర్ను రాంగ్ రూట్లో వచ్చి ఢీకొట్టినట్లు సమాచారం.
బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. కొమిల్లా ప్రాంతంలో శనివారం పూజ చేసుకుంటున్న హిందువుల బృందంపై గుర్తు తెలియని దుండగులు బాంబులు విసిరారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు సమాచారం. పూజారి కేశవ్ చక్రవర్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
AP: రాజమహేంద్రవరం బొమ్మూరు ట్రాన్స్కో స్టోర్స్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇప్పటికే వినియోగించి తీసుకొచ్చిన స్క్రాప్ మీటర్లు ఉంచిన చోటు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న 6 అగ్నిమాపక శకటాలు మంటలను అదుపు చేస్తున్నాయి.
KKD: పిఠాపురం బైపాస్ రోడ్డులో ఆదివారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. విరవాడ జంక్షన్ వద్ద బైక్ను తప్పించబోయి కారు అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొంది. విద్యుత్ స్తంభం విరిగిపోయినా, పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. స్థానికులు గాయపడిన వారిని వెంటనే కాకినాడ ఆసుపత్రికి తరలించారు.
AP: నిద్రిస్తున్న విద్యార్థులపై తోటి విద్యార్థి కత్తి, రాడ్లతో దాడి చేశాడు. ఈ దాడిలో కర్నూలుకు చెందిన హేమంత్ కుమార్ అనే విద్యార్థి మృతిచెందాడు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. అడ్డుకున్న మహిళా వార్డెన్, సెక్యూరిటీపైనా దాడి చేసి విద్యార్థి పరారయ్యాడు. డ్రగ్స్కు బానిసలై ఇలా ప్రవర్తిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటన కర్ణాటకలోని బళ్లారిలో జరిగింది.
నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్లోని వెస్ట్ బుకింగ్ కౌంటర్ వద్ద గుర్తు తెలియని (45) వ్యక్తి శనివారం రాత్రి మృతి చెందారు. అనారోగ్యంతో మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో ఆ వ్యక్తిని గుర్తించలేకపోయారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం GGHకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
NLR: వలేటివారిపాలెం మండలం పొన్నలూరు మండలం మాలపాడు సరిహద్దు ప్రాంతంలో నిర్వహిస్తున్న కోడిపందేల స్థావరంపై శనివారం పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పందేల్లో పాల్గొన్న 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 3 కోడిపుంజులు, 23 సెల్ ఫోన్లు, రూ.42,860 నగదును స్వాధీనం చేసుకున్నారు.