AP: గుంటూరు GGH ఆస్పత్రి భవనం పైనుంచి దూకి రోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెన్నంశెట్టి శ్రీనివాస్ అనే వ్యక్తి కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఈనెల 23న ఆస్పత్రిలో చేరాడు. కాలకృత్యాలు తీర్చుకునే గది వద్ద ఉన్న కిటికీ పైనుంచి దూకాడు. మృతుడి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా ఉండి గ్రామం. మృతుడి భార్య కొన్నిరోజుల కిందట మరణించినట్లు సమాచారం. శ్రీనివాసులుకు ఇద్దరు కుమారులు ఉన్నట్లు సమాచారం.